వైసీపీకి మాజీ హోంమంత్రి సుచరిత గుడ్ బై.. పార్టీలో ఎవరైనా మిగులుతారా?

Publish Date:Oct 23, 2024

Advertisement

వైఎస్ తరచూ చెప్పే దేవుడి స్క్రిప్ట్ అంటే అర్ధం ఏమిటో ఇప్పుడిప్పుడే  జగన్ కు తెలుస్తోంది. అధికారం ఉందన్న అహంకారంతో అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కర్మ అనుభవించక తప్పదని అవగతమౌతోంది. జగన్ తో అంటకాగి, ఆయన కళ్లల్లో ఆనందం చూడటానికీ, ఆయన దృష్టిలో పడటానికీ ఇష్టారీతిగా వ్యవహరించి, అడ్డగోలుగా ప్రత్యర్థులపై అనుచిత విమర్శలు చేసి, దూషణలకు పాల్పడిన ఒక్కొక్కరికీ ఇప్పుడు బొమ్మ కనబడుతోంది. కాళ్ల కింద భూమి కదిలిపోతోంది. నోరెత్తడానికే భయంతో వణికి పోతున్న పరిస్థితి. 

ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని, పరాభవాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కనీసం విపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 స్థానాలతో ఆ పార్టీ దయనీయంగా మిగిలింది. ఈ ఓటమి తరువాత ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జగన్ తీరును విమర్శిస్తూ, తమ రాజకీయ భవిష్యత్ ను వెతుక్కుంటూ వైసీపీని వీడుతున్నారు. ఎన్నికలలో పరాజయం తరువాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మొదలైన వలసన పరంపర ఇప్పుడు ఉధృతమైంది. ఆ పార్టీలో జగన్ వినా ఎవరైనా ఉంటారా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయంటూ జగన్ కు దూరం అవుతున్న వైసీపీ నేతల సంఖ్య ఎంత పెద్దగా ఉందో అర్ధమౌతుంది. ఇప్పటికే వైసీపీ క్యాడర్ చెల్లా చెదురైపోయింది. ఆ పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే కదలి వచ్చే కార్యకర్తలు కరవయ్యారు. 
ఇక వైసీపీని వీడుతున్న నేతలలో పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అత్యంత కీలకంగా వ్యవహరిం చిన, జగన్ కు అత్యంత ఆప్తులుగా గుర్తింపు పొందిన, నమ్మిన బంట్లుగా వ్యవహరించిన వారే ముందు వరుసలో ఉండటం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తోంది.

 జగన్ కు సమీప బంధువు, ఆయనకు వరుసకు మామ అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మొదలైన ఈ వలసలు విరామం లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. బాలినేని కంటే ముందు కిలారు రోశయ్య వైసీపీని వీడారు. ఇక ఆ వరుసలో  సామినేని ఉదయబాను.. మోపిదేవి, బీదం మస్తానరావు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి చాంతాడును మించిపోయేంత పొడుగు ఉంటుంది. తాజాగా బుధవారం మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. ఆ సందర్భంగా ఆమె  నేరుగా జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగన్ కు బాధ్యత లేదనీ, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి లేదనీ, రాజకీయం అంటే ఆయనకు వ్యాపారమనీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఇప్పుుడు పార్టీ మారుతున్న వారి జాబితాలోకి మరో పేరు వచ్చి చేరింది. మాజీ మంత్రి మేకతోటి సుచరిత వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. 

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుచరిత రాజకీయాలకు కొత్తే అయినా.. జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలగిన నేతల్లో  ఆమె ఒకరు.  జగన్ సీఎం కాగానే.. సుచరితకు హోంమంత్రి పదవి కట్టబెట్టారు.  అయితే  సజ్జలతో విభేదాల కారణంగా జగన్ తన కేబినెట్ ను విస్తరించిన సమయంలో ఆమె మంత్రి పదవి కోల్పోయారు. అప్పటి నుంచీ అసంతృప్తితోనే ఉన్న సుచరిత.. ఆ సమయంలో జగన్ పై, సజ్జలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  జగన్ స్వయంగా పిలిచి బుజ్జగించడంతో అయిష్టంగానే పార్టీలో కొనసాగిన మేకతోటి సుచరిత.. ఇక ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పార్టీ మారడానికే నిర్ణయించుకున్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు.  

By
en-us Political News

  
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.