Publish Date:Jun 29, 2026
హిమాచల్ ప్రదేశ్ ను మెరుపు వరదలు ముంచెత్తాయి. ఎండల తీవ్రతకు పర్వతాలపై మంచు చరియలు విరిగిపడటంతో లాహౌల్ స్పితి జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. సాధారణంగా భారీ వర్షాలకు వరదలు సంభవిస్తాయి. కానీ తాజాగా హిమాచల్ లో వర్షాలు లేకుండానే మంచు కరిగి వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి ప్రకోపం కారణంగా ఝల్మా వాగులో నీటి ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరి, అక్కడి రహదారిని ముంచెత్తింది. వరద తీవ్రతకు రహదారి తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా కొన్ని చోట్ల కొట్టుకుపోయింది.
ఈ ఆకస్మిక వరద కారణంగా ఆ మార్గంలో ప్రయాణిస్తున్న పర్యాటకులు చిక్కకుపోయారు. దాదాపు 50 పర్యాటక వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చుట్టూ కొండలు, మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు, ముందుకు వెళ్లేందుకు వీల్లేని పరిస్థితి నెలకొనడంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఈ విపత్తులో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. పర్యాటకుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రకటించారు.
సమాచారం అందిన వెంటనే సరిహద్దు రహదారి సంస్థ సిబ్బంది, స్థానిక యంత్రాంగం, రెస్క్యూ టీమ్లు రంగంలోకి దిగాయి. కొట్టుకుపోయిన రహదారిని పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి పూర్తి చేశారు. చిక్కుకుపోయిన పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/floods-in-himachal-caused-by-melting-snow-36-224561.html
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.