ఈ లక్షణాలు వుంటే గుండె పరీక్ష చేయించుకోవాలి.. లేకపోతే ప్రాణాలకు ముప్పే

Publish Date:Aug 2, 2023

Advertisement

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో గుండె జబ్బు ఒకటి. గణాంకాల ప్రకారం కరోనరీ హార్ట్ డిసీజ్ (CAD) అనేది గుండె జబ్బులలో అత్యంత సాధారణ సమస్య. ఇది 2021లో 3.75 లక్షలకు పైగా మరణాలకు కారణమైంది. 20, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి  20మందిలో ఒకరు ఈ సమస్యకు గురయ్యే ప్రమాదం గణనీయంగా ఉంది.  దురదృష్టవశాత్తు యువత కూడా దీని బారిన పడుతున్నారు. ఈ సమస్య ఎదురైన మొదట్లో చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లాలంటే భయపడతున్నారు, సమస్య ఏమీ లేదులే అనే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ కారణంగా  సకాలంలో రోగనిర్ధారణ  జరగడం లేదు. అదే సకాలంలో సమస్య నిర్థారణ జరిగితే  తీవ్రమైన గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించి, రోగి ప్రాణాలను కాపాడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇదివరకే  గుండె జబ్బులు లేకపోయినా, ప్రతి ఒక్కరూ తమ గుండెను సంవత్సరానికి రెండుసార్లు పరీక్ష చేయించుకోవడం నేటికాలపు పరిస్థితులలో మంచిదని వైద్యులు చెబుతున్నారు.

యువతలో గుండె జబ్బుల సమస్య..

యువతలో గుండె జబ్బుల కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నప్పటికీ, ఇందులో ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్,  అధిక రక్తపోటు ప్రధానమైనవి. అమెరికన్లలో గుండె జబ్బుల బారిన పడుతున్నవారిలో అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్,  ధూమపానం మొదలయిన వాటిలో కనీసం ఒకదానిని అయినా అలవాటుగా  కలిగి ఉన్నారు. గుండెలో సమస్య ఉండవచ్చని సూచించే కొన్ని పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితులు ఎదురైన మరుక్షణమే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.

తరచుగా ఊపిరి ఆడకపోవడం..

 తరచుగా శ్వాస ఆడకపోవడాన్ని ఎదుర్కుంటున్నట్టైతే  అది గుండె సమస్యకు సంకేతంగా చెప్పవచ్చు. ఈ సమస్యను వైద్యపరంగా డిస్ప్నియా అంటారు. ఈ  పరిస్థితి తీవ్రమైన సమస్యగా  పరిగణించబడుతుంది, ఈ సమస్య ఎదురైనప్పుడు  ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.  గుండె సంబంధిత, శ్వాసకోశ సమస్యలు తరచుగా ఇంటి పనులు చేయడం,  మెట్లు ఎక్కడం వంటి పరిస్థితుల వల్ల  తీవ్రమవుతాయి.

ఛాతీ నొప్పి..

ఛాతీ నొప్పి కూడా  గుండెలో సమస్య ఉండవచ్చని చెప్పడానికి  ప్రధాన సంకేతంగా పరిగణింపబడుతుంది. పదేపదే  వచ్చే ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు.  ఈ నొప్పిని పెయిన్ కిల్లర్లు ఇతర  మందులతో అణిచివేసేందుకు ప్రయత్నించకూడదు. కొలెస్ట్రాల్ లేదా రక్తపోటు తరచుగా పెరిగిన వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి రోగులే తరచుగా శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇటువంటి లక్షణాలను తేలికగా తీసుకోవడంలో పొరపాటు చేయకూడదు.

ఒకే తరహా జీవనశైలి..

ఒకే తరహా  జీవనశైలి లేదా  రోజులో ఎక్కువ సమయం కూర్చుని ఉండాల్సి వస్తుంటే  అలాంటి సమయాల్లో  జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండెకు హాని కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది. రక్తపర్సరణ వ్యవస్థ మందగిస్తుంది.ఇలాంటి వారు  గుండెను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. ఈ ప్రమాదం  దుష్ప్రభావాలు దరిచేరకుండా ఉండేందుకు  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.

                                                                   *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.