సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల ధ్యాంక్స్!

Publish Date:Jun 24, 2026

Advertisement

ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంచుతూ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.  ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై  ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో  పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును   60 నుంచి 62కు పెంపు, 2004 సెప్టెంబర్ కు ముందు నోటిఫికేషన్లతో నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

కేబినెట్ నిర్ణయాలపై ఉద్యోగులలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో  వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రతినిధులు సీఎం చంద్రబాబును బుధవారం (జూన్ 24) కలిసి  కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా తీసుకున్న వివిధ నిర్ణయాలతో తాము ఊరట పొందుతున్నామని ఉద్యోగ సంఘ నేతలు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు.   సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న వివిధ సమస్యల పరిష్కారంతో ఉద్యోగులకు, ఉద్యోగుల కుటుంబాలకు   లబ్ది కలుగుతోందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికీ మరువలేమని వారు సీఎంకు కృతజ్ణతలు తెలిపారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల కోసం ఉద్యోగులు పని చేయాలని ఈ సందర్భంగా సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. ఉద్యోగ సంఘాలన్నీ కలిసి కట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్, ప్రసాద్, ఏపీ సచివాలయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, నాపా ప్రసాద్ సహా  సీపీఎస్, పీఎస్ యూ ఉద్యోగుల అసోసియేషన్, గురుకుల, సొసైటీలు, డీఎస్సీ-2003 ఉపాధ్యాయుల సంఘానికి చెందిన నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.  

By
en-us Political News

  
మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే పారిశ్రామికవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మరణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
మహీంద్రా యూనివర్సిటీలో బీబీఏ కోర్సు చదివిన భగీరథ్ నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో.. వాటికి సంబంధించిన స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలను యూనివర్సిటీ ఇటీవల నిర్వహించింది. గత మే నెలలో జరిగిన సాధారణ సప్లిమెంటరీ పరీక్షల సమయంలో ఆయన పోక్సో కేసులో జైలులో ఉండటం తో పరీక్షలు రాయలేకపో యాడు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. బంధువు మరణించడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పామూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈ ఇద్దరు ప్రయాణికులపై కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులకు ముందుగానే సమాచారం అందింది. అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ , డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో విమానం దిగిన క్షణం నుంచే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు.
రష్యా ప్రయోగిస్తున్న ప్రమాదకరమైన షాహెడ్ డ్రోన్లను గాల్లోనే వెంటాడి వేటాడేందుకు ఉక్రెయిన్ సరికొత్త ఆటోనమస్ ఇంటర్‌సెప్టర్ డ్రోన్లను రంగంలోకి దించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 95% ఆటోమేటిక్‌గా పనిచేసే ఈ డ్రోన్ల విశేషాలు మీకోసం.
ఆస్ట్రేలియాలో ఆపిల్ తన మాక్‌బుక్ నియో, మాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్ మరియు మ్యాక్ మినీ ధరలను భారీగా పెంచింది. ర్యామ్ మరియు స్టోరేజ్ విడిభాగాల కొరతే ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
స్మార్ట్‌ఫోన్ పరధ్యానం నుండి ప్రశాంతతను ఇచ్చే డిజిటల్ మినిమలిజం జీవనశైలి మరియు జెమిని 3 ఫ్లాష్ ఏఐ ఆధారంగా పనిచేసే నథింగ్ ఓఎస్ లోని విప్లవాత్మక ఫీచర్ల గురించిన పూర్తి విశ్లేషణ.
సీనియర్ సిటిజన్లు రూ. 20 లక్షల పెట్టుబడిపై ఎక్కువ వడ్డీ మరియు పూర్తి భద్రత పొందడానికి SBI FD, SCSS, మరియు RBI బాండ్లలో ఏది బెస్ట్ ఆప్షనో ఈ పూర్తి గైడ్ ద్వారా తెలుసుకోండి.
సంపర్క్ ఇండియా లాజిస్టిక్స్ ఐపీఓ (SME IPO) జూన్ 30న ప్రారంభం కానుంది. ప్రైస్ బ్యాండ్, ముఖ్యాంశాలు మరియు ఇన్వెస్ట్‌మెంట్ విశ్లేషణను ఇక్కడ చూడండి.
జూన్ 26 శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లోని 22 క్యారెట్లు, 24 క్యారెట్ల లేటెస్ట్ మార్కెట్ రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఐర్లాండ్‌తో జరిగే మొదటి టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో ఉంటాడా? బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ చేసిన సంచలన వ్యాఖ్యలు, గంభీర్ ఇచ్చిన సలహా పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది. పరాగ్వేతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌ను 0 0తో డ్రా చేసుకుని రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ దశకు దూసుకెళ్లింది. పూర్తి పాయింట్ల పట్టిక, మ్యాచ్ విశేషాలు ఇక్కడ చూడండి.
వాటర్‌వేస్ లీజర్ టూరిజం ఐపీఓ అలాట్‌మెంట్ జూన్ 29న ఖరారు కానుంది. గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ట్రెండ్స్, సబ్‌స్క్రిప్షన్ డేటా మరియు మీ అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.