Publish Date:Jul 15, 2025
రాష్ట్రీయ సయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్.. ఇంచుమించుగా వారం రోజుల కిందట ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జూలై 9న ప్రధానమంత్రి రిటైర్మెంట్ గురించి, సూచన ప్రాయంగా చేసిన వ్యాఖ్య రాజకీయ సంచలనంగా మారింది. నిజానికి.. ఆర్ఎస్ఎస్ అధినేత, ప్రదాని మోదీని ఉద్దేశించే రిటైర్మెంట్ ప్రస్తావన తెచ్చారా, లేక అన్యాపదేశంగా ఆ ప్రస్తావన తీసుకొచ్చారా అనే విషయంలో స్పష్టత లేకపోయినా మోహన్ భగవత్ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు భగవత్ వ్యాఖ్యలను మోదీని విమర్శించేందుకు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అయితే.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం ,రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ అనేది ఉండదని, ఉండరాదని అంటున్నారు. కాగా.. తాజాగా, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ ఇంకో ముందడుగు వేశారు. నరేంద్ర మోడీ 75 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ చేస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రధానమంత్రిగా చేయాలని ప్రతిపాదించారు.
దేశానికి తదుపరి ప్రధానమంత్రి గడ్కరీ కావాలి.. ఎందుకంటే గడ్కరీ సామాన్యులకు అండగా ఉన్నారు. రహదారులు మౌలిక సదుపాయాల పరంగా దేశాభివృద్ధికి గడ్కరీ గట్టి పునాదులు వేశారు అని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
అలాగే, ధనిక, పేదల మధ్య పెరుగుతున్న అంతరం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ గడ్కరీ చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకుంటే.. ఆయనకు దేశాభివృద్ధికి సంబంధించి ఒక భావన ఉందని, అలాంటి వ్యక్తిని ప్రధానమంత్రిని చేయాలని అన్నారు. 75 ఏళ్లు నిండిన వారు రాజీనామా చేయాల్సి ఉంటుందని మోహన్ భగవత్ సూచించారు. కాబట్టి గడ్కరీకి సమయం ఆసన్నమైందని తానూ భావిస్తున్నట్లు గోపాల అన్నారు. అంతే కాదు.. ఆయన ఇక్కడ కర్ణాటక మాజే ముఖ్యమంత్రి యెడియూరప్పను, 75 సంవత్సరాలు నిండగానే రాజీనా చేయించిన విషయాన్ని గుర్తు చేసారు. ఆయనకో రూలు మోడీకి ఓ రూలు ఏమిటని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gadkari-in-place-of-modi-as-pm-25-202062.html
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.