Publish Date:Jul 11, 2025
ఏపీకి అప్పులు పుట్టకుండా, పెట్టుబడులు రాకుండా ఒక కుట్ర. అది కూడా విదేశాల నుంచి వైసీపీ చేస్తోన్న పన్నాగం. జర్మనీలో ఒక ప్రముఖ సంస్థలో పని చేసే ఉదయ్ భాస్కర్ అనే ఒక వైసీపీ మద్ధతుదారు చేత బాంబే ఎక్స్ ఛేంజీకి ఏకంగా 200 మెయిళ్లు పంపేలా చేశారంటే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
ఈ విషయాన్ని ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఆధారాలతో సహా చూపించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు.. విచారణకు ఆదేశించారు. అంతే కాదు దీని వెనక ఎంతటి వారున్నా వదలకూడదని స్పష్టం చేశారు. దీంతో పాటు.. ఈ విషయం పబ్లిక్ లోకి మరింతగా తీసుకెళ్లే బాధ్యత కూటమి నేతలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఈ విషయంపై స్పందించిన ఆర్ధిక శాఖ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బుగ్గన... తమ హయాంలో కూడా ఎందరో ఇలాంటి కథనాలు వండి వార్చారు. అలాగని మేము ఆగామా? అంటూ లైట్ తీసుకునే మాటలు మాట్లాడారు. అంతే కాదు.. ఒక మెయిల్ వల్ల మీ రుణాలు, పెట్టుబడులు ఆగిపోతాయా? అని ప్రశన్నించారు. అయితే.. బుగ్గన వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి పయ్యావుల కేశవ్.. ఇది స్టేట్ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీకి సంబంధించిన విషయంమన్నారు. గతంలో మీ హయాంలో 2024 మార్చిలో 7 వేల కోట్లకు ఇలాగే రుణం కోసం ప్రయత్నించారు. మీపై నమ్మకం లేక పెట్టుబడి దారులు రుణం ఇవ్వలేదు. ఇది విశ్వాసానికీ, విశ్వసనీయతకూ సంబంధించిన అంశం కనుకే.. ఇటువంటి చర్యలను దేశ ద్రోహం కింద తీసుకుని.. తద్వారా.. కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబును కోరామని చెప్పారు.
వైసీపీకి తొలి మొదటి నుంచీ ఇలాంటి అలవాటు ఉందనీ, వారు రాష్ట్ర పరువు ప్రతిష్టలను దెబ్బ తీయడమే ధ్యేయంగా పని చేస్తుంటారని.. ఇప్పటి వరకూ అదే జరిగిందనీ అన్నారు. ఈ విషయంపై పూర్తి విచారణ చేసి.. దీని వెనక ఎవరున్నారో కనిపెట్టి తీరాలని పయ్యవుల కేశవ్ అన్నారు. అయినా ఇలాంటి వాటి ద్వారా కూడా నష్టం జరుగుతుందా? అంటే ఇది వరకు హిడెన్ బర్గ్ రిపోర్ట్ అదాని సంస్థలను తీవ్రంగా దెబ్బ తీయలేదా? ఇదీ అలాంటిదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి మరి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా విద్వేషపూరిత పనులు చేసే వారికి విదేశాల్లో చాలా పెద్ద శిక్షలే వేస్తారు. దానికి తోడు ఇది నైతికతకు సంబంధించిన విషయం. ఇటీవలి కాలంలో కొందరి ఉద్యోగాలు సరిగ్గా ఇలాంటి అనైతిక కార్యకలాపాల వల్లే పోయాయని గుర్తు చేస్తున్నారు. ఉదయ్ భాస్కర్ వంటి వారు ఇలాంటి చర్యలకు పాల్పడే ముందు ఆలోచించాలని సూచిస్తున్నారు నిపుణులు. రాజకీయ ఆరోపణలు చేయడం వేరు. ఇలా పకడ్బందీగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసేవిధంగా వ్యవహరించడం వేరని.. ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పకుంటే కష్టమనీ సూచిస్తున్నారు రాష్ట్ర శ్రేయోభిలాషులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hatred-mails-harmful-to-state-intrests-25-201739.html
దేశంలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం మరోసారి ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సిద్ధమని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఏంటీ జగన్ మోహన రెడ్డి ఇప్పటి వరకూ తనపై ఉన్న 31 కేసులలో 3452 సార్లు.. వాయిదాలు తీసుకుని ప్రపంచ రికార్డు సృష్టించారా? ఇందుకోసంగానూ ఆయన 6904 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశారా? ఆశ్చర్యం కలిగిస్తున్నా.. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. బేసిగ్గా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన ఐదేళ్ల పదవీ కాలంలో .. సీఎంగా తన హోదా కారణంగా బిజీబిజీ అంటూ వాయిదాల మీద వాయిదాలు తీసుకున్నసంగతి తెలిసిందే.
బంజారాహిల్స్లోని రోడ్డు నంబర్ 1/12లో రోడ్డు కుంగిపోయింది. అటు వచ్చిన వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా దిగబడిపోయింది. దీంతో వాటర్ ట్యాంకర్ డ్రైవర్తో పాటు క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై దీర్ఘకాలంగా సాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమపై ఉన్న క్రిమినల్ కేసును క్వాష్ చేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం అనుమతించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై డిపాజిటర్ల నుంచి ఎటువంటి అభ్యంతరం, ఆరోపణా లేకపోవడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.
ఋతుపవన ద్రోణి, బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ పట్టణంలో క్లౌడ్ బరస్ట్ ధాటికి కొండ చరియాలు విరిగిపడ్డాయి. వరద ప్రవాహంతో వందలాది ఇళ్లను ముంచేంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యింది. ఈ విషయాన్ని సీబీఐ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేయడంతో.. ఇప్పడు చర్చ ఈ కేసులో కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిపైకి మళ్లింది.
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరంటారు. ఏదీ మన చేతుల్లో ఉండదు. మరణం ఎప్పుడు, ఎలా రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం. పెద్ద పెద్ద ప్రమాదాల బారిన పడి కూడా ప్రాణాలతో బయటపడే వారుంటారు.
రాజకీయ నాయకుల భాష తీరు మారాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు.
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (79) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు.