తెలంగాణలో రాజకీయ పార్టీల వ్యూహాలకు, ఎన్నికల ప్రణాళికలకు ఆయా పార్టీలోని అసంతృప్తి వాదులు, అసమ్మతి వాదులే పెద్ద అవరోధంగా తయారయ్యారు.
రానున్న ఎన్నికలలో అన్ని పార్టీలూ రెబల్స్ బెదడను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధమైపోతున్న పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికార తెరాస, రాష్ట్రంలో బలోపేతమై తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగామని చెప్పుకుంటున్న బీజేపీ, రాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకోవడానికి శతధా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఇలా మూడు పార్టీలలోనూ అసమ్మతి సెగలు రగులుతున్నాయి.
రాష్ట్రంలో మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్న టీఆర్ఎస్ లో అసమ్మతి రాగాలు ఒకింత ఎక్కవగానే ఉన్నాయని చెప్పాలి. 2018 ఎన్నికల అనంతరం ఇరత పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు తలుపులు బార్లా తెరిచి తెరాస గూటిలో చేర్చుకోవడమే ఇప్పుడు ఆ పార్టీకి అసమ్మతి బెడద ఎక్కువగా ఉండటానికి కారణం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. మొదటి నుంచీ పార్టీలో ఉండి గత ఎన్నికలలో పరాజయం అయిన వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలా తెరాసలో అసమ్మతి బెడద ఉన్న నియోజకవర్గాలు పదిహేనుకు పైగానే ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో రానున్న ఎన్నికలలో తలనొప్పులు తప్పవని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
ఇక రాష్ట్రంలో తెరాసకు దీటుగా బలోపేతం అయ్యామని చెప్పుకుంటున్న బీజేపీకి కూడా అసమ్మతి తలపోటులు తప్పడం లేదు. అభ్యర్థుల ఎంపిక సమయానికి ఈ బెడద మరింత ఎక్కువ అయ్యేలా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత నియోజకవర్గంలో అసమ్మతి బెడద ఎదుర్కొంటున్నారు. అలాగే బండి సంజయ్ తీరుతో ఆయన త్రిబుల్ ఆర్ గా అభివర్ణించిన ఈటల రాజేందర్, రఘునందనరావు, రాజాసింగ్ లే అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల నుంచే సమాచారం అందుతోంది.
ఇక రాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ లో అసమ్మతి మరింత అధికంగా ఉంది. స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అయినా కాంగ్రెస్ లో అసమ్మతి, అసంతృప్తి, తిరుగుబాట్ల బెడద లేకపోతే ఆశ్చర్యపోవాలి కానీ ఉన్నందుకు కాదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/disidents-in-all-parties-39-135328.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.