Publish Date:Mar 27, 2026
మహిళల బ్యాడ్మింటన్ లో అనితర సాధ్యమన్న స్థాయిలో తనదైన ముద్ర వేసిన స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ తన క్రీడా జీవితానికి ముగింపు పలికింది. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాద్యమ వేదికగా ప్రకటించింది. బ్యాడ్మింటన్ రంగంలో తన అద్భుతమైన ఆటతీరుతో దశాబ్ద కాలానికి పైగా అగ్రస్థానంలో కొనసాగిన స్పెయిన్ దిగ్గజం కరోలినా మారిన్ చివరి సారిగా 2024 పారిస్ ఒలింపిక్స్లో సెమీఫైనల్ లో ఆడింది. అప్పుడు ఆట మధ్యలోనే మోకాలి గాయంతో వైదొలగిన కరోలినా మారిన్ ఆ తరువాత ఇప్పటి వరకూ బ్యాడ్మింటన్ కోర్టులో కనిపించలేదు. అప్పటి నుంచీ వేధిస్తున్న మోకాలి గాయం కారణంగానే తానీ రిటైర్మెంట్ నిర్ణయానికి వచ్చినట్లు ఆ భావోద్వేగ పోస్టులో పేర్కొంది.
బ్యాడ్మింటన్ కు పెద్దగా ఆదరణ లేని స్పెయిన్ నుంచి వచ్చి తన అసాధారణ ఆటతీరుతో బ్యాడ్మింటన్ లో , ఆసియా దేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేసిన కరోలినా మారిన్ 2016 రియో ఒలింపిక్స్లో భారత స్టార్ పీవీ సింధును ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుంది. తద్వారా మారిన్ ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకుంది. అంతకు ముందు 2015 ఏప్రిల్లో తొలిసారి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును అందుకున్న కరోలినా.. ఆ స్థానంలో దాదాపు వంద వారాల పాటు కొనసాగింది.
ఇక భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ లకు కరోలినా మారిన్ కొరకరాని కొయ్యగా నిలిచింది. పీవీ సింధుతో తన కెరీర్ లో 18 సార్లు ముఖాముఖీ తలపడిన కరోలినా మారిన్ 12 సార్లు విజయం సాధించింది. అలాగే సైనాతో 13 సార్లు ముఖాముఖీ పోరు జరిగితే అందలో ఏడు సార్లు కరోలినా మారిన్ విజయం సాధించింది.
తన రిటైర్మెంట్ ప్రకటనలో కరోలినా మారిన్ గాయాల తీవ్రత దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. వాస్తవానికి వచ్చే నెలలో తప స్వదేశంలో జరిగే యూరోపియన్ ఛాంపియన్షిప్లో ఆడి కెరీర్ను ఘనంగా ముగించాలని భావించాననీ, అయితే అందుకు శరీరం సహకరించలేదనీ పేర్కొంది. కరోలినా మారిన్ రిటైర్మెంట్ తో మహిళల బ్యాడ్మింటన్ లో ఒక అద్భుత శకం ముగిసిందని చెప్పాలి. అయితే ఆమె పోరాట పటిమ భవిష్యత్ తరాలకు పాఠంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/end-to-amagnificent-era-in-women--badminton-36-216254.html
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్లైన్లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.