హరికృష్ణ రాజీనామా! ఎందుకో

Publish Date:Aug 4, 2013

Advertisement

 

కేంద్రం రాష్ట్ర విభజనపై ప్రకటన చేసేవరకు మౌనం పాటించిన సీమంధ్ర నేతలు ఇప్పుడు వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. అసలు తమ రాజీనామాలతో వారు ఏమి సాధిద్దామనుకొంటున్నారో, అసలు దానివల్ల కేంద్రం మనసు మార్చుకొంటుందని వారు నిజంగా నమ్ముతున్నారో లేదో, లేక సీమంధ్ర ప్రాంతంలో తాము మిగిలిన వారికంటే వెనుకబడిపోతామని భయపడి రాజీనామాలు చేస్తున్నారో గానీ మొత్తం మీద ఒకరిని చూసి మరొకరు పోటీలుపడి మరీ రాజీనామాలు చేస్తున్నారు. తెదేపా రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ కూడా వారం వర్జ్యం, ముహూర్తం అన్ని సరి చూసుకొని ఆదివారం ఉదయం 8.30 గంటలకు యన్టీఆర్ ఘాట్ వద్ద నాటకీయంగా రాజీనామా చేసారు.

 

అయితే, ఆయన రాజ్యసభ సభ్యుడుగా ప్రజలకు ఏమి మేలు చేసారో తెలియదు కానీ, కనీసం రాజ్యసభకు నామినేట్ చేసిన తెదేపా కోసం కూడా ఆయన చేసిందేమీ లేదు. తెదేపా సభలు సమావేశాలు జరిగిన ప్రతీసారి వచ్చి అలకలు, చిరాకు ప్రదర్శించడమే తప్ప ఆయన పార్టీకి ఒరగబెట్టిందేమి లేదు. ఇక పార్టీ (చంద్రబాబు) తనకు చాలా అన్యాయం చేసిందంటూ చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకి కూడా దూరంగా ఉంటున్న ఆయన గత కొద్ది రోజులుగా మళ్ళీ పార్టీ తరపున మాట్లాడటం మొదలుపెట్టారు. బహుశః వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం ఆయన ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లున్నారు.

 

నందమూరి కుమారుడుగా ఆయన పార్టీ టికెట్ ఆశిస్తే ఆశించవచ్చు తప్ప, లేకుంటే ఆయన ఏవిధంగాను అందుకు అర్హులు కారని చెప్పవచ్చును. ఆయన ఏనాడు బాధ్యతగల పార్టీ సభ్యుడిగా వ్యవహరించలేదు. అదే విధంగా రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు ఏమి చేసారో ఆయనే చెప్పాలి. అటు పార్టీకి గానీ, ప్రజలకు గానీ ఏవిధంగాను అక్కరకు రాని ఆయన, తనకు తీరికున్నపుడు వచ్చి ఒకసారి పార్టీకి, ప్రజలకి మొహం చూపించి మాయమయిపోతుంటారు. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగినపోయిన తరువాత వారం వర్జ్యం ముహూర్తం అన్ని చూసుకొని నాటకీయంగా రాజీనామా ఇవ్వడమెందుకు?

 

ఆయన పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు ఆ తేడా ఎన్నడూ కనబడలేదు. అందువల్ల ఆయన రాజీనామా చేయడం వలన ఆయనకే వ్యక్తిగతంగా కొంత నష్టం జరుగుతుంది తప్ప ప్రజలకి కానీ, పార్టీ గానీ మాత్రం ఎటువంటి మేలు జరుగదు. ఆయనకు పార్టీ టికెట్ ఇస్తే ఇవ్వచును కానీ ఇప్పుడు రాజీనామా చేస్తే అందుకు ప్రతిగా ప్రజలు వచ్చే ఎన్నికలలో ఆయనకే ఓటేస్తారని హామీ ఏమీ లేదనే సంగతి ఆయన తెలుసుకొంటే మంచిదేమో.

By
en-us Political News

  
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు.
భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్...
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన..
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో  పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా...
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది...
ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు...
60వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' నినాదం మార్మోగింది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించి భారీ ఉద్యమం చేసి దాన్ని సాధించుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే. సైబరాబాద్ నిర్మాతను నేను. అని చెప్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు ఆర్ధిక సంవత్సరాల్లో మొత్తం 47,682.87 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందింది. దేశం మొత్తం మీద ఓవర్ డ్రాఫ్ట్ (ఓ.డి.) అత్యధిక మొత్తం పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవటంతో...
ఇద్దరు నేతలు...వారి వ్యవహార శైలి.. ...ప్రస్తుతం రాష్ట్రం లో నలుగుతున్న చర్చ ఇదే. ఒకరు సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించే ఫిలాసఫి నిర్మాతలైతే, మరొకరు..పైన దేవుడున్నాడు... నాన్న చూస్తున్నాడు...
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ దాదాపు గా అప్రూవర్ గా మారబోతున్నట్టు సమాచారం. ఈ సంగతి తెలుగుదేశాధినేతకు శరాఘాత సమానమైన విషయమైనప్పటికీ...
ఇది మరో సంక్షోభం... మొన్న జాస్తి కృష్ణ కిషోర్... ఈ రోజు ఏ.బి. వెంకటేశ్వర రావు. కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వితే, కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ ఏ రకంగా స్పందించిందో ఇప్పటికే అనుభవైనప్పటికీ...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.