వైసీపీని ఢీ కొట్టేందుకు చంద్రబాబు ఫైవ్ పాయింట్ ఫార్ములా

Publish Date:Jan 31, 2022

Advertisement

జగన్ సర్కారు తుగ్లక్ పాలన నుంచిప్రజల్నివిముక్తుల్నిచేయాలని,ఇందుకోసం వచ్చే మహానాడు నాటికి పార్టీ శ్రేణుల్ని ఉరకలెత్తించే విధంగా కార్యక్రమాలురూపొందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఏపీలో జగన్ పై వ్యతిరేకత వెల్లు వెత్తుతోందని, దాన్ని సరిగా ఉపయోగించుకుంటే టీడీపీ అద్భుతమైన ఫలితాలతో అధికారంలోకి వస్తుందని చంద్రబాబునాయుడు కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. 

ఇందుకోసం ఫిబ్రవరి నుంచి స్థానిక సమస్యలపై పోరాటం ఉద్ధృతం చేయాలని, వైసీపీ ఎమ్మెల్యేల, నేతల అక్రమాలపై గట్టిగా పోరాడాలని సూచించారు. 

1) స్థానిక, నియోజకవర్గ సమస్యలపై స్థానికంగానే పోరాటాలు చేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచిపోయినా.. ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేకపోవడంపై ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలపై స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలతో కలిసి పోరాటాలు రచించాలన్నారు.

2) గెలిచేవారిని, సమర్థులను టీడీపీ వదులుకోబోదని, అదే సమయంలో పార్టీ కోసం, ప్రజల కోసం పని చెయ్యని నేతలను ఉపేక్షించేది లేదంటూ అల్టిమేటం జారీ చేశారు. కొందరు నాయకుల కారణంగా కార్యకర్తలను ఇబ్బందుల్లోకి నెట్టలేమని ఇండైరెక్టుగా కొందరు టీడీపీ నేతలను హెచ్చరించారు. 

3) ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియాపై పోరాటం చేయాలని శ్రేణులకు సూచించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే.. మళ్లీ విద్యుత్ చార్జీల పెంపు, రకరకాల పన్నులతో ప్రజలను పీల్చుకు తినేందుకు జగన్ సిద్ధమయ్యారని విమర్శించారు. దీనిపై ప్రజల్లో తీవ్ర నిరసన ఉందని వివరించారు. టీడీపీ పోరాటాలతో ప్రజల్ని మమేకం చేయాలని సూచించారు. 

4) జిల్లాల పునర్విభజనపై ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయన్నారు. జిల్లాల విభజనను రాజకీయం కోసం కాకుండా ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా చేయాలన్నారు. దీనికోసం ప్రజాశ్రేణుల్ని ఎక్కడికక్కడ టీడీపీ నేతలు సమాయత్తం చేయాలన్నారు. 

5) టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తవుతున్న దృష్ట్యా వచ్చే మహానాడుతో పాటు పార్టీ కార్యక్రమాలు వినూత్నంగా ఉండాలన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్టీఆర్ పేరుతో టీడీపీ హయాంలో పెట్టిన 14 పథకాలు తొలగించి, వాటి పేర్లు తీసివేసిన జగన్.. ఇప్పుడొక జిల్లాకు ఎన్టీర్ పేరు పెట్టి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

మరోవైపు ఇటీవలి కాలంలో పార్టీ శ్రేణుల పోరాటంతో టీడీపీలో జోష్ పెరిగిందని, అదే సమయంలో వైసీపీ పెడపోకడలను ప్రజలు బాగా గుర్తించారని సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా ఇంచార్జులను నియమించిన మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో క్యాడర్ కు ఆత్మస్థైర్యం ఇచ్చేలా పని చేస్తున్నారని అక్కడి నాయకత్వాన్ని ప్రశంసించారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి డెయిరీలో లీటర్ పాలకు కేవలం రూ.18 మాత్రమే చెల్లించే పరిస్థితి ఉండేదని, దీన్ని టీడీపీ నిలదీయడంతో ఫిబ్రవరి నుంచి ధర పెంచి ఇస్తున్నారన్నారు. అలాగే క్యాసినో వ్యవహారంలో బూతుల మంత్రి కొడాలి నానిని ఎండగట్టడంలో, ప్రభుత్వాన్ని ఫిక్స్ చెయ్యడంలో పార్టీ నేతలు బాగా పని చేశారని కితాబిచ్చారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.