బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్.. తిరుపతి ఘటనపై అసత్య ప్రచారాలకు ఎండ్ కార్డ్

Publish Date:Jan 13, 2025

Advertisement

తిరుమ‌ల‌లో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తిరుమ‌ల‌కు వ‌స్తుంటారు. ప్ర‌తీ రోజూ దాదాపు అర‌వై వేల‌కుపైగా భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. తిరుమల నిత్యం  స్వామినామ‌స్మ‌ర‌ణంతో మారుమోగిపోతుంది. అలాంటి తిరుమ‌ల‌లో గ‌డిచిన ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో ఎన్నో అప‌చారాలు జ‌రిగాయి. ల‌డ్డూ త‌యారీలో వాడే నెయ్యి విష‌యం ద‌గ్గ‌ర నుంచి.. తిరుమ‌ల‌లో టికెట్ల పంపిణీ.. ఉద్యోగుల నియామ‌కం ఇలా అన్నిఅంశాల్లోనూ వైసీపీ హ‌యాంలో అనేక త‌ప్పులు జ‌రిగాయి. మొత్తంగా తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను దెబ్బ‌తీసే స్థాయికి గ‌త పాల‌కుల నిర్ణ‌యాలు వెళ్లారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తో అధికారులు తిరుమ‌ల ప్ర‌క్షాళ‌న‌కు న‌డుం బిగించారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల‌ను ఒక్కొక్క‌టిగా స‌రిచేసుకుంటూ వ‌స్తున్నారు. దీంతో తిరుమ‌ల‌ను ద‌ర్శించుకునే భ‌క్తుల తాకిడి క్ర‌మంగా మరింత పెరుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా టోకెన్ల జారీ స‌మ‌యంలో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న‌లో ఆరుగురు మ‌ర‌ణించ‌గా.. ప‌దుల సంఖ్య‌లో భ‌క్తులు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు జ‌గ‌న్, వైసీపీ నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు.

తిరుప‌తిలో టోకెన్ల పంపిణీ స‌మ‌యంలో ఆరుగురు మృతిచెంద‌డం చ‌రిత్ర‌లోనే తొలిసారి. ఒక‌రిద్ద‌రు అధికారుల కార‌ణంగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే, ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే టీడీపీ పాల‌క మండ‌లి అప్ర‌మ‌త్త‌మైంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం వెంట‌నే స్పందించారు. ఘ‌ట‌న జ‌రిగిన కొన్నిగంట‌ల‌కే వారు తిరుప‌తికి వ‌చ్చి క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించి.. ప్ర‌మాదం జ‌రిగిన తీరుపై అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో అధికారుల‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రాథ‌మిక విచార‌ణ‌లో ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిలను సస్పెండ్ చేయ‌డంతోపాటు.. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌లను బ‌దిలీ చేశారు. గాయ‌ప‌డి ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న వారివ‌ద్ద‌కు వెళ్లిన చంద్ర‌బాబు.. వారిని ప‌రామ‌ర్శించి ఘ‌ట‌న జ‌రిగిన తీరును తెలుసుకున్నారు. అంతేకాక మ‌రుస‌టిరోజే వారికి ప్ర‌త్యేక వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం ఏర్పాటు చేయించారు.

అయితే, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. క్ష‌త‌గాత్రుల ప‌రామ‌ర్శ పేరుతో ఆస్ప‌త్రికివ‌చ్చిన జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తించారు. ఒక‌రిద్ద‌రే రావాల‌ని వైద్యులు వారించినా విన‌కుండా జ‌గ‌న్ స‌హా మ‌రో ప‌దిమంది వైసీపీ నేత‌లు లోప‌లికి వెళ్లారు. దీనికితోడు జ‌గ‌న్ వ‌చ్చే ముందే ప‌లువురికి ఓ వైసీపీ నేత‌ తెల్లక‌వ‌ర్లు పంచిపెట్ట‌డం సీసీ కెమెరాల్లో రికార్డు కావ‌టంతో వైసీపీ కుట్ర‌కోణం బ‌య‌ట‌కొచ్చింది. క‌వ‌ర్లో డ‌బ్బులిచ్చి చంద్ర‌బాబు వ‌ల్ల‌నే ఆ ఘ‌ట‌న జ‌రిగింద‌ని చెప్పించే ప్ర‌య‌త్నం చేసింది వైసీపీ బ్యాచ్‌. చంద్ర‌బాబు స‌కాలంలో స్పందించ‌డంతో ఘ‌ట‌న‌ను రాజ‌కీయంగా వాడుకోవాల‌న్న వైసీపీ ప్లాన్ బెడిసికొట్టింది. 

అబ‌ద్ధాల‌ను ప‌దేప‌దే ప్ర‌చారం చేసి అవి నిజ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా చేయ‌డంలో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు దిట్ట‌. దీనికి తోడు జ‌గ‌న్ సొంత మీడియా, వైసీపీ సోష‌ల్ మీడియా ఉండ‌నే ఉంది. ఘ‌ట‌న జ‌రిగిన తొలి రెండు రోజులు చంద్రబాబు కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగిందంటూ వైసీపీ మీడియా ప్ర‌చారం చేసింది. వారి ప్లాన్ బెడిసికొట్ట‌డంతో ఈ ఘ‌ట‌న‌కు కార‌ణం చైర్మ‌న్‌, ఈవో అంటూ ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టింది వైసీపీ బ్యాచ్‌.  చైర్మ‌న్‌, ఈవో మ‌ధ్య సమన్వయ లోపం, విభేదాలే ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని సొంత జగన్ మీడియా, సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం చేశాయి. చైర్మ‌న్‌, ఈవోకు వేంక‌టేశ్వ‌ర స్వామి అంటే భ‌క్తిలేదని, తిరుమ‌ల‌లో రాజ‌కీయాలు చేస్తున్నారంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేశాయి. తాజాగా వైసీపీ త‌ప్పుడు ప్ర‌చారాల‌పై టీటీడీ చైర్మ‌న్‌, ఈవో మీడియా స‌మావేశం పెట్టి సీరియ‌స్ అయ్యారు. టీటీడీ పాలక మండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. అందరూ సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆ సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారు. భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారని స్ప‌ష్టం చేశారు. దీంతో వైసీపీ అస‌త్య ప్ర‌చారాల‌కు ఎండ్ కార్డు ప‌డిన‌ట్ల‌యింది.

By
en-us Political News

  
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.