ఇటు అవిశ్వాసం అటు ఆర్డినెన్సు.. వచ్చే వారం కేంద్రానికి గడ్డు కాలమే

Publish Date:Jul 29, 2023

Advertisement

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  ప్రారంభం మొదలు, మణిపుర్ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. మణిపుర్ హింసపై ప్రధాని నరేంద్ర మోీ సభలో ప్రకటన చేయాలని పట్టుబడుతున్న ప్రతిపక్ష పార్టీలు వరసగా రెండవ వారం కూడా పార్లమెంట్ ఉభయ సభలను  స్తంబింప చేశాయి. ఈ రెండు వారాలలో ప్రభుత్వం, విపక్షాలు కొనాగిస్తున్న నిరసనల మధ్యే ఏవో కొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. అంతకు మించి, మణిపుర్ సహా,ఏ అంశంపైనా చర్చ జరగలేదు.

మరోవంక ఇటీవల  ఐఎన్డీఐఎ (ఇండియ) గా నామకరణం చెసుకున ప్రతిపక్ష పార్టీల కూటమి ప్రదాని మోడీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం నోటీసును ఇచ్చాయి. అవిశ్వాస తీర్మానం నిబంధనలను అనుసరించి స్పీకర్ ఆమోదించారు. కాగా, విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై  పై  ఆగస్టు 2 లేదా 3 తేదీల్లో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు చర్చ తేదీని,  సోమవారం (జులై 31) ఖరారు చేసే అవకాశం ఉంది.

నిజానికి లోక్ సభలో అధికార ఎన్డీఎ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ఖాయంగా వీగిపోతుంది.అందులో సందేహం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు సిద్దమవుతున్నాయి. అలాగే  అధికార కూటమి విపక్షాల విమర్శలను, ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు సిద్దమవుతోంది. అలాగే ఢిల్లీ సర్వీసులకు సంబంధించిన ఆర్డినెన్స్‌ స్థానంలో ప్రవేశ పెట్టే బిల్లు కూడా  దిగువ సభలో సునాయాసంగా నెగ్గుతుంది. సో .. మూడవ వారంలోనూ దిగువ సభకు సంబంధించినంత వరకు సర్కార్ కు చిక్కులేమీ లేవు.  

అయితే  వచ్చేవారం అటు అధికార కూటమి ఇటు విపక్ష కూటమి అసలు సవాలును పెద్దల సభలో ఎదురు కానుంది. పెద్దల సభలో అధికార కూటమికి పూర్తి మెజారిటీ లేదు. విపక్ష కూటమి ఇండియా పరిస్థితీ అదే.  తటస్థులు ఎటు మొగ్గితే అటు అనుకూల ఫలితం వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకమైనవి. ప్రతిపక్షాల  తీరుచూస్తుంటే వచ్చే వారం సభ అత్యంత ఆసక్తిగా సాగే అవకాశం కనిపిస్తోంది. సో.. ఆగస్టు 11 వరకు కొనసాగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో వచ్చే వారం సర్కార్  కు గడ్డు కాలం కాగలదని పరిశీలకులు భావిస్తున్నారు. 
రాజ్యసభలో  పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి.

రాజ్య సభలో మొత్తం సభ్యుల సంఖ్య 243 అయితే ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి, రాజ్య సభ  ప్రస్తుత సభ్యుల సంఖ్య 238.. బిల్లు నెగ్గాలంటే 118 మంది మద్దతు అవసరం. కాగా, ఎన్డీఏ కూటమికి 109 మంది ఎంపీలున్నారు. కాంగ్రెస్‌కు 31 మంది సభ్యులు ఉన్నారు.

ఇతర విపక్ష పార్టీలకు చెందిన 70 మంది సభ్యుల మద్దతును ఆప్‌ కూడగట్టింది. బిల్లును అడ్డుకోవాలంటే ఈ సంఖ్య సరిపోదు. విపక్ష పార్టీలు ఆప్‌ (10), టీఎంసీ (12), డీఎంకే (10), బీఆర్‌ఎస్‌ (7), ఆర్జేడీ (6), సీపీఐ(ఎం) (6), జేడీయూ (5), ఎన్సీపీ (4), శివసేన -యూబీటీ (3), ఎస్పీ (3), సీపీఐ (2), జేఎంఎం (2), ఐయూఎంఎల్‌, ఆర్‌ఎల్డీ నుంచి ఒక్కో సభ్యులు ఆప్‌కు మద్దతు ఇస్తున్నారు. విపక్ష సభ్యుల సంఖ్య 101 మాత్రమే ఉంటుంది. దీంతో తటస్థంగా ఉన్న బీజేడీ (9), వైసీపీ (9)ల మద్దతు ఎంతో కీలకంగా మారింది.

By
en-us Political News

  
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.