దేశంలో బాబాలు పడ్డారు! నాయకులు సాష్టాంగ పడ్డారు!

Publish Date:Aug 2, 2024

Advertisement

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)

2024 జులై 2న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో 123 మంది మరణించారు. ఎనభై వేల మందికి పర్మిషన్‌ తీసుకుని, రెండున్నర లక్షల మందిని అనుమతించడం వల్ల తొక్కిసలాట జరిగింది. తనను తాను దైవాంశ సంభూతుడిగా ప్రకటించుకున్న భోలే బాబా అసలు పేరు అక నారాయణ శంకర్‌ హరి, ఉరఫ్‌ సూరజ్‌ పాల్‌ జాతవ్‌. అతను గతంలో పోలీసు కానిస్టేబుల్‌, రేప్‌ కేసులో ఇరుక్కున్నందువల్ల ఉద్యోగం ఊడిపోయిందని చెపుతారు. అయితే, తనమీద కేసులేవీ లేవని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్యోద్యోగం నుంచి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నానని ఈ భోలే బాబా చెప్పుకుంటాడు. దళితుడిగా ఉద్యోగంలో చేరినా, ఇక ఇప్పుడు ఆ విషయం ఎక్కడా ఎత్తడు. అలిఘర్‌ గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్డులో సువిశాలమైన స్థలంలో విలాసవంతమైన ‘ప్రవాస్‌ ఆశ్రమం’ ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఉండే వసతులన్నీ అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆస్తి వందల కోట్లు ఉంటుందని అంచనా. తన ఆస్తిపాస్తుల వ్యవహారాలు చూసుకోవడానికి, లీగల్‌ కేసుల్ని పరిష్కరించడానికి ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేశాడు. దాని పేరు శ్రీ నారాయణ హరి సకర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌. భోలే బాబా తెల్లని  సూట్‌ వేసుకుని, టై కట్టుకుని, నల్ల కళ్ళద్దాలతో సినిమా హీరోలాగా స్టైలిష్‌గా అభిమానులకి దర్శనమిస్తుంటాడు. ఆయనకు పెళ్లికాని యువతులు స్నానం చేయిస్తారు. అన్నం తినిపిస్తారు. మిగతా అన్ని పనులు చేస్తారు. టయోటా ఫార్చునర్‌లో బయలుదేరాడంటే వెంట మోటార్‌ సైకిళ్ల మీద కమెండోలు అనుసరిస్తారు. ఒక వివిఐపి వెళుతున్నట్టుగా వాళ్లు రోడ్డు ఆక్రమిస్తారు. ఏ అధికారం లేకపోయినా, ప్రజల మూర్ఖత్వమే తన బలం అన్నట్టు-అతని ప్రోటోకాల్‌ ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఈ విషయం ఏ మాత్రమూ పట్టించుకోవు. జన సామాన్యానికి అసౌకర్యం కలుగుతోందని పోలీసులు అడ్డగించరు. వివేకం నశించిన వారు ప్రభుత్వంలో, ప్రభుత్వ సంస్థల్లో ఉన్నారు కాబట్టి, ఈ దేశంలో ఇలాంటి దొంగ బాబాల, సన్యాసుల ఆటలు సాగుతున్నాయి. హత్రాస్‌ తొక్కిసలాట మరణాలకు సంబంధించి-ఎఫ్‌.ఐ.ఆర్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యనిర్వహకుల పేర్లు చేర్చారు కానీ, అసలైన భోలే బాబా పేరు చేర్చలేదు. అంటే భోలే బాబాకు పరిపాలకులకు ఉన్న మైత్రీ బంధం స్పష్టంగా కనిపిస్తోంది కదా? రాజ్యాంగంలోని ఆర్టికల్‌ ‘51ఎ’కి వ్యతిరేకంగా పాలకులు ప్రవర్తిస్తున్నట్లే కదా? 

ఈ దొంగ బాబా అభిమానులు, ఆరాధకులు మాత్రం పేద కుటుంబాలకు చెందినవారు, నిమ్న కులాల వారు, వెనుకబడిన జాతుల వారు.ఈ బోలే బాబాకు అతీంద్రియ శక్తులున్నాయని, చనిపోయిన వారిని బతికిస్తాడని, అతని పాదాల కింద మట్టిని తీసుకుపోయి తమ దగ్గర ఉంచుకుంటే సుఖసంతోషాలు, భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని నమ్మే ప్రజలకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? అదే నిజమైతే బోలేబాబా తన అద్భుత, అతీంద్రియ శక్తులతో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రాణం పోయాలి కదా? మరణించిన వారికి ఎందుకు అలా వదిలేశారూ? భోలే బాబా దర్శనం చేసుకున్న వారికి, ఆయన సత్సంగ్‌లో పాల్గొన్న వారికి ఆయురారోగ్యాలు లభించాలి కదా? ఐశ్వర్యవంతులు కావాలి కదా? మరి ఇన్నేళ్లుగా జనానికి ఇవి ఎందుకు లభ్యం కావడం లేదూ? దారిద్య్రం వారిని ఇంకా ఎందుకు వెంటాడుతూ ఉంది? ఆలోచించే పనే లేదా? బాబాలందరూ అతి సామాన్యమైన నేపథ్యంలోంచి వస్తారు. కానీ, సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతారు. ప్రయివేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటారు. రాజకీయ నాయకులతో సత్సంబంధాలు పెట్టుకుని, తమ దురాగతాలు బయటపడకుండా జాగ్రత్త పడతారు. 

