తెలంగాణలో రాజకీయ పార్టీల వ్యూహాలకు, ఎన్నికల ప్రణాళికలకు ఆయా పార్టీలోని అసంతృప్తి వాదులు, అసమ్మతి వాదులే పెద్ద అవరోధంగా తయారయ్యారు.
రానున్న ఎన్నికలలో అన్ని పార్టీలూ రెబల్స్ బెదడను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధమైపోతున్న పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికార తెరాస, రాష్ట్రంలో బలోపేతమై తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగామని చెప్పుకుంటున్న బీజేపీ, రాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకోవడానికి శతధా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఇలా మూడు పార్టీలలోనూ అసమ్మతి సెగలు రగులుతున్నాయి.
రాష్ట్రంలో మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్న టీఆర్ఎస్ లో అసమ్మతి రాగాలు ఒకింత ఎక్కవగానే ఉన్నాయని చెప్పాలి. 2018 ఎన్నికల అనంతరం ఇరత పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు తలుపులు బార్లా తెరిచి తెరాస గూటిలో చేర్చుకోవడమే ఇప్పుడు ఆ పార్టీకి అసమ్మతి బెడద ఎక్కువగా ఉండటానికి కారణం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. మొదటి నుంచీ పార్టీలో ఉండి గత ఎన్నికలలో పరాజయం అయిన వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలా తెరాసలో అసమ్మతి బెడద ఉన్న నియోజకవర్గాలు పదిహేనుకు పైగానే ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో రానున్న ఎన్నికలలో తలనొప్పులు తప్పవని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
ఇక రాష్ట్రంలో తెరాసకు దీటుగా బలోపేతం అయ్యామని చెప్పుకుంటున్న బీజేపీకి కూడా అసమ్మతి తలపోటులు తప్పడం లేదు. అభ్యర్థుల ఎంపిక సమయానికి ఈ బెడద మరింత ఎక్కువ అయ్యేలా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత నియోజకవర్గంలో అసమ్మతి బెడద ఎదుర్కొంటున్నారు. అలాగే బండి సంజయ్ తీరుతో ఆయన త్రిబుల్ ఆర్ గా అభివర్ణించిన ఈటల రాజేందర్, రఘునందనరావు, రాజాసింగ్ లే అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల నుంచే సమాచారం అందుతోంది.
ఇక రాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ లో అసమ్మతి మరింత అధికంగా ఉంది. స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అయినా కాంగ్రెస్ లో అసమ్మతి, అసంతృప్తి, తిరుగుబాట్ల బెడద లేకపోతే ఆశ్చర్యపోవాలి కానీ ఉన్నందుకు కాదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/disidents-in-all-parties-25-135329.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.