రాను రాను అంటున్నా కూడా అభిమానులు రారమ్మని పిలుస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కోసం.. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం ప్రజలే గట్టిగా పట్టుబడుతుండటం ఆసక్తికరం. గతంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా.. జూనియర్ ఎన్టీఆర్ను రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కుప్పం అభిమానులు. చంద్రబాబుపైనా ఒత్తిడి చేశారు. ఆ సమయానికి చంద్రబాబు సర్ది చెప్పారు. కొన్నాళ్లు మౌనంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు.. మళ్లీ జూనియర్ నినాదాన్ని ఎత్తుకున్నారు. తాజాగా, అదే కుప్పం ఫ్యాన్స్ మరోసారి జూనియర్ పొలిటిక్ ఎంట్రీపై వినూత్నంగా డిమాండ్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ ఓ జెండా తయారు చేసి ఆవిష్కరించారు. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెల్లటి జెండాపై.. మీసం మెలేస్తున్న ఎన్టీఆర్ ఫోటో చిత్రీకరించి.. నుదుట ఎర్రటి తిలకం దిద్ది.. జెండాగా ఎగరేశారు అభిమానులు. ఇప్పటికే ఆలస్యం అయిందని.. జూనియర్ ఎన్టీఆర్ త్వరగా రాజకీయాల్లోకి రావాలంటూ.. ఇలా జెండా ఆవిష్కరణతో డిమాండ్ చేశారు కుప్పంలోని జూనియర్ అభిమానులు. ఈ ఘటన టీడీపీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
జూనియర్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు ఎన్టీఆర్. తాతలా ఖాకీ డ్రెస్ వేసుకొని.. చైతన్యరథంపై పర్యటిస్తూ.. అద్భుతమైన వాగ్దాటితో ప్రసంగిస్తూ.. తెలుగు తమ్ముళ్లను ఉత్తేజ పరిచారు. అయితే.. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో అప్పటి నుంచి మళ్లీ రాజకీయాల జోలికి రాలేదు జూనియర్. పార్టీతో ఆయనకు దూరం బాగా పెరిగింది.
జగన్ సీఎం అయ్యాక.. టీడీపీ ప్రభ తగ్గాక.. మళ్లీ ఎన్టీఆర్ పేరు అభిమానుల నోటి నుంచి వినిపిస్తోంది. అయితే, ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో అభిమానులు.. జూనియర్ను ఉద్దేశించి సీఎం సీఎం అని నినదించడంతో.. ఆగండి బ్రదర్.. అంటూ ఫ్యాన్స్ను కాస్త గట్టిగానే మందలించారు ఎన్టీఆర్. మరో ఈవెంట్లోనూ.. ఇది సమయం, సందర్భం కాదంటూ విషయాన్ని దాట వేశారు. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదన్నట్టే ఉంది జూనియర్ వ్యవహార శైలి. అయితే, ఫ్యాన్స్ వింటేగా. రావాలి ఎన్టీఆర్.. కావాలి ఎన్టీఆర్ అంటూ కుప్పం అభిమానులు ఒకటే గోల గోల చేస్తున్నారు. తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ జెండాతో మరోసారి టీడీపీలో అలజడి తీసుకొచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fans-demanding-political-entry-of-junior-ntr-with-his-photo-flag-25-117052.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.