నకిలీ పోలీసుల కిడ్నాప్.. కుటుంబానికి నెల రోజుల పాటు చిత్రహింసలు
Publish Date:Feb 18, 2026
Advertisement
హైదరాబాద్లో నకిలీ పోలీసుల ముఠా మరోసారి బీభత్సం సృష్టించింది. పోలీసు వాహనం, పోలీసు యూనిఫామ్, లాఠీలు, హ్యాండ్కఫ్స్తో సినీ ఫిక్కీ తరహాలో ఓ కంపెనీ ఎండి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. నెలరోజుల పాటు సాగిన ఈ కిడ్నాప్ హైడ్రామాతో బాధిత కుటుంబం ప్రాణభయంతో వణుకుతూ దాదాపు నెలరోజుల పాటు బందీ జీవితం గడిపింది. చిట్టచివరకు పోలీసులను ఆశ్రయించింది. కూకట్పల్లికి చెందిన రామచందర్రాజు శ్రీనివాస్ సివిల్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎండిగా ఉన్నారు. అదే సంస్థలో ప్రకాష్ అనే వ్యక్తి దాదాపు 26 ఏళ్లుగా ఫైనాన్స్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో ఆ సంస్థకు కాంట్రాక్ట్ పనులు చేసిన అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు, శివరామరాజులతో రామచందర్రాజుకు ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు తలెత్తాయి. అప్పట్లో పరస్పరం సెటిల్మెంట్ జరిగినప్పటికీ, మళ్లీ భారీ మొత్తాన్ని వసూలు చేయాలనే ఉద్దేశంతో కుట్ర పన్నాడు రూ.7 కోట్లు వసూలు చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసిన నిందితులు, గతంలో నకిలీ ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతూ అరెస్టయిన నాగరాజు అలియాస్ కార్తీక్ను సంప్రదించారు. అతడు మరో ముగ్గురితో కలిసి నకిలీ పోలీస్ బృందాన్ని తయారు చేసి ఆపరేషన్కు తెరలేపాడు. ప్లాన్ ప్రకారం ఈ ఏడాది జనవరి 9న ముందుగా ఫైనాన్స్ మేనేజర్ ప్రకాష్ను కిడ్నాప్ చేశారు. అనంతరం ఎండి రామచందర్రాజు కుటుంబాన్ని కూడా అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ బందీగా ఉంచారు. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 10 వరకు దాదాపు నెలరోజుల పాటు బాధితులను ఏపీలోని ధవలేశ్వరం, హైదరాబాద్ సమీపంలోని మొయినా బాద్ ప్రాంతంలో ఉన్న ఓ ఫామ్హౌస్లలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఇప్పటికే బాధితుల నుంచి రూ.20 లక్షలు వసూలు చేసిన నిందితులు, ఇంకా రూ.4 కోట్లు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను హతమారుస్తా మని హెచ్చరించడంతో బాధితులు తీవ్ర భయాందో ళనలకు గురయ్యారు. చివరకు ప్రాణభయంతో కేపీహెచ్బీ పోలీసులను ఆశ్రయించారు.ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో శివరామరాజుతో పాటు నకిలీ పోలీసులుగా వ్యవ హరించిన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన సూత్ర ధారులుగా భావిస్తున్న అల్లూరి వెంకట సత్యనా రాయణ రాజు, నాగరాజు అలియాస్ కార్తీక్తో పాటు మరో ఇద్దరు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/fake-police-kidnapped-family-25-214274.html





