దుబ్బాకలో కేంద్ర బలగాలు!  బైపోల్ పై ఢిల్లీ నిఘా 

Publish Date:Oct 29, 2020

Advertisement

తెలంగాణ రాజకీయలను షేక్ చేస్తున్న దుబ్బాక ఉప ఎన్నిక ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉప ఎన్నిక సందర్భంగా దుబ్బాక, సిద్దిపేటలో జరిగిన, జరుగుతున్న పరిణామాలపై కేంద్రం  సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. లోకల్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు రావడం, బీజేపీ హైకమాండ్ కూడా ఫోకస్ చేయడంతో 
దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దుబ్బాక నియోజకవర్గానికి కేంద్ర బలగాలను పంపించింది. ఉప ఎన్నిక కోసం వచ్చిన కేంద్ర బలగాలు దుబ్బాక నియోజకవర్గ వీధుల్లో  ఇప్పుడు కవాతు చేస్తున్నాయి. ఉప ఎన్నికను పర్యవేక్షించేందుకు  ప్రత్యేక పరిశీలకుడిని కూడా నియమించింది సీఈసీ. 


ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం కేంద్ర బలగాలను మోహరించాల్సి వచ్చిందంటే దుబ్బాకలో పరిస్థితి ఏ రెేంజ్ లో ఉందో ఊహించవచ్చు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో , తెలంగాణలో కూడా చాలా ఉప ఎన్నికలు జరిగాయి. కాని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. దుబ్బాక ఉప ఎన్నిక మాత్రం పొలిటికల్ హీట్ పెంచుతోంది. అన్ని పార్టీలు ఎన్నికలను సవాల్ గా తీసుకోవడం, ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తుండటంతో రోజు రోజుకు నియోజకవర్గంలో సమీకరణలు మారిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ప్రచారం అధికార పార్టీని కలవరపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికలో ఓడితే పరువు పోతుందన్న భయంతో టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో అక్రమాలకు పాల్పడుతుందని విపక్షాలు చేస్తున్న ఆందోళనలు నియోజకవర్గంలో కాక రేపుతున్నాయి. 

దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని బీజేపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. తమ పార్టీ నేతలపై పోలీసులతో నిఘా పెట్టించిందని, భయబ్రాంతులకు గురి చేస్తోందని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే రఘునందన్ రావు బంధువుల ఇండ్లలో పోలీసులు సోదాలు చేయడం తీవ్ర దుమారం రేపింది. మంత్రి హరీష్ రావు డైరెక్షన్ లో పోలీసులే  రఘునందన్ రావు ఇంట్లో డబ్బులు పెట్టారని బీజేపీ ఆరోపించగా.. ఆ ఇంట్లోనే డబ్బులు దొరికాయంటూ సిద్ధిపేట సీపీ వీడియో ఫూటేజీని విడుదల చేశారు. ఇక సిద్ధిపేట సోదాల ఘటనపై బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. సిద్ధిపేటకు వస్తున్న పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతను మరింత పెంచింది. తనపై సిద్ధిపేట పోలీసులు దాడి చేశారని ఆరోపించిన సంజయ్.. ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ ఏకంగా దీక్షకే దిగారు. 

బీజేపీ అభ్యర్ది రఘునందన్ రావు మామ, బంధువుల ఇంటిపై పోలీసుల సోదాలు, బంజి సంజయ్ పై పోలీసుల దురుసు ప్రవర్తనను బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది.
దుబ్బాక లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ పెద్దలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని సమాచారం. 
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, దుబ్బాక పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు కు ఫోన్ చేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది

సిద్ధిపేట, దుబ్బాక ఘటనలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని చెప్పారు. స్థానిక పోలీస్ అధికారులపై తమకు నమ్మకం లేదన్నారు.  సిద్ధిపేట్ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని, కేంద్ర బలగాలతో మాత్రమే దుబ్బాక ఉప ఎన్నికలు జరపాలని కోరారు. బీజేపీ నాయకులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తోన్న విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్ళారు కమలం నేతలు.  దుబ్బాకకు  ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని బీజేపీ ఈసీకి విన్నవించింది. రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న ఫిర్యాదుల మీద  ఫిర్యాదులు, బీజేపీ పెద్దల జోక్యంతోనే  సరోజ్‌ కుమార్‌ ఠాకూర్‌ను ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించినట్లు తెలుస్తోంది. 


తమిళనాడు కేడర్‌కు చెందిన సరోజ్‌ కుమార్‌.. ప్రస్తుతం చెన్నై సైబర్‌క్రైం విభాగ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది పశ్చిమబెంగాల్‌ ఉప ఎన్నికల పరిశీలకుడిగా పనిచేసిన సరోజ్‌కుమార్‌.. సమర్థంగా ఎన్నికలను నిర్వహించినందుకుగాను అవార్డు కూడా తీసుకున్నారు. ఉప ఎన్నికకు శాంతి భద్రతల పరిశీలకుడిగా సరోజ్‌ కుమార్‌ ఠాగూర్‌ను నియమించడాన్ని  బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ  బండి సంజయ్‌ కుమార్‌ స్వాగతించారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం లోకల్ పోలీసులను అడ్డు పెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్న కారు పార్టీ ఆగడాలు ఇకపై సాగవన్నారు సంజయ్. ఎన్నికల నిర్వహణలో సమర్థుడిగా పేరున్న సరోజ్ కుమార్ నియామకంలో దుబ్బాకలో అధికార పార్టీ అక్రమాలకు చెక్ పడుతుందని కమలం నేతలు చెబుతున్నారు. 

దుబ్బాక ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో  గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ రోజున ఉద్రిక్తతలు తలెత్తవచ్చని భావిస్తున్నారు. అందుకే నియోజకవర్గంలో సమస్యాత్మక గ్రామాల్లో మరిన్ని బలగాలను మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. మొత్తంగా  ఉపఎన్నిక పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించడం,  కేంద్ర బలగాలను దించడంతో  దుబ్బాక నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంతగా హీటెక్కిస్తున్న దుబ్బాకలో ఏం జరగబోతుందన్న దానిపై రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.