ఈరోజు బంగారం కొంటున్నారా? షాకిస్తున్న నేటి 10 గ్రాముల పసిడి ధరలు!
Publish Date:Aug 18, 2026
Advertisement
పశ్చిమాసియాలో ఊహించని విధంగా మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకోవడంతో గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పసిడి ప్రియులతో పాటు సాధారణ కొనుగోలుదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తూ ఆగస్టు 18న దేశవ్యాప్తంగా పసిడి రేట్లు పరుగులు తీశాయి. గత రెండు రోజులుగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, సీజ్ ఫైర్ గడువు ముగిసినప్పటికీ పొడిగింపుపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి (Safe Haven) వైపు తమ పెట్టుబడులను వేగంగా మళ్లించారు. దీనికితోడు అమెరికాపై పూర్తిస్థాయి దాడులకు దిగుతామని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక భయాలు పెరిగి, పసిడి రికార్డు స్థాయి దిశగా పయనించేలా బాటలు పరిచింది. ఈ అంతర్జాతీయ మార్పుల ప్రభావం భారతీయ పసిడి మార్కెట్పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో ఆగస్టు 18 మంగళవారం నాడు అన్ని రకాల బంగారం కేటగిరీల ధరలు గణనీయంగా పెరిగాయి. వివరాల్లోకి వెళితే, 24 క్యారట్ల బంగారం గ్రాము ధరపై రూ.23 పెరిగి ప్రస్తుతం రూ.15,589 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారట్ల బంగారం గ్రాము ధర రూ.20 పెరిగి రూ.14,290 పలుకుతోంది. 18 క్యారట్ల పసిడి గ్రాము ధర రూ.16 పెరిగి రూ.11,692 వద్ద నమోదైంది. కేవలం ఒక గ్రాము ధరల్లోనే ఈ స్థాయిలో పెరుగుదల కనిపించడంతో, బల్క్ కొనుగోళ్లపై దీని ప్రభావం భారీగా పడింది. పెద్దమొత్తంలో కొనుగోలు చేసే వారికి ఈ పెరుగుదల భారీ ఊబిగా మారింది. 100 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,300 మేర పెరిగి రూ.15,58,900 చేరింది. అదేవిధంగా 100 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర ఒకే రోజులో రూ.2,000 పెరిగి రూ.14,29,000 కు ఎగబాకింది. ఇక 100 గ్రాముల 18 క్యారట్ల బంగారం విషయానికి వస్తే, రూ.1,600 పెరిగి రూ.11,69,200 వద్ద నిలిచింది. పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ పెరుగుదల తీవ్ర షాక్ను ఇచ్చిందనే చెప్పాలి. gold prices hike in india 24k 22k rates,hyderabad gold rate today august 18.
http://www.teluguone.com/news/content/gold-rates-today-august-18-price-surge-36-229145.html





