ఎన్నికల సంఘంపై విమర్శలు.. రాహుల్ తో గొంతు కలిపిన ప్రశాంత్ కిశోర్

Publish Date:Aug 8, 2025

Advertisement

ఒకప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్త అయి ఉండాలన్న అభిప్రాయం ఉండేది. 2014 కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరడానికైనా, 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నా.. అలాగే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వరుసగా మూడో సారి అధికార పగ్గాలను అందుకున్నారన్న.. అందుకు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సొంతంగా జన సురాజ్ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని బీహార్ లో తిరుగుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమై ఎదురీదుతున్నారు. అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు రాహుల్ గాంధీకి వత్తాసుగా మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత ఎన్నికల కమిషన్ పై ఆటంబాంబు లాంటి ఆరోపణతో విరుచుకుపడుతున్న సమయంలోనే ఆయన అభిప్రాయాలకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేస్తున్నారు.  ప్రజలకు భారత ఎన్నికల సంఘంపై నమ్మకం పూర్తిగా పోయిందని ప్రశాంత్ కిశోర్ తాజాగా పేర్కొన్నారు.

ఎన్నికల కమిషన్ పారదర్శకత, పనితీరు, సమర్థత విషయంలో ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని అనడమే కాకుండా ఇది చాలా ఆందోళనకర విషయమన్నారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీ మాటలను ప్రస్తావించారు. వాటినే మరోమారు వల్లె వేశారు.  ఎన్నికల కమిషన్ అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ చేసిన విమర్శలనే ప్రశాంత్ కిశోర్ అఅలియాస్ పీకే  చేశారు.  బీహార్‌లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ను గాంధీ తీవ్రంగా విమర్శించారు, దీని ద్వారా దాదాపు 65 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు ఆరోపించిన రాహుల్ గాంధీ, అదుకు సంబంధించిన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. అంతే కాదు బీహాఆర్ లో  ఒకే నియోజకవర్గంలో దాదాపు లక్ష ఓట్లు గల్లంతయ్యాయనీ ఆయన తాజా ఓటరు జాబితాను ప్రదర్శించారు.  ముస్లిం , వలసదారులకు బీహార్ లో ఓటు హక్కు లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతోందని రాహుల్ ఆరోపణలు చేశారు.

అదే విషయాన్ని ప్రశాంత్ కిశోర్ కూడా చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారనీ, ఇది ప్రజాస్వామ్యం ఉనికికే పెనుముప్పు అని పీకే ఆందోళన వ్యక్తం చేశారు.  ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల  పట్ల ఒక విఆధంగా, అధికార పక్షం విషయంలో మరో విధంగా వ్యవహరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. ఇటువంటి చర్యలే ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లేలా చేస్తోందని ప్రశాంత్ కిశోర్ అన్నారు.  

By
en-us Political News

  
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.