ఆశారాం బాపూ కావొచ్చు, గురుమీత్‌ రామ్‌ రహీమ్‌ కావొచ్చు, ఇచ్ఛాధారి భీమానంద్‌ చిత్రకూట్‌ వాలే కావచ్చు, చంద్రస్వామి కావచ్చు, స్వామి అమృత చైతన్య కావొచ్చు, స్వామి సదాచారి కావచ్చు, కృపాలూ కావొచ్చు, జగ్గీ వాస్‌దేవ్‌ కావొచ్చు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ రవిశంకర్‌ కావొచ్చు, నిత్యానంద్‌ కైలాస్‌ కావొచ్చు, దేవ నాథన్‌ కావొచ్చు, వీళ్లందరి మీద అత్యాచారం కేసులున్నాయి. లేదా ఆదివాసుల, పేదల భూములు ఆక్రమించిన కేసులున్నాయి. లేదా పర్యావరణానికి తీవ్రంగా నష్టం కలిగించిన కేసులున్నాయి. మరి పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ, షాలు ఏం చేస్తున్నట్టూ?దేశ నాయకులకు దొంగబాబాలకు తేడాయే లేకుండా పోయింది. ఇంకా వీరిని జైలుకు పంపేదెవరూ? స్వయాన భార్యను చంపినవాడు సద్గురుగా చలామణి అవుతున్నాడు. అతని యోగా సెంటరు నుంచి మాయమైన ఆరుగురి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.ఆదివాసుల భూములాక్రమించి ఈశా(ఈశ్వరా) ఫౌండేషన్‌ స్థాపించిన వాడికి ఈ పరిపాలకులు శిక్ష విధించగలరా? విధించలేరు. కారణం ఏమిటంటే వారు చేస్తున్న దురాగతాలు అలాంటివే కాబట్టి!  జస్టిస్‌ లోయను చంపించారనే ఆరోపణలున్న వారికి దేశంలో శిక్షే లేదు. ఒక ఫేక్‌ డిగ్రీతో చలామణి అవుతున్న వారి దగ్గర మన విద్వార్థిలోకం ‘నీట్‌’ పేపర్‌ లీకయ్యిందని మొరపెట్టుకుంటున్నారు. ఎలా ఉన్న దేశం! ఎలా అయిపోయిందీ? 

దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నవారే ప్రజా స్వామ్య పరిరక్షణ గూర్చి మాట్లాడుతున్నారు. దొంగ సర్టిఫికెట్లు, దొంగ డిగ్రీలు సమర్పించి ఐఏఎస్‌లైన వారి మీద మీడియా తెగ ఉత్సాహం ప్రదర్శిస్తోంది. అది చేయాల్సిన పనే, దేశ ప్రజలు సంతోషిస్తున్నారు కూడా! మరి ప్రధాని మోడీ, అతని అనుచరుల సర్టిఫికెట్ల మీద ఈ మీడియా ఎందుకు ప్రశ్నించదూ? ఇలాంటి ఎన్నో విషయాల గూర్చి విసుగెత్తి ఈ దేశ ప్రజలు ప్రధాన మీడియాకు దూరమయ్యారు. విదేశీ మీడియాలో, యూట్యూబ్‌ ఛానళ్లలో వాస్తవాలు ఏరుకొంటున్నారు. ఓటర్లను అంధ విశ్వాసంలో ముంచి, జనాన్ని తమ భక్తులుగా/ అనుచరులుగా/ బాబాలు మార్చుకుంటూ ఉంటే- అంధ విశ్వాసంలో మునిగిన ఆ భక్తుల్నే ఈ దేశ నాయకులు తమ ఓటర్లుగా మార్చుకుంటున్నారు. వివేకం, విజ్ఞత లేని గొర్రెల్లాంటి జనమే వీరిరువురికీ అవసరం! బాబాలు ప్రజల్లో పుణ్యం, పాపం లాంటి భయాల్ని కలిగించి, ధన ప్రాప్తి లాంటి ఆశలు కల్పిస్తారు. దేశ నాయకులు అదే పని చేస్తున్నారు కదా? పుల్వామా అంటారు. పాకిస్థాన్‌ అంటారు. మెజారిటీ హిందువులకు మైనార్టీలయిన ముస్లింల వల్ల భద్రత లేదంటారు. భారత్‌లోకి చైనా, ఎన్నికిలో మీటర్లు చొచ్చుకుని వచ్చిందో, ఎంత భూమి ఆక్రమించిందో చెప్పండంటే మాత్రం నోరువిప్పరు. ఈ దేశ స్థాయిని ఇంతగా దిగజార్చిన నేటి ఈ ‘దేశభక్తి’ దేశ పాలకులకు-ఈ దేశ ప్రజలు ఏ విధమైన శిక్ష విధించాలి? ఒకరు జాతీయ స్థాయిలో, మరొకరు ప్రాంతీయ స్థాయిలో ఉన్నారు కానీ-మోసం చేయడంలో, ప్రజల ప్రాణాలు హరించడంలో భోలే బాబా అయినా, వేరే బాబా అయినా…  అందరూ ఒకటే! భోలే బాబా అక్కడ నిలబడి, మరణించిన వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సింది పోయి దొంగ దారిన పారిపోయాడు. పదిహేను రోజుల తర్వాత తన ఆశ్రమానికి తిరిగివచ్చి, చనిపోయిన వారికి సంతాపం/ నివాళి వంటివి ప్రకటించకుండా ‘‘చేసిన ఖర్మలకు ఎలాంటి వారైనా ఫలితం అనుభవిస్తారని, దాన్ని ఎవరూ తప్పించలేరన్’’ మెట్ట వేదాంతం వల్లించాడు. అంటే, ప్రజలు వారి ఖర్మానుసారమే తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారన్నమాట!

సంప్రదాయ వాదులకు నచ్చే ఒక అభూత కల్పన గురించి చూద్దాం- వాళ్లు పురాణాల్లో రాసుకున్నట్టు – సముద్ర మథనం జరిగింది, ఫలితంగా అమృతం, కామధేనువు, గరళం, అవినీతి వంటివి బయట పడ్డాయి. మొదటి రెండు మంచివి, దేవతలు తీసుకుపోయారు. మిగిలిన రెండింటిని ఈశ్వరుని ముందు పెట్టారు. ‘ఈ రెండిండినీ నేను స్వీకరించ లేను. ఒక్కటే స్వీకరిస్తాను. అయితే ఉన్న రెండింటిలో గరళాన్ని ఎవరూ భరించలేరు గనక, లోక కళ్యాణం కోసం నేను గరళం తాగుతున్నాను’ – అని శివుడు తాగేశాడు. మిగిలిన ‘అవినీతిని’ కొందరు భూ మండలం మీదున్న భారతదేశానికి తీసుకొచ్చారు. అక్కడ ఉన్న అతి పెద్ద రాజకీయ పార్టీ ఆ అవినీతిని మనసారా ఆహ్వానించి, స్వీకరించింది. తమ దగ్గర వాషింగ్‌ మిషన్‌ ఉందనీ అందులో ఎంతటి అవినీతినైనా ఉతికి శుభ్రపరుచుకుంటామనీ ప్రకటించింది. అప్పటి నుండి అవినీతి పరులైన రాజకీయ నాయకులు ఎక్కడ ఉన్నా వారిని ఆ పార్టీ ఆకర్షిస్తోంది. ఆ రకంగా దేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చేస్తోంది. ఎంతటి అవినీతి జరిగినా, ఏమీ జరగనట్టు – తమ మూర్ఖత్వానికి అందమైన మేకప్‌ వేసి ఆ పార్టీ వారు దేశ ప్రజల ముందుకు తేగలుగుతున్నారు. ఎన్నికల బాండ్లు ఒక స్కామ్‌, రామాలయం ఒక స్కామ్‌, విదేశీ బొగ్గు అదానీ నుండి కొనాలనడం ఒక స్కామ్‌. బహిరంగంగా అందరికీ కనిపిస్తున్న విషయాలివి. ఈ దేశంలోని యువకులు మాత్రం పకోడీలు అమ్ముకోవాలని, పంచర్‌షాప్‌లు తెరుచుకోవాలని బీజేపీ నాయకులు ఉద్భోదిస్తున్నారు. డిగ్రీలు తీసుకోవడం దండగ అని కూడా చెపుతున్నారు. నిజమే దండగే! చరిత్రను వక్రీకరించి మొఘలుల కాలాన్ని తీసెయ్యడం, న్యాయ శాస్త్ర విద్యార్థులు ‘మనుస్మృతి’ చదవాలనడం  చేస్తున్నప్పుడు ఇక ఆ చదువుకు ఏ విలువ ఉంటుందీ?

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.