గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే బాస్... ఈటెలకు ఎర్రబెల్లి కౌంటర్
Publish Date:Aug 31, 2019

Advertisement
ఈటల కామెంట్స్ కు టీఆర్ఎస్ ను కౌంటర్ పడింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... ఈటెల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. అదీ కూడా తెలంగాణ భవన్ లో కేటీఆర్ తో సమావేశమైన తర్వాత మీడియాతో చిట్ చాట్ చేసిన ఎర్రబెల్లి..... గులాబీ జెండా కేసీఆర్ ఒక్కరే ఓనరంటూ ఈటలకు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ జెండాను తయారు చేసింది కేసీఆరేనన్నారు ఎర్రబెల్లి. ఈటల అంశం సమసిపోయిందని, ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదంటూ ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. అయితే, తెలంగాణ భవన్ కు వచ్చి, కేటీఆర్ తో సమావేశమైన తర్వాత ఎర్రబెల్లి... ఈ కామెంట్స్ చేయడం, అలాగే ఈటల అంశం సమసిపోయిందని, ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదంటూ చెప్పడం చూస్తుంటే.... టీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందనే అనుమానం కలుగుతోంది.
ఇదిలాఉంటే, ఈటలను కలిసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ఆయన అభిమానులు, కార్యకర్తలు, ఉద్యోగ, మహిళా, కుల సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ఇంటికి తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే ఈటల ఇంటికి తాకిడి పెరిగింది. దాంతో మేడ్చల్ దగ్గర్లోని ఈటల నివాసం సందడిగా మారింది. ఈటల నాయకత్వం వర్ధిల్లాలనే నినాదాలతో హోరెత్తిపోతోంది. మరోవైపు వచ్చిన వారందరితోనూ ఈటల ఓపికగా మాట్లాడుతున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తానెలాంటి ప్రకటనలూ చేయనని, ఓపికంగా ఉండాలని కార్యకర్తలకు ఈటల సూచించారు.
మరోవైపు, మందకృష్ణ మాదిగ, ఆర్.కృష్ణయ సైతం ఈటలను కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సైతం... ఈటలతో సమావేశమై గంటలతరబడి మాట్లాడటం చర్చనీయాంశమైంది. అయితే, ఈటల నివాసంలోకి మీడియా కెమెరాలను, సందర్శకుల ఫోన్లను అనుమతించడం లేదు. ఈటల ఇంటికి వస్తున్నవారిని మంత్రి మనుషులు పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. ఈటల ఇంటి దగ్గర పెరుగుతోన్న నేతలు, కార్యకర్తల తాకిడి... మరోవైపు ఎర్రబెల్లి కౌంటర్... ఇలా ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే, టీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందనే అనుమానం కలుగుతోంది.
http://www.teluguone.com/news/content/errabelli-dayakar-rao-reaction-on-etela-rajender-comments-39-88999.html












