ముచ్చ‌ట‌గా 3 టిమ్స్‌లు.. వ‌ట్టి ముచ్చ‌ట్లేనా? క‌ట్టేదుందా?

Publish Date:Apr 26, 2022

Advertisement

హైద‌రాబాద్ న‌లుమూల‌లా నాలుగు టిమ్స్‌లు. అందులో మూడిటికి ఒకేరోజు శంకుస్థాప‌న చేశారు సీఎం కేసీఆర్‌. ఈ విష‌యాన్ని ఘ‌నంగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. భూమి పూజ వ‌ర‌కైతే ఓకే.. మ‌రి, ఆ ఆసుప‌త్రులు ఇప్ప‌ట్లో క‌డ‌తారా? అనే డౌటనుమానం. ఎందుకంటే, గ‌తంలో ఉస్మానియా ద‌వాఖానాలో పాత భ‌వ‌నాలు కూల్చేసి కొత్త బిల్డింగ్ క‌డ‌తానంటూ ఇలానే గొప్ప‌ల‌కు పోయారు కేసీఆర్‌. ఇటీవల వ‌రంగ‌ల్ ఎంజీఎం విష‌యంలోనూ ఇలానే అన్నారు. ఏళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కూ ఇటు ఉస్మానియా ఆసుప‌త్రి భ‌వ‌నాలు క‌ట్ట‌లేదు లేదు.. అటు వ‌రంగ‌ల్‌ ఎంజీఎం హాస్పిట‌ల్‌కు పునాది కూడా వేయలేదు. ఎక్క‌డి గొంగ‌లి అక్క‌డే ఉన్నా.. కొత్త‌గా జీహెచ్ఎమ్‌సీకి నాలుగు దిక్కులా నాలుగు టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) అంటూ సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి మ‌భ్య‌పెడుతున్నారంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కేసీఆర్ మాట‌ల‌కు చేత‌ల‌కు అస‌లు పొంత‌నే ఉండ‌ద‌ని అంటున్నారు. అందుకే, ఒకేరోజు మూడు టిమ్స్‌ల‌కు శంకుస్థాప‌న‌ చేసినా.. ఆయ‌న హ‌యాంలో అవి ప్రారంభమవుతాయనే న‌మ్మ‌కం మాత్రం ఎవ‌రికీ లేదంటున్నారు విమ‌ర్శ‌కులు.  గ‌తంలో ఆయ‌న‌లా పిట్ట‌ల‌దొర మాట‌లు చెప్పి ఉండ‌క‌పోతే.. ఈ టిమ్స్‌లు క‌డ‌తారో కట్ట‌రో అనే అనుమానం రాక‌పోయేది కావొచ్చు. అప్పుడెప్పుడో ఏళ్ల క్రితం సీఎం హోదాలో ఉస్మానియా హాస్పిట‌ల్‌ను ప‌రిశీలించి.. ఈ పాత భ‌వ‌నాలు కూల‌గొడ‌తాం.. ఇక్క‌డ 10 అంత‌స్థుల బిల్డింగ్ క‌డ‌తాం.. సూప‌ర్ స్పెషాలిటీ వార్డులు పెడ‌తాం.. అంటూ ఊద‌ర‌గొట్టారు. ఆ త‌ర్వాత కోర్టు కేసుల సాకుతో ఆవైపే చూడ‌లేదాయ‌న‌. సేమ్ టు సేమ్ వ‌రంగ‌ల్ ఎంజీఎం హాస్పిట‌ల్ విష‌యంలోనూ అంతే. న‌గ‌రం మ‌ధ్య‌లో ఉన్న జైలును సిటీ శివార్ల‌కు త‌ర‌లించి.. ఆగ‌మేఘాల మీద కేంద్ర కారాగారాన్ని కూల‌గొట్టేసి.. హ‌డావుడిగా కొత్త ఎంజీఎం ద‌వాఖానాకు భూమిపూజ చేశారు. ఆయ‌న కొబ్బ‌రికాయ కొట్టి నెల‌లు గ‌డుస్తున్నా.. ఇప్ప‌టికీ పునాదిరాయి కూడా వేయ‌లేదు. కొత్త‌ది క‌డుతున్నామంటూ.. పాత ఎంజీఎంను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అక్క‌డ ఐసీయూలో పేషెంట్ల‌ను ఎలుక‌లు కొరుక్కుతిన్న ఘ‌ట‌న‌లు క‌ల‌క‌లం రేపాయి. అట్లుంట‌ది కేసీఆర్‌తోని. 

