తెరాసకు ఇప్పుడు రోజులు కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. ఏ ముహూర్తంలో తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారో.. ఆ క్షణం నుంచీ గులాబి పార్టీకి వరుస ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ తో యుద్ధం ప్రకటించిన కేసీఆర్ కు స్వరాష్ట్రంలో అసమ్మతి, అసంతృప్తి నేతల తాకిడి సెగ తగులుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో అడుగు కలిపి నడిచిన ఒక్కరొక్కరుగా ఆయనకు దూరం జరుగుతున్నారు. అదే సమయంలో వరుసగా రెండు ఉప ఎన్నికలలో విజయం తరువాత రాష్ట్రంలో కాషాయదళం గళం పెంచింది. గతంలో ఏ ఆపరేషన్ ఆకర్ష్ తో అయితే ప్రత్యర్థి పార్టీల బలాన్ని కేసీఆర్ హరించారో ఇప్పుడు అదే ఆపరేషన్ ఆకర్ష్ ఫార్ములాతో బీజేపీ తెరాస గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న తెరాస ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటు.. దానిని అధిగమించేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతోంది.
అదే సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ పై యుద్ధం ప్రకటించింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి సాధించిన తెలంగాణను ఒర్వలేని తనంతో మోడీ సర్కార్ ఇబ్బందులు పెడుతోందని విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రాల అప్పులను వేలెత్తి చూపేముందు గతంలో ఏ కేంద్ర ప్రభుత్వమూ చేయని విధంగా అప్పులు చేసిన కేంద్రం సంగతి ముందు తేల్చాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. నీతి ఆయోగ్ ను వ్యర్థ వ్యవస్థగా అభివర్ణిస్తూ నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ హయాంలోనే దేశం అభివృద్ధి చెందిందని పేర్కొంటూ ఏకంగా మోడీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.
మైండ్ గేమ్ లో ఇప్పటి దాకా నిష్ణాతుడిగా పేరొందిన కేసీఆర్ నే బెంబేలెత్తించే స్థాయిలో బీజేపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. తెరాసలో త్వరలో అసమ్మతి బాంబ్ పేలబోతోందంటూ బీజేపీ మధ్య ప్రదేశ్ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న మురళీధరరావు చేసిన వ్యాఖ్య ఇప్పుడు గులాబి పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకు ముందు తెలంగాణలో మరో 12 స్థానాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగానే మురళీ ధరరావు వ్యాఖ్యలను అర్ధం చేసుకోవాలని పరిశీలకులు సైతం అంటున్నారు. ఇరత పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులను ఆకర్షించిన ఫలితంగానే ఇప్పుడు తెరాసలో అసంతృప్తుల బెడద లేని నియోజకవర్గం లేదంటే అతిశయోక్తి కాదనే పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రభుత్వ పరంగా కేసీఆర్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే జాతీయ రాజకీయాలంటూ కొత్త డ్రామాకు తెరతీసి.. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించకుండా జాతీయ స్థాయిలో సమస్యలపై మోడీ టార్గెట్ గా గళమెత్తుతున్నారని తెరాస వర్గాలే అంటున్నాయి. దీనికి తోడు దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ అసంతృప్తి పీక్ కు చేరి ఉండటంతో కార్యకర్తలు కూడా అందుకు తగ్గట్టుగానే ఏదో ఒక గ్రూపులో చేరిపోయారు.
దీంతో నియోజకవర్గాలలో పార్టీ వర్గాలు, గ్రూపులుగా చీలిపోయి ఉన్న పరిస్థవితి ఉంది. ముందు ఇంటిని ( పార్టీ) చక్కదిద్దుకోకుండా కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ నేల విడిచి చేస్తున్న సాము కారణంగా రాష్ట్రంలో పార్టీ పునాదులే కదిలిపోయేలా వ్యతిరేకత అనే భూకంపం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని పరిశీలకు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dissident-bomb-ready-to-blast-in-trs-39-141564.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.