టెక్స్ టైల్ పార్క్ మూత.. కేంద్రం, రాష్ట్రాలదే బాధ్యత!

Publish Date:May 2, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో  నేతన్నలకు మహర్దశ అంటూ ఊదరగొట్టిన టీఆర్ఎస్ సర్కార్.. అదే సిరిసిల్లలోని టెక్స్ టైల్ పార్క్ మూతపడి 2వేల  మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడితే కేంద్రం పన్నే కారణమంటూ సణుగుతోంది తప్ప.. వాస్తవంలోనికి వచ్చి టెక్స్ పార్క్ యాజమాన్యాల సమస్యల పరిష్కారంపై నోరు మెదపడం లేదు.

ప్రపంచ కార్మికుల దినోత్సవం అయిన మేడే నాడే నేత కార్మికుల ఉపాధికి గండి పడింది. సరిగ్గా మే 1వ తారీకునే..అంటే ఆదివారం నాడే సిరిసిట్ల జిల్లా బద్దెనపల్లిలోని టెక్స్ టైల్ పార్కుకు యాజమాన్యాలు తాళం వేశాయి. పరిశ్రమను నడపడం మా వల్ల కాదంటూ చేతులెత్తేశాయి. దీంతో ఆ పార్క్ లో పని చేసే దాదాపు రెండు వేల మంది నేత కార్మికుల బతుకులు అగమ్యగోచరంగా మారిపోయాయి. 
 టెక్స్ టైల్ పార్క్ మూతకు విద్యుత్ రీయింబర్స్ మెంట్ బకాయిలు సకాలంలో రాకపోవడమే ప్రధాన కారణంగా యాజమాన్యాలు చెబుతున్నాయి.

ఏడు కోట్లు వెచ్చించి 75 ఎకరాల్లోఎకరాల్లో  2004లో  టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేశారు.   టెక్స్‌టైల్‌పార్క్‌లో పరిశ్రమలను నెలకొల్పితే సబ్సిడీలు, విద్యుత్తు రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వం  హామీ ఇవ్వడంతో పలువురు పారిశ్రామికులు ముందుకొచ్చి టెక్స్‌టైల్‌పార్క్‌లో పరిశ్రమలు స్థాపించారు.  165 ఇండస్ట్రీయల్ యూనిట్లు, 27 కమర్షియల్‌ యూనిట్లు  ఏర్పాటయ్యాయి. వీటిలో 115 యూనిట్లలో 1,475 ఆధునిక రాపియర్‌ మరమగ్గాలను ఏర్పాటు చేశారు.

అయితే వాగ్దానం చేసినట్లుగా ప్రభుత్వం నుంచి ఆర్డర్లు రాకపోవడం, అలాగే ప్రైవేటు ఆర్డర్లూ లేకపోవడంతో యాజమాన్యాలకు పరిశ్రమల నిర్వహణ భారంగా మారింది. కరోనా విజృంభించిన సమయంలో మార్కెట్లు పూర్తిగా స్తంభించిపోవడం, దానికి తోడు నూలు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పరిశ్రమలు నష్టాల బాట పట్టాయి. అలాగే పరిశ్రమను ఏదో మేరకు ఆదుకుంటూ వస్తున్న బతుకమ్మ ఆర్డర్లు కూడా ఈ ఏడు భారీగా తగ్గిపోవడం పరిశ్రమల నిర్వహణను కష్టసాధ్యంగా మార్చింది.

అన్నిటికీ మించి ప్రభుత్వ హామీ మేరకు మౌలిక సదుపాయాలు, విద్యుత్ రాయితీలూ కూడా అందకపోవడం పార్క్ లో పరిశ్రమల మనుగడను భారంగా మార్చేశాయి.  2015 నుంచి పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను విడుదల చేస్తామన్న మంత్రి కేటీఆర్ హామీ కూడా నెరవేరలేదు.  ఈ పరిస్థితుల్లో పరిశ్రమల నిర్వహణ తమ వల్ల కాదంటూ, ప్రభుత్వ హామీలను నెరవేర్చి విద్యుత్ రీయింబర్స్ మంట్ బకాయిలు చెల్లించడమే కాకుండా.. ప్రభుత్వ హామీ మేరకు ఆర్డర్లు కూడా వచ్చేలా చేయాలని పరిశ్రమల యాజమాన్యాలు కోరుతున్నాయి. 

వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా చేనేతలను ఆదుకునే విషయంలో మేం చాంపియన్లం అంటే మేం చాంపియన్లమన తెలంగాణలో ఉన్న తెరాస, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ విమర్శలలో మునిగి తేలుతున్నాయి. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం కేటాయించని స్థాయిలో తమ సర్కార్ చేనేతకు బడ్జెట్ కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు సత్యనారాయణ, అది ఆయన అజ్ణాజానికి పరాకాష్ట, అసలు చేనేతపై పన్ను వేసిన తొలి సర్కార్ మోడీదే అంటూ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పరస్పర విమర్శల పర్వానికి తెర లేపారు. వాస్తవానికి నేతల సంక్షేమంపై, చేనేత పరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వాల చిత్తశుద్ధి లేమికి సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ మూతపడటం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

By
en-us Political News

  
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.