యుద్ధం ముగిసిపోయినట్లేనా?

Publish Date:May 28, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

అగ్రరాజ్యాధినేత వ్యవహారతీరుపై తెలుగువన్ ఇంటర్వ్యూలో ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన మారుస్తున్న మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక నయా డిక్టేటర్ తరహాలో ఆయన వ్యవహరిస్తున్న తీరు గమనిస్తుంటే..  ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని  ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారునాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన..   ఇరాన్ తో  ఉద్రిక్తతలు,  యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.

అయితే.. వ్యూహాత్మకంగా ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధిని తన అధీనంలో ఉంచుకుని అమెరికా పీక నొక్కడంతో ట్రంప్ కొంత వెనక్కి తగ్గారన్నారు. ఇరాన్ తో యుద్ధం వల్ల ఇప్పటివరకు అమెరికా సుమారు హాఫ్  ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు 45 నుంచి 50 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు.   యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పడే అనంతర పరిణామాల వల్ల మరో  ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు 95 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషించారు. 

ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం  అమెరికాపైనే కాకుండా  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడింది. సహజంగా ఆయిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ, అమెరికాలోనే చమురు ధరలు ఏకంగా 45 శాతం నుండి 50 శాతం వరకు పెరిగిపోవడం అక్కడ మధ్యతరగతి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. లక్షలాది మంది అమెరికన్లు రోడ్లపైకి వచ్చి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు భారత్ విషయానికి వస్తే, భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల కేవలం 4 శాతం నుండి 4.5 శాతం వరకే పరిమితం కావడం కొంత ఊరట కలిగిస్తున్న అంశం. అయినప్పటికీ, అంతర్జాతీయ చమురు సంక్షోభం మన దేశాన్ని కూడా ప్రభావితం చేస్తోంది.

రష్యాతో భారతదేశానికి ఉన్న పాత అనుబంధం, అక్కడి నుండి చౌకగా చమురు దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ మొదట్లో తీవ్ర ఆంక్షలు విధించాలని చూశారు. రష్యా ఆయిల్ కొంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించిన ట్రంప్, ఆ తర్వాత భారత విదేశాంగ విధానం మరియు అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి నెల రోజుల పాటు మినహాయింపు ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తూ.. ఇప్పుడు ఆ  గడువును ఇప్పుడు మరో నెల రోజులు పొడిగించాల్సిన పరిస్థితికి ట్రంప్ వచ్చారంటేనే.. అమెరికా ఎంతగా తగ్గిందో అర్ధమౌతుందన్నారు.  భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా ద్వంద్వ నీతిని ఎండగడుతూ,  మా అవసరాలు మాకు ముఖ్యం, మమ్మల్ని ప్రశ్నించే ముందు యూరోపియన్ యూనియన్ సంగతి చూడండి అని గట్టిగా సమాధానం ఇవ్వడంతో ట్రంప్ నోరు మూతపడక తప్పలేదన్నారు.  

అయితే, అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులపై ట్రంప్ కక్షసాధింపు చర్యలు దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తుయని కిలారు అన్నారు.  భారతీయులను  చీప్ లేబర్ అని సంబోధిస్తూ, వారికి హెచ్-1బి వీసాలు ఇవ్వకూడదని, కొత్త వీసాలపై నిషేధం విధించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఒకవైపు భారత ప్రధాని మోదీని తన ఆప్తమిత్రుడు అని పొగుడుతూనే..  మరోవైపు ఇండియా ఒక డెడ్ ఎకానమీ అని, ఒప్పించడం చాలా కష్టమైన దేశమని ఉదయానికి ఒకలా, సాయంత్రానికి ఒకలా మాటలు మారుస్తూ ట్రంప్ మానసిక స్థిరత్వం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారని కిలారు చెప్పారు. రాబోయే రెండు మూడు నెలల్లో అంతర్జాతీయంగా ఈ సమస్యకు ఒక సామరస్యపూర్వక పరిష్కారం లభించకపోతే, ప్రపంచాన్ని ముంచెత్తబోయే భయంకరమైన ఆర్థిక మాంద్యం తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందని విశ్లేషించారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ఇంకా దూకుడుగా వెళ్లే పరిస్థితి లేదని కిలారు నాగార్జున చెప్పారు. 

By
en-us Political News

  
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.