జగన్ పరువు తీస్తున్న పోలీసులు!

Publish Date:Oct 30, 2020

Advertisement

రైతన్న చేతికి బేడీలా? సిగ్గుచేటు

 

యాక్షన్ చేయమంటే ఓవరాక్షన్ చేస్తున్నారా?

 

వైసీపీ నేతల సీరియస్

 

జగన్‌కు విపక్షం నుంచి ఇప్పట్లో ప్రమాదం లేదు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, ఇప్పుడు జూమ్‌లో జీవిస్తోంది. మిగిలిన పక్షాలు ప్రకటనలతో జీవించేస్తున్నాయి. అయినా.. జగన్ పాలనపై జనంలో వ్యతిరేకత పెరగడం ఆశ్చర్యమే కదా? మరి విపక్షాలన్నీ బలహీనంగా ఉంటే, జగన్‌కు ఇక సమస్య ఏమిటి? అన్నదే కదా సందేహం. యస్. జగన్ సర్కారు పాలిట అధికారులే విపక్షాలు. వారే ఇప్పుడు ఆయనకు ఓ పెద్ద సమస్య.

 

జగన్ సీఎం అయిన తర్వాత, పోలీసు ‘పవరు’ పెరిగింది. ఒకప్పుడు సోషల్ మీడియాలో పోస్టింగు పెట్టిన వారిపై, టీడీపీ సర్కారు కేసులు పెడితే, విపక్ష నేతగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి దానిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే స్వేచ్ఛ కూడా లేదా అని వాపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న వారిని, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సీఐడీని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారన్న భావన కల్పించడంలో, పోలీసులు విజయం సాధించారు.

 

గ్రామాల్లో విపక్షాలకు చెందిన కార్యకర్తలు, గ్రామం విడిచిపోయేలా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక అధికార పార్టీ నేతల మెహర్బానీ కోసం పోలీసుస్టేషన్లే వేదికగా, శిరోముండనాలు చేస్తున్న దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్-టీడీపీ పాలించినా.. పోలీసులు, ఈ స్థాయి ఓవరాక్షన్ చేసిన దాఖలాలు లేవు. అధికార పార్టీకి 60 శాతం సానుకూలంగా పనిచేస్తే, ప్రతిపక్షాలకు 40 శాతం సానుకూలంగా ఉండేవారు. గ్రామస్థాయిలో కక్షలు, ముఠా తగాదాల నేపథ్యంలో హత్యాకాండలు మాత్రమే చూశాం.

 

కానీ, గత 17 నెలల నుంచి ఇవన్నీ మారిపోయాయి.. జర్నలిస్టులను కూడా కేసులు, సీఐడీ విచారణ పేరిట వేధించడం చూస్తున్నాం. టీవీ5 జర్నలిస్టు మూర్తి, తెలుగువన్ అధినేత రవిశంకర్‌ను వేధించిన సందర్భాల్లో, వారికి కోర్టులే దిక్కయ్యాయి. ఇక అమరావతి ఉద్యమాన్ని కవర్ చేస్తున్న విలేకరులపై కులం పేరుతో దూషించిన కేసులు పెట్టి, కోర్టులో అభాసుపాలయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోలీసుల స్థాయి చిన్నదయిపోతుంది. అది వారి గౌరవానికే భంగకరం.

 

ఇప్పుడు పోలీసుల ఓవరాక్షన్.. రైతుల చేతికి బేడీలు వేసేవరకూ వెళ్లడం ద్వారా, నిరంకుశత్వం పరాకాష్టకు చేరినట్లే లెక్క. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు చేతికి, బేడీలు వేసిన చిత్రాలు చూసిన రైతన్న గుండె కాలిపోయింది. ఆత్మగౌరవరం దెబ్బతింది. రైతులలో రాజకీయ పార్టీలకు అభిమానులు ఉండవచ్చు. కానీ రైతు ఎక్కడైనా రైతే. రైతు ఆత్మగౌరవానికి మాత్రం పార్టీలుండవు.

