యవ్వనంగా ఉండాలన్నా, షుగర్ తగ్గాలన్నా- ఉపవాసమే మందు!

Publish Date:Dec 19, 2018

Advertisement

 

డయాబెటిస్ అనగానే ఇప్పుడు ప్రపంచం మొత్తానికీ భారతదేశమే గుర్తుకువస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక డయాబెటిక్ రోగులు ఉన్న దేశంగా అప్రదిష్ట మూటగట్టుకుంటోంది. కొన్ని సర్వేల ప్రకారం మన దేశంలో చక్కెర వ్యాధితో బాధపడే రోగుల సంఖ్య ఆరుకోట్లకి పైమాటే. మరో పదిహేనేళ్లు పోతే ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు.

 

డయాబెటిస్లో రెండు రకాలు ఉంటాయన్న విషయం తెలిసిందే! ఇందులో టైప్ 1 డయాబెటిస్ జన్యుపరంగా వస్తుంది. అందుకని ఇది చిన్నతనంలోనే దాడిచేసే ప్రమాదం ఎక్కువ. ఈ తరహా డయాబెటిస్లో శరీరంలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తిలోనే లోపం ఉంటుంది. దానివల్ల మన రక్తంలోకి చేరుకున్న చక్కెర నిల్వలను శక్తిగా మార్చుకునే అవకాశం ఉండదు. ఇక టైప్ 2 డయాబెటిస్ మన తరచూ వినే తరహా లోపం. ఇందులో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది కానీ, దానిని శరీరం సరిగా ఉపయోగించుకోలేకపోతుంది. ఈ రెండు రకాల డయాబెటిస్లకు ఓ చికిత్సను కనుగొన్నామంటున్నారు శాస్త్రవేత్తలు.

 

కాలిఫోర్నియాలోని Leonard Davis School of Gerontologyకి చెందిన పరిశోధకులు ఈ చికిత్సను రూపొందించారు. ఇందుకోసం వారు ప్రయోగశాలలోని ఎలుకలకి పదిశాతం ఆహారాన్ని మాత్రమే అందించారు. ఇలా ఓ నాలుగురోజులు చేసిన తరువాత మరో పదిరోజుల పాటు, వాటి ఇష్టారాజ్యంగా ఆహారాన్ని తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇలా ఓ మూడు దఫాలుగా ఆహారంలో మార్పులు చేయగానే ఎలుకలలో అద్భుతమైన మార్పులు కనిపించాయట.

 

ఎప్పుడైతే శరీరానికి తగినంత ఆహారం లభించలేదో... అప్పుడు అందులోని కణాలు నిశ్చలమైన స్థితికి (stand by) చేరుకున్నాయి. కొద్ది రోజుల తరువాత తిరిగి తగినంత ఆహారాన్ని అందుకోగానే తిరిగి సాధారణ స్థితికి చేరుకునే ప్రయత్నం చేశాయి. ఈ ప్రక్రియలో భాగంగా వాటిలో ఉన్న లోపాలన్నీ కూడా సర్దుకోవడాన్ని గమనించారు. ఉదాహరణకు డయాబెటిస్ టైప్ 1 వ్యాధిలో బీటా సెల్స్ అనే తరహా కణాలు తగినంత లేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. కానీ ఉపవాసం చేయించిన ఎలుకలలో ఈ బీటా కణాలు తిరిగి ఉత్పత్తి అవ్వడాన్ని గమనించారు. అంతేకాదు! డయాబెటిస్ టైప్ 2 బారిన పడ్డ ఎలుకలలో కూడా చక్కెర వ్యాధి తిరుగుముఖం పట్టినట్లు తేలింది. కణాలకు తమని తాము బాగుపరచుకునే ఈ అవకాశం దక్కడం వల్ల కేవలం షుగర్ మాత్రమే కాదు... రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయని భావిస్తున్నారు. అంతేకాదు! వయసుతో వచ్చే మార్పులని నివారించడంలోనూ, కేన్సర్ ఏర్పడే పరిస్థితులను నిరోధించడంలోనూ కూడా ఈ తరహా ఉపవాసాలు లాభిస్తాయని చెబుతున్నారు. అందుకనే మనుషుల మీద కూడా ఈ తరహా ప్రయోగాలు చేసేందుకు అమెరికా ప్రభుత్వ అనుమతిని కోరుతున్నారు.

 

విచిత్రం ఏమిటంటే... ఏ ఎలుకల మీదా ప్రయోగం చేయకుండా, ఏ ప్రభుత్వ అనుమతీ లేకుండానే మన దేశంలోని ప్రకృతి వైద్యులు ఈ తరహా ఉపవాసాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఒకవేళ వైద్యంలో భాగంగా కుదరకపోయినా కనీసం ఏకాదశి, శివరాత్రి వంటి విశేషమైన రోజులలో అయినా ఉపవాసాన్ని పాటించమని మొత్తుకుంటున్నారు. కానీ మనం వింటేనా! అందుకే ఉపవాసానికీ, ప్రకృతివైద్యానికీ పేరొందిన మన దేశంలోనే షుగర్ వ్యాధిగ్రస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నారు.

(షుగర్ వ్యాధి ఉన్నవారు ఉపవాసం చేసే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.)


 

- నిర్జర.

By
en-us Political News

  
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.