గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే బాస్... ఈటెలకు ఎర్రబెల్లి కౌంటర్

Publish Date:Aug 31, 2019

Advertisement

 

ఈటల కామెంట్స్ కు టీఆర్ఎస్ ను కౌంటర్ పడింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... ఈటెల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. అదీ కూడా తెలంగాణ భవన్ లో కేటీఆర్ తో సమావేశమైన తర్వాత మీడియాతో చిట్ చాట్ చేసిన ఎర్రబెల్లి..... గులాబీ జెండా కేసీఆర్ ఒక్కరే ఓనరంటూ ఈటలకు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ జెండాను తయారు చేసింది కేసీఆరేనన్నారు ఎర్రబెల్లి. ఈటల అంశం సమసిపోయిందని, ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదంటూ ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. అయితే, తెలంగాణ భవన్ కు వచ్చి, కేటీఆర్ తో సమావేశమైన తర్వాత ఎర్రబెల్లి... ఈ కామెంట్స్ చేయడం, అలాగే ఈటల అంశం సమసిపోయిందని, ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదంటూ చెప్పడం చూస్తుంటే.... టీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందనే అనుమానం కలుగుతోంది.

ఇదిలాఉంటే, ఈటలను కలిసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ఆయన అభిమానులు, కార్యకర్తలు, ఉద్యోగ, మహిళా, కుల సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ఇంటికి తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే ఈటల ఇంటికి తాకిడి పెరిగింది. దాంతో మేడ్చల్ దగ్గర్లోని ఈటల నివాసం సందడిగా మారింది. ఈటల నాయకత్వం వర్ధిల్లాలనే నినాదాలతో హోరెత్తిపోతోంది. మరోవైపు వచ్చిన వారందరితోనూ ఈటల ఓపికగా మాట్లాడుతున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తానెలాంటి ప్రకటనలూ చేయనని, ఓపికంగా ఉండాలని కార్యకర్తలకు ఈటల సూచించారు. 

మరోవైపు, మందకృష్ణ మాదిగ, ఆర్.కృష్ణయ సైతం ఈటలను కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సైతం... ఈటలతో సమావేశమై గంటలతరబడి మాట్లాడటం చర్చనీయాంశమైంది. అయితే, ఈటల నివాసంలోకి మీడియా కెమెరాలను, సందర్శకుల ఫోన్లను అనుమతించడం లేదు. ఈటల ఇంటికి వస్తున్నవారిని మంత్రి మనుషులు పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. ఈటల ఇంటి దగ్గర పెరుగుతోన్న నేతలు, కార్యకర్తల తాకిడి... మరోవైపు ఎర్రబెల్లి కౌంటర్... ఇలా ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే, టీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందనే అనుమానం కలుగుతోంది.

 

By
en-us Political News

  
నిజమే.. హస్తం పార్టీలో కుస్తీ పట్లు కొత్తకాదు. అందులోనూ.. అధికారంలో ఉన్న సమయంలో నాయకులు, కార్యకర్తలు నాకేంటి.. మాకేంటని పార్టీని నిలదీయడం మరీ కామన్. ఇతర పార్టీలలో అలాంటి, గోల ఉండదా అంటే.. అదేమీ లేదు, అన్ని పార్టీలలో ఉన్నదే. ఉండేదే. అందులో అనుమానం లేదు. ప్రస్తుతం తెలంగాణలో మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్ లో, కల్వకుంట్ల కుటుంబంలో జరుగతున్న రచ్చంతా.. నాకేంటి? అన్న దగ్గరే మొదలైంది, దాని చుట్టూనే తిరుగుతోంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతం కావడం, వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరమల భక్త జన సందోహంతో కిటకిటలాడుతోంది.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తామంటూ గుర్తు తెలియని దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌లో చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మరో కీలక నేత మైలార‌పు ఆడెల్లు అలియాస్ భాస్కర్‌ మృతి చెందారు.
బీఆర్‌ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే విమర్శస్తుంటే మాజీ సీఎం కేసీఆర్ నోరు విప్పలేని స్ధితిలో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. ఇవాళ అమరావతిలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయాలు ప్రకటించారు.
గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పరామర్శించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు
క్వార్జ్ట్ అక్రమ తవ్వకాల కేసులో నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఇప్పట్లో బెయిల్ లభించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో కాకాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
తన తండ్రి, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో బాధపడుతున్నారనీ, అయితే తన సోదరుడు ముద్రగిరి ఆయనకు కనీసం వైద్యం అందించకుండా వేధిస్తున్నారనీ, ఆయన ఎవరినీ కలవకుండా, ఆయనను ఎవరూ చూడకుండా అడ్డు పడుతున్నారనీ ముద్రగడ కుమార్తె క్రాంతి ట్వీట్ చేశారు.
ప్రపంచంలోనే ఎత్తయిన చినాబ్‌ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అదేవిధంగా కట్రాలో రూ.46 వేల కోట్లతో విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో ప్రారంభోత్సవాలు చేశారు.
ఇప్ప‌టి వ‌ర‌కూ అత్య‌ధిక గెలుపులంటే అవి ఆస్ట్రేలియావే. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌ర‌ల్డ్ క్రికెట్ ని ఈ దేశం శాసించినంత‌గా మ‌రే దేశం శాసించ‌లేదు. తొలి రోజుల్లో వెస్టిండీస్ ఇలాగే ఉన్నా.. త‌ర్వాతి కాలంలో ఆస్ట్రేలియా ఈ విజ‌య ప‌రంప‌ర అందిపుచ్చుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.