సగానికి పైన జబ్బులన్నీ దీనివల్లే!

Publish Date:Aug 5, 2023

Advertisement

శరీరం సరైన రీతిలో పనిచేయడానికి ప్రతిరోజూ వివిధ రకాల విటమిన్లు  సూక్ష్మపోషకాలు అవసరమవుతాయి. ఇవన్నీ  ఆహారం నుండి సులభంగా పొందవచ్చు, అందుకే ఆరోగ్య నిపుణులు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన,  పోషకమైన ఆహారాన్ని  క్రమం తప్పకుండా తినాలని చెబుతారు. అయితే అదే ఆహారం విషయంలో చేసే పొరపాట్ల కారణంగా   శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇది శరీరంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.  మెగ్నీషియం కూడా  అలాంటి  మూలకమే..  శారీరక,  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరం.

మెగ్నీషియం లోపం అనేక వ్యాధుల సమస్యల ప్రమాదాన్ని  పెంచుతుంది . మెగ్నీషియం  మెదడు,  శరీరం  రెండిటికీ ముఖ్యమైనది. ఇది గుండె, రక్తంలో చక్కెర స్థాయిలు,  మానసిక స్థితి సహా అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది ఆకు కూరల నుండి గింజలు, బీన్స్ వరకు ఎన్నో ఆహారాలలో కనిపిస్తుంది. అసలు మెగ్నీషియం లోపం ఎందుకు ఎలా వస్తుంది?? ఆహారంలో మెగ్నీషియం మొత్తాన్ని పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు అందరికీ ఎందుకు సలహా ఇస్తారో.. దాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకుంటే.. 

శరీరంలో మెగ్నీషియం లోపం..

పెద్దలు వారి శరీరంలో 25 గ్రాముల మెగ్నీషియం కలిగి ఉంటారు, వీటిలో అస్థిపంజర వ్యవస్థ 50-60% నిల్వ చేస్తుంది. మిగిలినవి శరీరంలోని కండరాలు, కణజాలాలు,  ద్రవాలకు ఉపయోగం. మెగ్నీషియం లోపం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ పరిస్థితి బోలు ఎముకల వ్యాధి, మానసిక ఆరోగ్య సమస్యలు, జీర్ణ సమస్యలు, నరాల సంబంధిత రుగ్మతలతో పాటు రక్తంలో చక్కెర పెరుగుదలకు కూడా కారణమవుతుంది.

 మెగ్నీషియం ఎందుకు అవసరం??

విటమిన్-డి, కాల్షియంతో పాటు ఎముకలకు మెగ్నీషియం  కూడా అవసరం. ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించడానికి మెగ్నీషియం అవసరమవుతుంది. మెగ్నీషియం కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రతను పెరుగుతుంది,  రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-డి స్థాయిలను నియంత్రించడంలో  కూడా సహాయపడుతుంది. కాబట్టి మెగ్నీషియం శరీరానికి చాలా వసరం.

మధుమేహాన్ని నియంత్రిస్తుంది.. 

 టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు చాలా ఉపయోగపడతాయి.. మెగ్నీషియం గ్లూకోజ్ నియంత్రణ, ఇన్సులిన్ జీవక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  మెగ్నీషియం లోపం ఇన్సులిన్ నిరోధకతతో ముడిపడి ఉంటుంది. అయితే మెగ్నీషియం ను సప్లిమెంట్స్ కంటే ఆహరంతో తీసుకోవడం ఎంతో మంచిది. 

మెగ్నీషియం కోసం ఏమి తినాలి?

మగవారికి ప్రతిరోజూ 400-420 గ్రాముల మెగ్నీషియం  అవసరం అయితే ఆడవారికి 340-360 గ్రాములు అవసరం.  గింజలు, ముదురు ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటి అనేక ఆహారాలలో మెగ్నీషియం అధిక స్థాయిలో ఉంటుంది. అవకాడో, బంగాళదుంప, అరటిపండు మొదలైన వాటి నుంచి కూడా శరీరానికి అవసరమైన మెగ్నీషియం లభిస్తుంది. వీటిని తీసుకుంటే మెగ్నీషియం లోపాన్ని నివారించవచ్చు.

                                           *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.