Publish Date:Dec 13, 2024
ఫార్ములా ఈ కార్ రేసు కుంభకోణంలో మాజీమంత్రి కెటిఆర్ పై కేసు నమోదు చేయడానికి తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ గత నెలలో కెటీఆర్ ను అరెస్ట్ చేయాలని నిర్ణయించి హైద్రాబాద్ లో 144 సెక్షన్ విధించింది. తెలంగాణలో దీపావళి తర్వాతపొలిటికల్ బాంబులు పేలతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు చేసిన ప్రకటనతో కెటీఆర్, హరీష్ రావు, కెసీఆర్ అరెస్ట్ పక్కా అని ప్రచారం జరిగింది. ప్రజా ప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. కెటీఆర్ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు. కెటీఆర్ ను అరెస్ట్ చేసే ముందు గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఫార్ములా ఈ రేస్ కుంభకోణం కేవలం కల్వకుంట్ల కుటుంబ ప్రయోజనాల కోసం చేసినట్లు కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. కెటీఆర్ కొడు కు హిమాన్షు కోరికమేరకు కెటీఆర్ బావమరిది ఈ ఈవెంట్ చేపట్టినట్టు తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణా సంస్థకు తెలంగాణ సర్కార్ 46 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ ముట్ట జెప్పింది. హెచ్ఎండీఏ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవినీతినిరోధకశాఖ గుర్తించింది. బోర్డు అనుమతి లేకుండానే హెచ్ ఎండీ ఏ దూకుడు ప్రదర్శించింది. బిఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ కుంభకోణంలో కీలక పాత్ర వహించారు. కెటీఆర్ ఆదేశాల మేరకే తాను చెక్కులను రిలీజ్ చేసినట్టు అరవింద్ కుమార్ పేర్కొన్నారు. ఒక విదేశీ నిర్వహణ సంస్థకు 46 కోట్ల రూపాయలు విడుదల చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరి. కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం నిబవధనలను ఉల్లంఘించింది. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంపై ఇద్దరు అధికారులపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఇంత పెద్ద ఈవెంట్ అయిన ఫార్ములా ఈ రేస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం లేకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ సీరియస్ గానే తీసుకుంది. డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కుంభకోణం వెలికి తీసారు. తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి ఫార్ములా ఈ రేస్ నిర్వహించినట్టు మాజీ మంత్రి కెటీఆర్ చెప్పుకోవడం గమనార్హం. గవర్నర్ ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ నెలాఖరులో కెటీఆర్ అరెస్ట్ కావడం తథ్యమని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/governor-green-signal-for-ktr-arrest-39-189784.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.