సన్‌రైజర్స్...ఆర్సీబీ మ్యాచ్ టికెట్ల రేట్లపై ఫ్యాన్స్ ఆగ్రహం

Publish Date:May 15, 2026

Advertisement

 

ఐపీఎల్‌లో అత్యంత క్రేజ్ ఉన్న మ్యాచ్‌లలో ఒకటైన సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  పోరుకు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. మే 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెరగడం ఫ్యాన్స్‌లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది.

శుక్రవారం సాయంత్రం 5 గంటలకు డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్ బుకింగ్ ప్రారంభం కావడంతో వేలాదిమంది అభిమానులు ఒకేసారి లాగిన్ అయ్యారు. యాప్‌లో దాదాపు 2.6 లక్షల మంది క్యూ‌లో ఉన్నట్లు కనిపించడంతో టికెట్ దక్కడం కష్టమైందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టికెట్లు కొద్ది నిమిషాల్లోనే “సోల్డ్ అవుట్”గా చూపించి, తర్వాత వాటిని బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక ధరలతో పోలిస్తే బ్లాక్ మార్కెట్‌లో టికెట్లు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు.

పెరిగిన టికెట్ ధరలు ఇలా ఉన్నాయి:

₹950 టికెట్ → ₹2000
₹1500 టికెట్ → ₹3000
₹1910 టికెట్ → ₹3500
₹2500 టికెట్ → ₹4500
₹4500 టికెట్ → ₹6000
₹7000 టికెట్ → ₹10,000
₹23,000 బాక్స్ టికెట్ → ₹30,000
₹30,000 కార్పొరేట్ బాక్స్ → ₹45,000

లక్షల సంఖ్యలో అభిమానులను క్యూ‌లో ఉంచి చివరకు “సోల్డ్ అవుట్” అని చూపించడం పారదర్శకత కాదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ డిమాండ్‌ను అవకాశంగా మార్చుకుని టికెట్ ధరలను పెంచుతున్నారని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

By
en-us Political News

  
గతంలో సిట్ కేవలం సాధారణ అవినీతి నిరోధక చట్టాల కింద విచారణ జరపగా, ఈడీ ఎంట్రీ తో కథ కొత్త మలుపు తిరిగింది. మద్యం సిండికేట్లు, వివిధ షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి? హవాలా మార్గాల ద్వారా విదేశీ ఖాతాల్లోకి ఎలా తరలిపోయాయి? అనే మనీ ట్రయిల్ గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు ఈడీ సిద్ధమైంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సాధారణంగా తనదైన దూకుడు రాజకీయ శైలితో, వాడీవేడి వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ షాక్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రూట్ ఎందుకు ఆలస్యం కానుంది? రియల్ ఎస్టేట్‌పై చూపే ప్రభావం, రాజకీయ దుమారం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తనిఖీల్లో అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందిస్తున్నట్లు, సరైన అనుమతులు లేకుండానే చికిత్సలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల్లో అధికారులు పలు క్లినిల్ లను పరిశీలించి, రికార్డులు, వైద్య సిబ్బంది అర్హతలు, చికిత్సల విధానాలపై సుదీర్ఘంగా విచారణ చేశారు.
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలతో హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. వాణిజ్య నౌకలు కనిపిస్తే పేల్చేస్తామన్న హెచ్చరికలతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు సంక్షోభంలో పడ్డాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వేదాంత 5 విడి విడి కంపెనీలుగా మారిన తర్వాత షేర్ హోల్డర్లకు వచ్చే డివిడెండ్ల పరిస్థితి ఏంటి? అల్యూమినియం, జింక్ వ్యాపారాల విభజనతో ఇన్వెస్టర్లకు లాభమా నష్టమా? మార్కెట్ నిపుణుల విశ్లేషణ పూర్తి వివరంగా ఇక్కడ చూడండి.
రాజ్యసభ అభ్యర్థిగా తాను దాఖలు చేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఆర్‌ఐ ఎఫ్‌సీఎన్‌ఆర్ (FCNR-B) డిపాజిట్లపై హెడ్జింగ్ ఖర్చులను ఆర్‌బీఐ భరించనుండటంతో, బ్యాంకులు ఇప్పుడు 6% పైగా భారీ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ సరికొత్త ఆర్థిక వ్యూహం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
దేశంలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో ఎన్‌టీపీసీ, అదానీ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ వంటి ప్రముఖ పవర్ స్టాక్స్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మెక్వారీ సంచలన నివేదికను విడుదల చేసింది. రేటింగ్స్, టార్గెట్ ధరల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గత ఏడాది కాలంలో 280% పైగా పెరిగిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ (MTAR Tech) షేర్లు హఠాత్తుగా 9% కుప్పకూలాయి. అమెరికా క్లయింట్ బ్లూమ్ ఎనర్జీ మరియు OpenAI డేటా సెంటర్ ప్రాజెక్ట్ నిలిచిపోవడమే దీనికి కారణమా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత అండర్-19 మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. డబ్ల్యూపీఎల్ స్టార్, 16 ఏళ్ల దీయా యాదవ్‌కు వన్డే జట్టులో చోటు దక్కగా, వరల్డ్ కప్ విన్నర్ భవిక అహిరేకు కెప్టెన్సీ పగ్గాలు లభించాయి. పూర్తి స్క్వాడ్, మ్యాచ్ షెడ్యూల్ ఇక్కడ చూడండి.
కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న అమరావతిని కవిత వరద ప్రాంతమంటూ ఎద్దేవా చేయడాన్ని తప్పుపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ బృందాలు గురువారం ఉదయం నుంచే విస్తృతంగా సోదాలు చేపట్టాయి. రాజ్‌ కేసిరెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలే లక్ష్యంగా జరిగిన ఈ సోదాలలో కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.