తెలంగాణా ప్రజల విజ్ఞతకు పరీక్ష

Publish Date:Apr 29, 2014

Advertisement

 

తెలంగాణా ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. వారి కలలు పండించుకొనే రోజు ఇది. ఈరోజు వారు వేస్తున్న ఓటు కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణా రాష్ట్రం యొక్క దశ,దిశలని దానితో ముడిపడి ఉన్నతమ భవిష్యత్తుని కూడా నిర్దేశించబోతోంది. అందువల్ల ఈసారి తెలంగాణా ప్రజలు మరింత లోతుగా ఆలోచించి ఓట్లు వేయవలసి ఉంటుంది. నిజానికి ఇది వారి విచక్షణ జ్ఞానానికి రాజకీయ పార్టీలు పెడుతున్న పెద్ద పరీక్ష అని భావించి, ఓటుతో తమ సత్తా చాటి చెప్పాలి.

 

ఇంతవరకు వివిధ పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలను గుప్పించారు. నానా రకాలుగా వారిని ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసారు. పరస్పర విభిన్నమైన వాదనలు వినిపించి వారిని గందరగోళ పరిచారు. తాము మాత్రమే తెలంగాణాను అభివృద్ధి పధంలో నడిపించగలమని, తాము మాత్రమే తెలంగాణా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించగలమని అందరూ చాలా గట్టిగా చెప్పుకొన్నారు. మిగిలిన పార్టీలకు ఓట్లు వేస్తే వారు ప్రజలను దోచుకొంటారని ప్రజలకు నూరిపోసేరు.

 

ఇన్ని రకాల ఒత్తిళ్ళను తట్టుకొని నేడు తెలంగాణా ప్రజలు ఓటు వేయబోతున్నారు. అయితే ప్రజలకు ఈ మాటలు చెపుతున్న రాజకీయ నేతలలో చాలా మంది తెలంగాణా ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారే. ఎప్పుడో అప్పుడు, ఎంతో కొంత కాలమయినా సదరు నేతలందరూ అధికారంలో ఉన్నవారే. మరి వారందరూ ఇంతకాలంగా తమ నియోజకవర్గం అభివృద్దికి, అక్కడి ప్రజల సంక్షేమానికి ఏమి చేసారని ప్రజలు ఒకసారి ప్రశ్నించుకొని మరీ ఓటు వేయాల్సి ఉంటుంది. ఇంతవరకు ఏమీ చేయని నేతలు మళ్ళీ ఇప్పుడు చేస్తున్న వాగ్దానాలు కూడా తమను మభ్యపెట్టేందుకేనని గ్రహించి, అటువంటి రాజకీయ నేతలకు మంచి గుణపాటం నేర్పించాలి.

 

ఎన్నికల గంట మ్రోగిన తరువాత రాజకీయ నేతలందరూ తమంతట తామే తమ నిజస్వరూపాలను బయటపెట్టుకొన్నారు. వారి స్వభావం, వారి ఆలోచనలు, వారి లక్ష్యాలు, వారి నీతినిజాయితీ ఇత్యాది అంశాలన్నిటినీ ప్రజలు గమనించే అవకాశం కలిగింది. అందువలన ఎవరు ఎటువంటివారో ప్రజలు కూడా ఈపాటికే గ్రహించి ఉంటారు గనుక ఈ వాదనలకు, భావోద్వేగాలకు, ప్రలోభాలకు, హామీలకు అతీతంగా ఆలోచించి, తమకు, తమ కొత్త రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారో వారినే ఎన్నుకోవడం మేలు.

 

ఇది రాజకీయనాయకులకి, వారి పార్టీలకి అగ్ని పరీక్ష మాత్రమే కాదు. ఈ ఎన్నికలు తెలంగాణా ప్రజల విజ్ఞతకు కూడా ఒక పరీక్ష వంటివేనని మర్చిపోకూడదు. కేవలం అధికారం, పదవుల కోసం నిత్యం రాజకీయాలు చేసే నేతలకు కాక, ప్రజాసేవ కూడా చేయగల, చేసే ఆసక్తి ఉన్న నేతలకే ఓటు వేసి ఎన్నుకోవాలి. అప్పుడే ప్రజలు వారి నుండి ఏమయినా ఆశించే వీలు ఉంటుంది. లేకుంటే మరో ఐదేళ్ళ పాటు పదవులు, అధికారం కోసం ప్రాకులాడే తమ ప్రతినిధులను చూస్తూ అటువంటి వారికి ఓటు వేసినందుకు తాపీగా పశ్చాతాపపడవలసి ఉంటుందని మరిచిపోకూడదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.