ఆ కోడిపుంజు నిలువెల్లా బంగారమే!

Publish Date:Jan 18, 2026

Advertisement

వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అన్నది సామెత. ఇప్పుడా సామెతకు చూస్తే భీమవరం కోడిపుంజునే చూడాలి అని చేర్చుకోవాలి. ఎందుకంటే భీమవరంలో ఓ కోడి పుంజుకు దాని యజమాని పులిగోరు సహా బంగారు నగలు చేయించారు. ఇప్పుడు అక్కడంతా బంగారు కోడి పుంజు వచ్చెనండీ అంటూ పాడుకుంటున్నారు.  

ఔను ఆ కోడి పుంజు బంగారు ఆభరణాలు,   పులి గోరుతో దర్జా ఒలకపోస్తోంది .భీమవరం దుర్గాపురంలో జరిగిన కోడిపందాలలో నిలువెల్లా బంగారం ధరించిన  కోడిపుంజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ పుంజు యజమాని తన  కోడిపుంజును 15 కాసుల బంగారు గొలుసు, పులిగోరుతో ప్రత్యేకంగా అలంకరించాడు.

ఆ కోడి పుంజుపై ఉన్న నగల విలువ 50 లక్షల రూపాయకు పైనే ఉంటుందని అంచనా.   జీడిపప్పు బాదం, పిస్తా వంటి శక్తివంతమైన ఆహారంతో మేపి మరీ పందేలకు సిద్దమైన ఆ కోడి పుంజు  కాలికి కోడికత్తి కట్టుకొని పందెంలో దిగి ఘనవిజయాన్ని సాధించింది. ఈ ప్రత్యేక బంగారు పులిగోరు కోడిని చూచేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోడి పందేల కు మించి ఈ కోడి పుంజే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.  

By
en-us Political News

  
వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆ తర్వాత రెండు, మూడో వన్డేల్లో కివీస్ విజయం సాధించింది. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(53), హర్షిత్ రాణా(52) అర్థ శతకాలతో రాణించారు. కోహ్లీతో కలిసి నితీశ్ ఐదో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ.. సంక్షేమ రాజ్య స్థాపనకు అంకురార్పణ చేశారు. సమసమాజ నిర్మాతగా, లౌకికవాదిగా నందమూరి తారక రామారావు నిలిచారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో సాటిలేని ధ్రువతారగా వెలుగొంది, తన నటనా కౌశలంతో 300కు పైగా చిత్రాల్లో నటించి దేశ వ్యాప్తంగా ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయారు
మెస్రం వంశీయులు విత్ర గోదావరి జలాలతో మంచిర్యాల జిల్లాలోని హస్తిన మడుగు నుంచి కాలినడకన వచ్చి నాగోబాకు అభిషేకం చేయడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది.
హుస్సేన్ సాగర్ తీరంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన ఆయన మనవడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన తాత సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన టీటీడీ దర్శనం కోటా షెడ్యూల్‌ను ప్రకటించింది.
తెలంగాణలో 20మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు
కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు
సికింద్రాబాద్ మున్సిపల్ సాధన కోసం బీఆర్‌ఎస్ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది.
నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌నకు గ్ర‌హీత కొరినా మ‌చాడో అందజేసింది
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.