జగన్ తీరు.. వైసీపీ బేజారు.!

Publish Date:Aug 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లయ్యింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం  కూటమి సమన్వయంతో  ముందుకు సాగుతోంది. క్షేత్రస్థాయిలో కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు, శ్రేణుల మధ్య ఏవైనా ఇబ్బందులూ, విభేదాలూ పొడసూపినా.. అగ్రనాయకత్వం జాప్యం లేకుండా జోక్యం చేసుకుని, అవి మరింత ముదరకుండా చర్యలు తీసుకుంటోంది. మరో వైపు 2024 ఎన్నికలలో 11 సీట్లకే పరిమితమైన ఘోర పరాజయం పాలైన వైసీపీ ఈ రెండేళ్లలోనూ ఇసుమంతైనా కోలుకున్నట్లు కనిపించదు. 

అందుకు ప్రధాన కారణం.. ప్రజలు తిరస్కరించినా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా, ఆ హోదా కోసం నానాయాగీ చేస్తూ, మంకుపట్టుపట్టి ప్రజల దృష్టిలో మరింత చులకల అయ్యింది. ప్రతిపక్ష హోదా కోసం అభ్యర్థించడం, డిమాండ్ చేయడం, చివరకు కోర్టుకు కూడా వెళ్లి జగన్ వృధా ప్రయత్నాలు చేశారు. చివరకు విపక్ష హోదా కోసం అలిగి అసెంబ్లీ బాయ్ కాట్ చేశారు. ఈ రెండేళ్ల కాలంలో జగన్ రెండు మూడు సార్లు వినా అసెంబ్లీకి వెళ్లింది లేదు. జగన్ మాత్రమే కాదు.. ఆయనతో సహా వైసీపీ ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీ ముఖం చూడటం లేదు.  కేవలం అహంభావంతో ఆయన విపక్ష హోదా కోసం పట్టుబట్టి అసెంబ్లీకి ముఖం చాటేసి పార్టీకి మరింత నష్టం చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏం చేసినా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా, వైపీ ప్రతిపక్ష పార్టీ గుర్తింపు దక్కే అవకాశాలు ఇసుమంతైనా లేవని విస్పష్టంగా చెబుతున్నారు. ఇక వైసీపీలో విషయ జ్ణానం ఉన్న వారందరికీ కూడా ఈ వ ిషయం తెలిసినప్పటికీ ఆ సంగతిని జగన్ కు చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారని పరిశీలకులు అంటున్నారు. అంతెందుకు  జగన్   మద్దతు దారు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా విపక్ష హోదా కోసం జగన్ తాపత్రేయపడటం శుద్ధ వేస్టని కుండబద్దలు కొట్టేశారు కూడా.  ఎంత పాకులాడినా ఆయనకు విపక్ష నేత హోదా వచ్చే అవకాశం లేదనీ, ఆ విషయంలో జగన్ చేస్తున్నదంతా వృధా ప్రయాసేనని గతంలోనే  కుండబద్దలు కొట్టేశారు.

రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు.  అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి  ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు. ఆయన తీరు ఇలాగే ఉంటే.. రాష్ట్రంలో పార్టీ ఉనికి  మాత్రంగా మిగిలే అవకాశం కూడా ఉండదనీ,  ఈ విషయాన్ని జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకు రాజకీయంగా అంత మేలు జరుగుతుందని అంటున్నారు.  తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కనుకే తాను అసెంబ్లీకి రావడం లేదని జగన్ అంటున్నా..   సీఎంగా చక్రం తిప్పిన అసెంబ్లీలో ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోవడానికి జగన్ కు అహం అడ్డొస్తోందనీ, ఆ కారణంగానే ఆయన అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమౌతోంది. .  

ఇక ప్రస్తుతానికి వస్తే..రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయి రెండేళ్లయ్యింది. ఈ రెండేళ్లలో జగన్ ప్రజాక్షేత్రంలోకి వచ్చింది లేదు. బెంగళూరు ప్యాలెస్ కు పరిమితమై ఏదో చుట్టపు చూపుగా ఏపీకి వస్తున్నారు. అలా వచ్చి కూడా ప్రెస్ మీట్ లకే పరిమితమై ప్రజలకు దూరంగానే ఉంటున్నారు. అధవా బయటకు వచ్చినా.. పరామర్శ యాత్రల పేర బల ప్రదర్శన చేస్తున్నారు. ఆయన బయటకు వచ్చిన ప్రతి సారి ఏదో ఒక సమస్యతో పార్టీ, శ్రేణులూ చిక్కుల్లో పడుతున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమౌతోంది.  

అయినా..   పార్టీ నాయకులు   బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహించమని జగన్ అప్పుడప్పుడు పిలుపునిస్తున్నారు. అయితే సమస్య ఏంటంటే.. జగన్ స్వయంగా పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలలో ఆయన పాల్గొనరు. దీంతో వైసీపీ నిరసనలు తూతూమంత్రంగానే మిగిలిపోతున్నాయి. జగన్ క్షేత్రస్థాయిలోకి రాకుండా ఆ పార్టీ పుంజుకునే అవకాశాలు దాదాపు మృగ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికైనా అంటే ఘోర  పరాజయానికి రెండేళ్లు పూర్తయిన తరువాతైనా వాస్తవం గ్రహించి అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారేమో అన్ని చిన్న ఆశ ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో నిన్నమొన్నటి వరకూ ఉండేది. కానీ సోమవారం (ఆగస్టు 10) నుంచి ఆరంభమైన అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడంతో ఆ ఆశ కూడా అడుగంటి పోయింది.  క్షేత్రస్థాయిలోనూ, అసెంబ్లీలోనూ జగన్ లేకపోవడంతో..  ఈ రెండేళ్లలో వైసీపీ రాష్ట్రంలో పట్టు కోల్పోయింది. జగన్ ఇప్పటికైనా వాస్తవం గ్రహించి తీరు మార్చుకోకుంటే.. తమ రాజకీయ భవిష్యత ఏమిటి? అన్న బెంగ వైసీపీయులలో కనిపిస్తోంది.  

Jagan, AP Assembly Sessions, YCP, Jagan Assembly Attendance, AP Politics, Teluguone

By
en-us Political News

  
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై వంశీ నోరు పారేసుకున్న తీరు  అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.