టీవీ చూస్తూ తింటే అనారోగ్యమే

Publish Date:Nov 7, 2016

Advertisement

 


భోజనం చేసేటప్పుడు టీవీ చూడకూడదనీ, అసలు టీవీ చూస్తూ తినే కార్యక్రమాన్ని పెట్టుకోవద్దనీ నిపుణులు తరచూ హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ కుటుంబం అంతా టీవీ చుట్టూ చేరి భోజనాలు చేసే పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. అలాంటివారికి హెచ్చరికగా ఇప్పుడు మరో పరిశోధన వెలువడింది...

 

భోజనాలని రికార్డు చేశారు

టీవీ చూస్తూ తినడానికీ అనారోగ్యానికీ మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించేందుకు మినసొటా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకుల ప్రయత్నించారు. ఇందులో భాగంగా 6-12 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న ఓ 120 కుటుంబాలని ఎన్నుకొన్నారు. వీరి ఇళ్లలో భోజనాలు జరిగిన తీరుని రికార్డు చేసి అందించమన్నారు.

- ఈ 120 కుటుంబాలలో మూడోవంతుమంది భోజనం సమయంలో అసలు టీవీ జోలికి పోలేదు.

- నాలుగో వంతు మంది రోజులో ఒక్కసారి మాత్రమే భోజన సమయంలో టీవీ చూస్తూ గడిపారు.

- 43 శాతం మంది మాత్రం రెండుపూటలా టీవీ చూస్తూనే భోజనం చేశారు.

- టీవీ చూస్తూ తినే కుటుంబాలలో మూడో వంతు మంది టీవీ మోగుతున్నా దానిని గమనించకుండానే భోజనం పూర్తిచేశారు.

 

ఇవీ ఫలితాలు

ఇంట్లో టీవీ మోగకుండా భోజనం చేసినవారు ఆహారాన్ని పూర్తిగా ఆస్వాదించినట్లు తేలింది. టీవీ వంక చూసినా చూడకపోయినా, అది వెనకాల మోగుతూ ఉన్న ఇళ్లలో తగినంత ఆహారాన్ని తీసుకోవడం లేదని తేలింది. టీవీ చూస్తూ తినే అలవాటు ఉన్న కుటుంబాలలోని ఆహారంలో కూడా తేడా ఉన్నట్లు గమనించారు. వారి భోజనంలో పండ్లు, కూరలకంటే చిరుతిళ్లే అధికంగా కనిపించాయి. ఫలితంగా ‘టీవీ భోజనం’ అనే కార్యక్రమం సాగించే కుటుంబాలలోని పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలింది.

 

కారణాలు ఉన్నాయి

టీవీ చూస్తూ భోజనం చేయడానికి, పిల్లల్లో ఊబకాయానికీ సంబంధం ఏమిటి? అనిపించవచ్చు. టీవీ ధ్యాసలో పడితే ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అన్న విచక్షణ ఉండదు. ముఖ్యంగా ఇంకా ఆహారపు అలవాట్ల మీద పట్టు లేని పిల్లలకి దగ్గర ఉండి తగిన సూచనలు అందిస్తూ ఉండాల్సింది పోయి... చిన్నా,పెద్దా టీవీ ధ్యాసలో పడిపోతే అనర్థం తప్పదంటున్నారు. పైగా ఎలాగొలా టీవీ ముందుకి చేరిపోవాలన్న ధ్యాసలో పెద్దవారు కూడా వంట కారక్రమాల జోలికి పోకుండా, బయట నుంచి ఏదో ఒక ఆహారాన్ని తీసుకువస్తున్నట్లు తేలింది. ఫలితంగా పిల్లాపెద్దా అన్న తేడా లేకుండా ఊబకాయం, అజీర్ణం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి.

 

ఇలా తినాలి

భోజనం అంటే ఏదో మొక్కుబడి కార్యక్రమం అన్న చులకన భావం ఉండబట్టే... ఆ సమయంలో కాలక్షేపం కోసం టీవీ చూస్తుంటాం. నిజానికి ఇంట్లోవారంతా కలిసి కూర్చునే ఒక సందర్భంగా భోజన కార్యక్రమం ఉండాలంటున్నారు. మంచీ చెడూ మాట్లాడుకోవడం, ఆహారాన్ని ఆస్వాదించడం, పిల్లల ఆహారపు అలవాట్లను గమనించడం వంటివి ప్రశాంతమైన వాతావరణంలోనే సాధ్యమవుతాయి. అలా కాని పక్షంలో ఏం తినాలి, ఏం తింటున్నాం అన్న విచక్షణ కూడా లేకుండా తిండి అనేది ఓ మొక్కుబడి కార్యక్రమంగా మిగిలిపోతుంది. అది కొన్నాళ్లకి విపరీత పరిణామాలకు దారి తీస్తుంది.

 

- నిర్జర.

By
en-us Political News

  
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.