Publish Date:Aug 31, 2022
ఒక బొమ్మ కోసం ఒకమ్మాయి లవర్తో గొడవపడి బొమ్మ తెచ్చిస్తేనే నిన్ను పెళ్లాడతానని అంటుంది. వాడు వూరంతా తిరిగి ఓ దుకాణంలో అలాంటిదే కొనిస్తాడు. ఆమె పరిశీలనగా చూసి బొమ్మని పారేసి, సదరు ప్రేమికుడిని ఇక కలవద్దని వారిస్తుంది. కావడానికి ఇదో సినిమా సీన్. కానీ ఆ బొమ్మకి ఆ అమ్మాయికి ఉన్నఅనుబంధం గట్టిదే. అది తాను టెన్త్లో ఉండగా వాళ్ల డాడీ కొనిచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత దాంతోనే ఎక్కువ మాట్లాడుతూండేది. అదో బంధం. అది అందరికీ అర్ధమయ్యేది కాదు. దానితో మాట్లాడుతూంటే తండ్రితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇదో సెంటిమెంటు కూడా. అందువల్ల అలాంటి వస్తు వులు ఎవరూ వదులుకోరు, పారేసుకోరు. ప్రాణంతో సమానంగా చూసుకునే బ్రాస్లెట్ పోగొట్టుకున్న కుర్రాడు మరెంతగా బాధ పడుతున్నాడో. అది తెచ్చిచ్చినవారికి తగిన బహుమతి ఇస్తానని ఏకంగా ఫ్లెక్సీ పెట్టేడు!
తల్లి జ్ఞాపకార్ధం గా ఉంచిన బ్రాస్లైట్ కనిపించకుండా పోయిందని, దానిని అందజేసిన వారికి తగిన బహుమతి ఇస్తానంటూ పుదుకోట జిల్లా పొన్నామరావతికి చెందిన నారాయణన్ విజ్ఞప్తి చేస్తున్నాడు. తల్లి కానుకగా ఇచ్చిన బ్రాస్లెట్ను ఆమె మరణా నంతరం జ్ఞాపకంగా నారాయణన్ ధరిస్తున్నాడు. ఆగష్టు 22వ తేది ఉసిలంపట్టిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొచ్చిన నారా యణన్ బ్రాస్లెట్ కనిపించకపోవడంతో దిగ్ర్భాంతి చెందాడు. పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో తాను వెళ్లి వచ్చి న దారిలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాడు.
అందులో తల్లి జ్ఞాపకంగా ఉన్న బ్రాస్లెట్ కనిపించలేదని, అందజేసిన వారికి తగిన బహుమతి అందిస్తానంటూ పేర్కొన్నాడు. ఆ ఫ్లెక్సీ ఉన్న దారంట వెళ్లేవారు ఈసరికే చాలామంది నవ్వుకుని ఉంటారు. నేను ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని లవర్స్ పెట్టుకోవడం చూశాంగాని వీడెవడండీ, పోయిన వస్తువు కోసం ఇలా ప్రచారం చేస్తారా? వెర్రిగాని! అంటూ ఎగతాళిగా నవ్వు కున్నారు కొందరు యువకులు. కానీ అంత ప్రచారం చేస్తున్నాడంటే దాని వెనక ఉన్న అనుబంధ బలం అలాంటిది. తల్లి లేని లోటు తీర్చడం చాలా కష్టం. ఆమె యిచ్చిన బ్రాస్లెట్తో కాలం గడుపుతున్నవ్యక్తికి అది కూడా దూరమయితే నరక యాతనే. అది చేతికి ఉంటే అమ్మచేతిని పట్టుకుని నడుస్తున్నట్టే ఉంటుంది. ప్లీజ్.. బ్రాస్లెట్ దొరికితే ఇచ్చేయండి... అతనికి తల్లిని దరిచేర్చినట్టవుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/flexi--request-for-lost-bracelet-25-142988.html
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.