 

సాటి రైతు చేతికి బేడీలు వేసిన పోలీసు చర్యతో, నిజమైన రైతు ఆత్మాభిమానం ఎందుకు దెబ్బతినకుండా ఉంటుంది? దేశద్రోహులకు జైళ్లలో బిర్యానీలు పెట్టి, తెగమేపుతున్న ఈ కాలంలో.. బ్యాంకులకు వందలు, వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి, కాలరెగరేసిన వారికి రెడ్‌కార్పెట్ వేస్తున్న ఈ రోజుల్లో..చట్టంలో లొసుగులను ఆసరా చేసుకుని, వైట్‌కాలర్ నేరగాళ్లు, హంతకులు దర్జాగా తిరుగుతున్న ఈ రోజుల్లో.. సేద్యం చేసుకునే తోటి రైతు చేతులకు బేడీలు వేస్తే, రైతాంగం మనసు మండకుండా, నవరంధ్రాలు మూసుకుంటాయని భావించడమే వెర్రితనం.

 

అసలు నిందితుల చేతికి బేడీలు ఏ దశలో వేయాలి? ఏ రకమైన నేరస్తుల చేతికి మాత్రమే అవి ఉండాలి? అసలు మానవహక్కుల గురించి జ్ఞానం లేని పోలీసులు చేసిన ఓవరాక్షన్‌కు, జగన్ సర్కారు పరువుపోయిందన్నది వైసీపీ నేతల ఆందోళన. సాధారణ రైతు చేతికి బేడీలు వేసిన ఫొటోలు, సోషల్ మీడియాలో వస్తే.. సర్కారు పరువు గంగలో కలసిపోతుందని తెలియని వారి చేతిలో, పోలీసు వ్యవస్థ ఉండటం దారుణమని వైసీపీ నేతలు మొత్తుకుంటున్నారు.

 

పోలీసులను యాక్షన్ చేయమంటే, ఓవర్ యాక్షన్ చేస్తున్నారని.. వారివల్లనే తమ ప్రభుత్వం పరువుపోతోందని, వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పోలీసు ఓవరాక్షన్ వల్ల డీజీపీ, స్వయంగా రెండుసార్లు హైకోర్టు గడప తొక్కాల్సిన దుస్థితి కూడా, కిందిస్థాయి పోలీసులలో మార్పు తీసుకురాకపోవడమే విచిత్రం. ఇప్పుడు రైతులకు బేడీలు వేసిన పోలీసు ఓవరాక్షన్‌తో జగన్ ప్రభుత్వం, రైతుల ముందు ముద్దాయిగా నిలబడాల్సిన దుస్థితి వచ్చిందంటున్నారు. ఈ పరిణామం టీడీపీకి రాజకీయంగా కొత్త అస్త్రం ఇచ్చినట్టయిందని వాపోతున్నారు.

 

‘రైతుల చేతికి సంకెళ్లు వేయమని జగన్ ఎందుకు చెబుతారు? మొన్న సర్వే రాళ్లకు, జగన్ ఫొటో వేసిన విషయం ఎవరికీ తెలియదు. అధికారులే ఓవరాక్షన్ చేశారు. అది తెలిసి మందలించడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అంటే అది జగన్‌కు తెలియకుండానే జరిగిందని తేలింది కదా? తన ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలని ఏ సీఎం అయినా కోరుకుంటారా? ప్రభుత్వం దగ్గర మార్కులు కొట్టేయాలన్న ఓవరాక్షన్‌తోనే ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్లనే, హైకోర్టు దృష్టిలో మేం చులకన అవుతున్నాం. ఇప్పుడు ఆ పోలీసులను సస్పెండ్ చేయవచ్చు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా? ఆ నష్టాన్ని పోలీసులు మళ్లీ భర్తీ చేయగలరా?’ అని ఓ వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. నిజమే కదా?.. తన ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవాలని, ఏ పాలకుడు మాత్రం కోరుకుంటారు?

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.