టి20 వరల్డ్ కప్ విజయంతో దేశ మంతటా క్రికెట్ అభిమానులు సంబరాల్లో ముగినిపోయారు. ప్రతి ఒక్కరూ టీమ్ ఇండియా సాధించిన చారిత్రాత్మక విజయాన్ని వేనోళ్ల శ్లాఘిస్తున్నారు. ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ జస్పీత్ బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సంజు సాంశన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే సెమీస్ లో అద్భుత క్యాచ్ లతో జట్టుకు విజయాన్నందించిన అక్షర్ పటేల్ ను, ఫైనల్ లో అద్భుత క్యాచ్ తో డేంజర్ మేన్ కు పెవిలియన్ దారి చూపించిన ఇషాంత్ శర్మను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అయితే టీమ్ ఇండియా హెడ్ కోచ్ మాత్రం జట్టుగా టీమ్ ఇండియా సభ్యుల సమష్టి కృషిని ప్రశంసించారు. వ్యక్తిగత మైలు రాళ్లు సాధించిన ప్రేయర్లూ పొగిడాడు, కానీ టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీని మాత్రం ఈ టోర్నీని ఇద్దరు మాజీ దిగ్గజ క్రికెటర్లకు అంకితమిచ్చారు. ఫైనల్ లో టీమ్ ఇండియా విజయం తరువాత మీడియాతో మాట్లాడిన గౌతమ్ గంభీర్ ఈ విక్టరీని మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.
భారత జట్టును పటిష్ఠమైన స్థితిలో ఉంచినందుకు రాహుల్ ద్రావిడ్ కు, భవిష్యత్ తారలను తీర్చిదిద్దుతున్న లక్ష్మణ్కు ఈ ట్రోఫీని అంకితం చేస్తున్నానన్న గంభీర్.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ను కూడా ప్రశంసలతో ముంచెత్తాడు. ఇక కష్టకాలంలో తనకు అండగా నిలిచారంటూ.. ఐసీసీ చైర్మన్ జైషాకు కృతజ్ణతలు తెలిపాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gambhir-dedicate-team-india-victory-to-dravid-and-laxman-36-215217.html
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.