వైఎస్ వారసత్వం అంటే ఒక కులంపై వేధింపులు.. సాధింపులేనా?

Publish Date:Aug 8, 2025

Advertisement

ఇరవై ఏళ్ల యుద్ధానికి తెరపడింది. ఇది చూడడానికి ఒక సంస్థపై యుద్ధమే అయినా, దీని వెనుక రాజకీయం, కులం కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజల్ని ప్రభావితం చేయగలిగే ఒక వ్యక్తి, ఒక పత్రికపై పరోక్షంగా, ప్రత్యక్షంగా జరిగిన దాడి.  రాష్ట్రంలో  విపరీతమైన ప్రజాభిమానం, విశ్వాసం ఉన్న పత్రిక, దానిని నిర్వహిస్తున్న యజమాని రామోజీరావుగారి మీద జరిగిన కక్షసాధింపు చర్య. సామాన్య, మధ్యతరగతి ప్రజల విశ్వాసం చూరగొన్న మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో  ఫిర్యాదులు చేయించి, ప్రభుత్వం చేత కేసులు వేయించారు. దేశంలో ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు, డొల్ల కంపెనీలు నడుస్తుంటే, ఈ సంస్థపైనే కేసు వేయడానికి కారణం రాజకీయమే. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలపరుస్తున్న సామాజికవర్గాన్ని, దానికి మూలస్తంభం లాంటి  వ్యక్తి ఆర్థిక మూలాలు దెబ్బకొడితే రాష్ట్రంలో తనకు ఎదురు ఉండదని భావించారేమో!
2006లోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేత రిజర్వ్ బ్యాంకుకు, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంకు ఫిర్యాదు చేయించారు. 2008లో  రాష్ట్రప్రభుత్వమే కేసు కట్టింది.  
వేలాది మంది డిపాజిటర్లలో ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. పరోక్షంగా కొందరిపై ఒత్తడి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అదీ ఆ కంపెనీపై ఉన్న విశ్వసనీయత. అయినా ప్రభుత్వమే కేసు వేయడంతో.. ఈ వ్యాపారాన్ని ఉపసంహరించుకోదలచిన మార్గదర్శి, డిపాజిట్ దారులకు వారి నగదు వాపసు చేయడానికి సిద్ధమైంది. అయితే ఆ ప్రయత్నంలోనూ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడింది. రామోజీ గ్రూపు సంస్థల నిధులు సేకరించడానికి కొన్ని యూనిట్లు విక్రయానికి పెట్టినా.. బ్లాక్ స్టోన్ వంటి కంపెనీని బెదరించి వెనక్కుపోయేలా చేసింది రాజకీయమే.

నిమేష్ కంపానీని కూడా అలాగే కేసులు పెట్టి బెదరించే పరిస్థితి రావడంతో, ఆయన అమెరికా వెళ్లి, అక్కడ నుంచి రిలయెన్స్ ద్వారా  రామోజీ గ్రూప్ సంస్థలకు నిధులు సమకూర్చారు.  అయితే డిపాజిటర్లకు తిరిగి చెల్లింపులు చేసే అవకాశం లేకుండా ప్రభుత్వం కక్ష గట్టి, ఆఫీసులోని చెక్కుబుక్కులు, రశీదు పుస్తకాలతో సహా మొత్తం డాక్యుమెంట్లన్నీ ట్రక్కుల కొద్దీ అప్పటి సీఐడీ అధికారుల చేత దాటవేయించారు. ఈ చర్య డిపాజిటర్లకి నష్టం అని ఆలోచన లేకుండా వైఎస్ ప్రభుత్వం వ్యవహరించింది. 2015లో ఉమ్మడి హైకోర్టులో కేసు కొట్టివేసినా, మళ్లీ సుప్రీంలో కేసు వేశారు. అయితే సుప్రీం కోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది.  తాజాగా ఈ కేసును కొట్టివేశారు. అప్పట్లో ఈ వ్యవహారంపై అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. ఎక్కడైనా డిపాజిటర్లు కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు.  కానీ మార్గదర్శి విషయంలో డిపాజిటర్లు కంపెనీ కోసం అనుకూలంగా ఉద్యమించారు.

 రాజశేఖరరెడ్డి శకం ముగిశాక, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన కూడా అదే ఒరవడిలో కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో చట్టబద్ధత లేని చిట్ ఫండ్ కంపెనీల జోలికి పోకుండా, ఆయన మార్గదర్శి చిట్ ఫండ్స్ పై కేసులు పెట్టించి, ఏడాది పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆ కంపెనీ వ్యాపారాన్ని స్తంభింపచేశారు.  రిజిష్ట్రార్ లను ఆఫీసులపైకి  తనిఖీలకు పంపి, వారి చేత కేసులు పెట్టించి, సీఐడీ ద్వారా దర్యాప్తు పేరుతో వేధింపులకు పాల్పడ్డారు. ముగ్గరు మార్గదర్శి మేనేజర్లను, ఒక ఆడిటర్ ను అరెస్టు చేసి హడావుడి చేశారు. చివరకు హైదరాబాద్ లో వృద్ధాప్యంతో మంచం మీద ఉన్న రామోజీరావుగారిని అరెస్టు చేయడానికి ఆయన ఇంటి చుట్టూ పోలీసుల్ని మోహరించారు. అయితే సకాలంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి, అండగా నిలిచింది.  ఒక్క రోజైనా ఆయన్ను జైలులో పెట్టాలన్న జగన్ సంకల్పానికి బ్రేక్ పడింది.

అవినీతి కేసులో జైలుకెళ్ళిన జగన్, ప్రత్యర్థుల్ని జైలులో పెడితేగానీ, తన ప్రతిష్టకు కలిగిన భంగం తొలుగుతుందనుకున్నారేమో మొత్తానికి ఆయన దుందుడుకు చర్యలకు వెంటనే వచ్చిన ఎన్నికల్లో ఓటమే ఆయన్ని కట్టడి చేసింది.  మొత్తం మార్గదర్శిపైనా, రామోజీరావుగారిపైనా జరిగిన ఈ వేధింపులు , కేవలం ఒక సామాజికవర్గంపైనా, ప్రత్యర్థి తెలుగుదేశంపైనా జరిగిన రాజకీయ కక్ష సాధింపుగానే సాధారణ ప్రజలు సైతం అర్ధం చేసుకున్నారు. రాజకీయాల్లో అధికారాన్ని వారసత్వంగా కోరుకోవడం సహజం. కానీ తెలుగు రాష్ట్రంలో కక్ష పూరిత రాజకీయాలు వారసత్వం కావడం దురదృష్టకరం.

By
en-us Political News

  
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.