గవర్నర్ తరువాత కేటీఆర్ డిల్లీ పయనం దేనికి?

Publish Date:Jun 26, 2015

Advertisement

 

గవర్నర్ నరసింహన్ నిన్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి యల్.సి.గోయల్ తదితరులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న పరిస్థితులు, తదనంతర పరిణామాలపై లోతుగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కానీ వారు ఈ సమావేశంలో ఏమేమి నిర్ణయాలు తీసుకొన్నారనే విషయం బయటకి పొక్కనీయలేదు. కనుక పరిస్థితులను చక్కదిద్దవలసిన బాధ్యత గవర్నర్ దే నని హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ చెప్పినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ గవర్నర్ నరసింహన్ కి ఆయన బాధ్యతల గురించి కేంద్రం కొత్తగా గుర్తు చేయనవసరంలేదని అందరికీ తెలుసు. అదే మాట చెప్పదలిస్తే ఆయనని అంత అత్యవసరంగా డిల్లీకి పిలిపించనవసరం లేదు. ఆ ముక్కేదో ఆయనకు ఫోన్లోనే చెప్పవచ్చును. కనుక వారి సమావేశంలో అంతకంటే ముఖ్యమయిన నిర్ణయాలే తీసుకొని ఉండవచ్చని భావించవచ్చును.

 

ఆయన హైదరాబాద్ తిరిగి రాగానే నేడు మళ్ళీ తెలంగాణా ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు డిల్లీ బయలుదేరబోతున్నారు. ఆయనతోపాటు తెలంగాణా ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు కూడా డిల్లీ వెళ్లి ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశం కానున్నారు. వారు డిల్లీ వెళ్ళడానికి వేరే ఇతర కారణాలు చెప్పవచ్చును. హోంమంత్రికి బదులు ఆర్ధికమంత్రిని కలవవచ్చును. కానీ నిన్న గవర్నర్, హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ ల మధ్య జరిగిన కీలక సమావేశంలో ఇరురాష్ట్రాల మధ్య తలెత్తిన సంక్షోభం నివారణకు తీసుకొన్న నిర్ణయాలను అమలు చేసే ప్రక్రియలో భాగంగానే వారిని డిల్లీకి పిలిపించి ఉండవచ్చును.

 

ఇదివరకు కూడా మంత్రి కేటీఆర్ డిల్లీ వెళ్ళివచ్చిన తరువాత ఓటుకి నోటు కేసులో ఎసిబి జోరు కొంచెం తగ్గిన సంగతి గమనిస్తే అది అర్ధమవుతుంది. ఈ కేసు విషయంలో తెలంగాణా ప్రభుత్వం బహుశః గవర్నర్ మాటను వినేట్లులేదు కనుకనే కేంద్ర ప్రభుత్వం కేటీఆర్ తో మాట్లాడేందుకు డిల్లీకి పిలిపించి ఉండవచ్చును. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రతినిధిగా భావింపబడే ఆయన కుమారుడు కేటీఆర్ తో కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే, గవర్నర్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ సంక్షోభాన్ని నివారించే ప్రయత్నాలు చేయవచ్చును. రానున్న రెండు మూడు రోజుల్లో ఉభయ రాష్ట్రాలలో జరుగబోయే పరిణామాలను బట్టి డిల్లీలో ఏమి జరిగిందనే విషయంపై కొంత స్పష్టత వస్తుంది.

By
en-us Political News

  
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.