వినేవాళ్లు, చూసేవాళ్లు ఉండాలే కానీ సీఎం కేసీఆర్ ఇలాంటి ముచ్చ‌ట్లు, ప‌నులు ఎన్నైనా చేస్తారంటారు. ద‌ళిత ముఖ్య‌మంత్రి, మూడెక‌రాల భూమి, డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నుంచి.. ద‌ళిత బంధు, క‌రీంన‌గ‌ర్‌ను చికాగో చేయ‌డం, ఉస్మానియా, ఎంజీఎం హాస్పిట‌ల్స్ క‌డ‌తాన‌న‌డం వ‌ర‌కూ.. ఆయ‌న చేసిన మాట‌ల‌ గారెడీలు ఎన్నో ఎన్నెన్నో అంటూ ఉద‌హ‌రిస్తున్నారు. ఆయ‌న‌ కావాల‌నుకుంటే మాత్రం ఆ ప‌ని వెంట‌నే అయిపోతుంది. ఉస్మానియా ఆసుప‌త్రిని ప‌క్క‌న పెట్టేసి.. అట్ట‌హాసంగా ప్ర‌గ‌తిభ‌వ‌న్ మాత్రం క‌ట్టేసుకున్నారు. కొత్త స‌చివాల‌య భ‌వ‌నాన్ని జెట్ స్పీడ్‌తో క‌ట్టేస్తున్నారు. కానీ, ఆ ప‌క్క‌నే క‌ట్టాల్సిన 100 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హానికి మాత్రం ఇంకా పునాదులే త‌వ్వ‌లేదు. ఇక‌, జైలును కూల్చేసినంత వేగంగా వ‌రంగ‌ల్ ఎంజీఎం హాస్పిట‌ల్‌ను మాత్రం క‌ట్ట‌ట్లేదు. ఇప్పుడు కొత్త‌గా మూడు టిమ్స్‌లు అంటూ హ‌డావుడి చేస్తున్నారు కానీ.. క‌ట్టేదిలేదు పాడూలేదంటూ జ‌నం విసుక్కుంటున్నారు. ఆయ‌న‌పై అంత‌గా న‌మ్మ‌కం పోయింది ప్ర‌జ‌ల‌కు. అందుకు ఆయ‌న వ్య‌వ‌హారశైలే కార‌ణమ‌ని చెబుతున్నారు. 

కొత్త‌గా ఆసుప‌త్రి క‌ట్టాలంటే వేల కోట్ల ఖ‌ర్చు. ఏళ్ల పాటు ఆల‌స్యం. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లోని అల్వాల్‌, గడ్డిఅన్నారం, ఎర్రగడ్డల‌లో నిర్మించ త‌ల‌పెట్టిన టిమ్స్‌ల కోసం సుమారు 2700 కోట్లు నిధులు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా. నిజంగా క‌డితేగ‌నుక, అది క‌ట్టేలోపు బ‌డ్జెట్ మ‌రింత పెరిగిపోవ‌డం ప‌క్కా. అదే, ప్ర‌స్తుతం నిత్యం వేల‌మందికి చికిత్స అందిస్తున్న ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌, కోఠి, నీలోఫ‌ర్ త‌దిత‌ర ఆసుప‌త్రుల‌కు పెద్ద ఎత్తున నిధులు అంద‌జేస్తే.. ఆయా హాస్పిట‌ల్స్‌లో అద‌న‌పు బెడ్స్‌, ఆధునిక వైద్య స‌దుపాయాలు క‌ల్పిస్తే.. చాలా త‌క్కువ ఖ‌ర్చులోనే, చాలా త‌క్కువ స‌మ‌యంలోనే.. వేగంగా మ‌రింత మెరుగైన చికిత్స అందించే అవ‌కాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయ‌క‌, స‌మ‌స్య‌ల సుడిగుండంలో చిక్కుకుపోయిన పెద్దాసుప‌త్రుల‌ను అభివృద్ధి చేయ‌క‌.. కొత్త‌గా పెద్ద పెద్ద బ‌హుళ అంత‌స్థులు క‌ట్టి.. కొత్త ఆసుప‌త్రులు నిర్మిస్తామ‌ని చెబుతుండ‌టం.. ఆ బిల్డింగుల పేరు జెప్పి.. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి.. ఓట్లు దండుకొనే కార్య‌క్ర‌మ‌మే త‌ప్ప.. అది అయ్యేది కాదు పొయ్యేది కాదు.. అంటూ పెద‌వి విరుస్తున్నారు ఏళ్లుగా కేసీఆర్ మాట‌లు, చేష్ట‌లు గ‌మ‌నిస్తున్న తెలంగాణ ప్ర‌జ‌లు.  

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.