మహిళా లోకానికి ఆదర్శం డ్రైవర్ సంద్యా రాణి!

Publish Date:Jul 15, 2025

Advertisement

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్..  అన్నారు  చిలకమర్తి వారు.  ప్రసన్నయాదవం  పద్యకావ్యంలో... నాలుగు పాదాల చంపకమాల పద్యంలో ఇది నాలుగో పాదం. తెలుగు భాషఫై కొద్దిపాటి మక్కువ, కొంచెంగా ప్రవేశం ఉన్న ఎవరికైనా ఈ పద్య పాదం తరచూ గుర్తుకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా..  డ్రైవర్   సంధ్యారాణి వంటి వారి కథలు విన్నపుడు చిలకమర్తి వారి పద్యం  చటుక్కున వచ్చి నాలుక పై వాలుతుంది. కొద్దిగా ప్రేమగా నేర్పిస్తే ఆడ లేడీస్ అన్ని విద్యలు ఇట్టే  నేర్చుకుంటారని, ఈ పద్య పాదం అర్థం. సరే. ఆ విషయాన్ని అలా ఉంచి అసలు విషయంలోకి వస్తే..  ఒరిస్సా ప్రభుత్వం తొలిసారిగా  ఒక మహిళను ప్రభుత్వ వాహన డ్రైవర్ గా నియమించింది. ఈ వార్త ఒరిస్సాలోనే కాదు, దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

నిజానికి  కారు డ్రైవింగ్ అన్నది  ముదితలకు రాని విద్య కాదు.  మహిళలు నేర్వని విద్యా కాదు.  హైదరాబాద్ వంటి మహానగారాల్లో వందల మంది.. కాదు  వేల మంది మహిళలు, కార్లు నడుపుతున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ లో పురుషులను దాటి దూసుకు పోతున్నారు. సొంత కార్లే కాదు.. క్యాబులూ నడుపుతున్నారు. నిజానికి.. మహిళలు సొంత కార్లు క్యాబులు కాదు, ఏకంగా యుద్ధ విమానాలనే నడుపుతున్నారు. పహల్గావ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా మన వైమానిక దళం పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలను, నేలమట్టం చేసిన ఆపరేషన్ లో  విమెన్ పైలెట్స్  చేసి చూపిన సాహస విజయం ప్రపంచాన్నే విస్మయ పరిచింది. 

ఇలా భారతీ మహిళలు అన్నిరంగాలలోకి చొచ్చుకు పోతున్నపుడు, ఒక మహిళ ప్రభుత్వ కారు డ్రైవర్  కొలువు పొందడంలో విశేషం ఏముందని అనిపించవచ్చును. కానీ  ఉంది... ఎందుకంటే, ఒరిస్సా ప్రభుత్వంలో ప్రప్రధమ డ్రైవర్  సంధ్యారాణి. అంతే కాదు ఆమెకు ఇది వరకూ ప్రైవేట్ స్కూల్ బస్ వంటి భారీ వాహనాలను నడిపిన అనుభవం కూడా ఉంది. 

అదొకటి  అయితే, సంధ్యారాణికి మొదటి నుంచి డ్రైవింగ్ పట్ల మక్కువ ఉండేది. విద్యార్థిగా ఉన్నరోజుల్లోనే బైక్ నడపడం నేర్చుకున్నారు. వివాహం తర్వాత కారు కూడా నేర్చుకోవాలని తన భర్తకు తెలిపారు. అలా మెల్లిగా కారును డ్రైవ్ చేయడం నేర్చుకున్నారు. ఆ తర్వాత సంధ్యారాణి భర్త నానో కారు ఆమెకు బహుమతిగా ఇచ్చారు. దీంతో ఆమె, తన స్నేహితులను రాష్ట్రంలోని వివిధ టూరిస్ట్ ప్రాంతాలకు కారులో తీసుకెళ్లేవారు. అలా డ్రైవింగ్ అనుభవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. తర్వాత ఆమెకు పెద్ద వాహనాలు నడపాలని కోరిక కలిగింది. భర్త, బంధువుల సహకారంతో రాష్ట్ర రవాణా సంస్థ ఆధ్వర్యంలో కటక్ ఛాటియాలోని హెవీ మోటార్ వెహికిల్ శిక్షణ కేంద్రంలో డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ పొందారు. శిక్షణ అనంతరం 2023లో విదేశాలలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయారు. ఆ తర్వాత వివిధ ప్రైవేటు స్కూల్ బస్సులు నడిపారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో డ్రైవర్ పోస్ట్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దాని గురించి తెలుసుకున్న సంధ్యారాణి దరఖాస్తు చేసుకున్నారు. 2025 జూన్ లో ఒడిశా వాణిజ్యం, రవాణా, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి ఉషా పాధీకి అధికారిక డ్రైవర్‌గా సంధ్యారాణి నియమితులయ్యారు. 

ఒక విధంగా ఇది మహిళా సాధికారిత దిశగా మరో ముందడుగు అని చెప్పాలి. నిజానికి చిన్ననాటి చిరు కోరికను  స్వయం కృషితో వృత్తిగా మలచుకున్న సంధ్యారాణి మహిళలకే కాదు.. అందరికీ ఆదర్శమే. అలాగే  ఒరిస్సా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా అన్నట్లుగా.. ఆమె నియామకం మహిళా సాధికారత, సాంప్రదాయేతర వృత్తులలో చేర్చడం వైపు బలమైన అడుగు. అలాగే..  ఇది ఆరంభం మాత్రమే .. ముందు ముందు ప్రతి  సంవత్సరం 500మంది మహిళలకు డ్రైవింగ్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఒరిస్సా ప్రభుత్వం నిర్ణయించింది. అలా ఆమె వేసిన ముందడుగు..  మహిళా లోకానికి మరో ఉపాధి మార్గాన్ని చూపింది. అందుకే  డ్రైవర్ రాణి .. సంద్యారాణి  మహిళా లోకానికి ఒక ఆదర్శం.

By
en-us Political News

  
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.