ముందుగా ఆరోపణలు.. ఆపై సమాచార హక్కు చట్టం కింద సమాచారానికి దరఖాస్తులు!

Publish Date:Jul 7, 2022

Advertisement

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలు చిత్ర విచిత్రమైన రాజకీయ క్రీడకు తెరలేపాయి. ఇందుకు అవినీతి ఆరోపణలనే ఆస్త్రాలుగా వాడుకుంటున్నాయి. ముందుగా ఆరోపణలు గుప్పించేయడం, ఆధారాలున్నాయి, త్వరలో బయటపెడతామంటూ హడావుడి చేయడం.. ఆ తరువాత తీరిగ్గా సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోసం దరఖాస్తులు చేయడం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇరువురూ కూడా ఈ క్రీడలో ఒకరికి మించి మరొకరు అన్న రీతిలో పోటీ పడుతున్నారు.

ముందు ఈ క్రీడను ఎవరు మొదలు పెట్టారన్నది పక్కన పెడితే.. కేసీఆర్, బండిలు మాత్రం ఆరోపణలు, ప్రత్యారోపణలతో దీనిని రక్తి కట్టించారు. టీఆర్ఎస్, కేసీఆర్ అవినీతి చిట్టా జేబులో పెట్టుకు తిరుగుతున్నానని బండి చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. ఆ చిట్టా బయట పెడతామనీ, కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని దాదాపు ప్రతి సందర్భంలోనూ బండి చెబుతూనే వచ్చారు. ప్రతి సభలో ఆయన తొలుత చెప్పే విషయం సీఎం కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమనే. అయితే ఇంత వరకూ ఆయన చిట్టా బయటపెట్టినదీ లేదు.

కేసీఆర్ అవినీతిపై చిన్నపాటి విచారణా జరిగింది లేదు. మరో వైపు కేసీఆర్ కేంద్రం అవినీతి బాగోతం అంతా సక్ష్యాధారాలతో తన వద్ద ఉందని.. ఆ లెక్కలన్నీ బయటపెడతాననీ చెబుతూ వస్తున్నారు. టీఆర్ఎస్ శ్రేణులన్నీ మోడీ అవినీతి లెక్కల పద్దులన్నీ ప్రగతి భవన్ లో ఉన్నాయని కేసీఆర్ స్వయంగా ఇటీవల ప్రకటించారు. ఈ ఆరోపణలన్నీ సరే..వాటి ఆధారాలు బయటపెడతామన్న హెచ్చరికలే తప్ప అటు బీజేపీ టీఆర్ఎస్, కేసీఆర్ అవినీతిని బయట పెట్టడం లేదు.. ఇటు కేసీఆర్ కూడా ఆరోపణలకే పరిమితమై విమర్శలతో సరిపెట్టేస్తున్నారు.

కేసీఆర్, బండి ఇరువురూ కూడా తమ ఆరోపణలకు సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చే సమాచారంపైనే ఆధారపడుతున్నారు. బండి అయితే సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ శాఖల నుంచి ఇన్ఫర్మేషన్ కోసం ఏకంగా 80కి పైగా దరఖాస్తులు చేశారు. ఇక టీఆర్ఎస్ బండారం బయటపడిపోయిందని హడావుడి చేస్తున్నారు. ఈ హడావుడి రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేందుకు ఉపయోగిస్తుందే తప్ప.. సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి కొండలను బద్దలు కొట్టేస్తున్నామంటూ చేసుకుంటున్న ప్రచారం వల్ల అంతకు మించి ప్రయోజనం ఉండదని పరిశీలకులు చెబుతున్నారు.

ఆ విషయం ఇటు టీఆర్ఎస్ కూ, అటు బీజేపీకి కూడా తెలుసు. తెలియదనుకోలేం. అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? ఎందుకంటే.. రాష్ట్రంలో మూడో పార్టీ పోటీలో లేదని చాటడానికి. కాంగ్రెస్ బలోపేతం అవుతోందన్న అంశం నుంచి జనం దృష్టి మరల్చడానికి. టీఆర్ఎస్, బీజేపీలు ఎంతగా ప్రచారాలు చేసుకుంటున్నా... పోటీ మా మధ్యే అని చెప్పుకోవడానికి ఎంతగా తాపత్రేయ పడుతున్నా.. ఇటీవలి కాలంలో వలసలు కాంగ్రెస్ లోకి పెరుగుతున్నాయే తప్ప.. బీజేపీ, టీఆర్ఎస్ ల వైపు కాదు. జారిపోతున్న వారిని ఆపడం కోసం టీఆర్ఎస్, పార్టీలలోకి వలసలను ప్రోత్సహించడానికి బీజేపీలు పడుతున్న ఆత్రమే ఈ ఆరోపణల పర్వం వెనుక కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.

బీజేపీ అయితే ఏకంగా చేరికల సమన్వయ కమిటీ అంటే ఓ కమిటీని వేసి ఆ బాధ్యతలను మాజీ మంత్రి ఈటలకు అప్పగించింది.    కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఒకరిపై ఒకరు పోరాడుతూ ఈ అవినీతి ఆరోపణలు చేసుకుంటూ చేస్తున్న హడావుడిని జనం వింతగా చూస్తున్నారే తప్ప పెద్దగా పట్టించుకోవడం లేదనడానికి కాంగ్రెస్ లోకి పెరుగుతున్న వలసలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ను ఫేడౌట్ చేయడమే లక్ష్యంగా బీజేపీ, కేసీఆర్ లు ఒక రహస్య అవగాహనతో ముందుకు వెళుతున్నాయనడానికి ఈ ప్రచారార్భాటమే నిదర్శనమని కాంగ్రెస్ విమర్శిస్తోంది. 

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.