హరికృష్ణ రాజీనామా! ఎందుకో

Publish Date:Aug 4, 2013

Advertisement

 

కేంద్రం రాష్ట్ర విభజనపై ప్రకటన చేసేవరకు మౌనం పాటించిన సీమంధ్ర నేతలు ఇప్పుడు వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. అసలు తమ రాజీనామాలతో వారు ఏమి సాధిద్దామనుకొంటున్నారో, అసలు దానివల్ల కేంద్రం మనసు మార్చుకొంటుందని వారు నిజంగా నమ్ముతున్నారో లేదో, లేక సీమంధ్ర ప్రాంతంలో తాము మిగిలిన వారికంటే వెనుకబడిపోతామని భయపడి రాజీనామాలు చేస్తున్నారో గానీ మొత్తం మీద ఒకరిని చూసి మరొకరు పోటీలుపడి మరీ రాజీనామాలు చేస్తున్నారు. తెదేపా రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ కూడా వారం వర్జ్యం, ముహూర్తం అన్ని సరి చూసుకొని ఆదివారం ఉదయం 8.30 గంటలకు యన్టీఆర్ ఘాట్ వద్ద నాటకీయంగా రాజీనామా చేసారు.

 

అయితే, ఆయన రాజ్యసభ సభ్యుడుగా ప్రజలకు ఏమి మేలు చేసారో తెలియదు కానీ, కనీసం రాజ్యసభకు నామినేట్ చేసిన తెదేపా కోసం కూడా ఆయన చేసిందేమీ లేదు. తెదేపా సభలు సమావేశాలు జరిగిన ప్రతీసారి వచ్చి అలకలు, చిరాకు ప్రదర్శించడమే తప్ప ఆయన పార్టీకి ఒరగబెట్టిందేమి లేదు. ఇక పార్టీ (చంద్రబాబు) తనకు చాలా అన్యాయం చేసిందంటూ చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకి కూడా దూరంగా ఉంటున్న ఆయన గత కొద్ది రోజులుగా మళ్ళీ పార్టీ తరపున మాట్లాడటం మొదలుపెట్టారు. బహుశః వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం ఆయన ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లున్నారు.

 

నందమూరి కుమారుడుగా ఆయన పార్టీ టికెట్ ఆశిస్తే ఆశించవచ్చు తప్ప, లేకుంటే ఆయన ఏవిధంగాను అందుకు అర్హులు కారని చెప్పవచ్చును. ఆయన ఏనాడు బాధ్యతగల పార్టీ సభ్యుడిగా వ్యవహరించలేదు. అదే విధంగా రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు ఏమి చేసారో ఆయనే చెప్పాలి. అటు పార్టీకి గానీ, ప్రజలకు గానీ ఏవిధంగాను అక్కరకు రాని ఆయన, తనకు తీరికున్నపుడు వచ్చి ఒకసారి పార్టీకి, ప్రజలకి మొహం చూపించి మాయమయిపోతుంటారు. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగినపోయిన తరువాత వారం వర్జ్యం ముహూర్తం అన్ని చూసుకొని నాటకీయంగా రాజీనామా ఇవ్వడమెందుకు?

 

ఆయన పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు ఆ తేడా ఎన్నడూ కనబడలేదు. అందువల్ల ఆయన రాజీనామా చేయడం వలన ఆయనకే వ్యక్తిగతంగా కొంత నష్టం జరుగుతుంది తప్ప ప్రజలకి కానీ, పార్టీ గానీ మాత్రం ఎటువంటి మేలు జరుగదు. ఆయనకు పార్టీ టికెట్ ఇస్తే ఇవ్వచును కానీ ఇప్పుడు రాజీనామా చేస్తే అందుకు ప్రతిగా ప్రజలు వచ్చే ఎన్నికలలో ఆయనకే ఓటేస్తారని హామీ ఏమీ లేదనే సంగతి ఆయన తెలుసుకొంటే మంచిదేమో.

By
en-us Political News

  
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.