నేరాల్లో టీఆర్ఎస్ నేతలు- పార్టీపై వ్యతిరేకతకు బాటలు

Publish Date:Apr 24, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు నేరాలలో ప్రమేయం ఉన్న సంఘటనలు వెలుగులోనికి రావడంతో రాష్ట్రంలో ఆ పార్టీపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.
అసలు టీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఎలాంటి నేరాల్లో బయటపడిందో ఒక సారి చూస్తే...అధికారం అండతో వారెంతగా బరితెగించారో అర్ధమౌతుంది. ఉదాహరణకు...ఓ నాలుగు సంఘటనలను ప్రస్తావిస్తే...
 నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్‌ 8వ తరగతి చదివే ఓ 15 ఏళ్ల  మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పరారీలో ఉన్న అతడి కోసం నిర్మల్ పోలీసులు గాలిస్తున్నారు. ఇటు తెరాస పార్టీ నుంచి సాజిద్ ఖాన్ ను బహిష్కరించినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలస్యంగా వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల్వంచ‌ కుటుంబం సామూహిక ఆత్మహత్య సంఘటనలో సాక్షాత్తూ ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సంఘటనలో  మొండిగ రామకృష్ణ, అతని భార్య శ్రీలక్ష్మి, కూతురు సాహిత్య ప్రాణాలు కోల్పోయారు. మరో కూతురు సాహితి 60 శాతం గాయాలతో కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అప్పులపాలైన రామకృష్ణ  ఆత్మహత్య వెనుక ఎమ్మెల్యే కుమారుడున్నారనే ఆరోపణలున్నాయి.

మరో ఘటనలో రామయంపేట్ మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పృథివిరాజ్,తోట కిరణ్, కన్నాపురం కృష్ణగౌడ్, స్వరాజ్ లతోపాటు గతంలో రామయంపేట్ సిఐ గా పనిచేసిన నాగర్జున గౌడ్ లు గత ఏడాదిన్నరగా తమను వేధిస్తున్నారని పేర్కొంటూ  లైవ్లో సెల్ఫీ వీడియో తీసుకుని  పెట్రోల్ పోసుకుని తల్లీ కుమారుడు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

 మరో ఘటనలో పోలీసులు తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ  బీజేపీ మజ్దూర్ సంఘ్  ఖమ్మం అధ్యక్షుడు సాయి గణేశ్ పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప  మంత్రి పువ్వాడ అజయ్, స్థానిక టీఆర్ఎస్ నేతలు, సీఐ వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని సాయి గణేశ్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. ఇవే కాకుండా ఇంకా పలు సందర్భాలలో  ఆర్థిక, లైంగిక వేధింపులు, కబ్బాల వివాదాల్లో టీఆర్ఎస్ నాయకుల ప్రమేయంపై ఆరోపణలు ఉన్నాయి. 
రాష్ట్రంలో    టిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర వివాదాల్లోకి తలదూర్చుతున్నారనడానికి  ఇవి కొన్ని ఉదాహరణలు.  ఇటువంటి నాయకుల కారణంగా రాష్ట్రంలో  టిఆర్ఎస్ పై, ఆ నాయకులపై   తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. అసహనం వ్యక్తమవుతోంది.  ఇటువంటి వారి వల్ల ప్రజలలో పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. అధికారంలో ఉన్న పార్టీ అండదండలు మెండుగా ఉండటంతోనే నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ వైపు టిఆర్ఎస్ పాలనపై రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తితో ఉండగా, కొందరు పార్టీ నాయకుల తీరు పార్టీకి మరింత చెడ్డపేరు తెచ్చిపెడుతోంది.  
గత జనవరి   ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకూ అంటే నాలుగు నెలల వ్యవధిలో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చిన నాలుగు తీవ్ర నేర సంఘటనలు జరిగాయి. 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడేంతగా వేధింపులకు గురి చేయడం,  తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకోవడం, ప్రత్యర్థి పార్టీకి చెందిన యువ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడేలా వేధించడం. ఈ నాలుగు ఘటనల్లోనూ  టిఆర్ఎస్ నాయకులకుప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం, ప్రమేయం ఉండటతో ఆ ప్రభావం మొత్తం రాష్ట్రంలో పార్టీపై ప్రతికూలంగా పడిందనడంలో సందేహం లేదు.    ఇప్పటికీ కోర్టు నోటీసులు పంపినా మంత్రి పువ్వాడపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇక మరి కొన్ని సంఘటనల్లో సంబంధితులను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్న కేసులలో పోలీసుల దర్యాప్తు నమమాత్రంగా సాగుతోందనీ, నిందితులను పట్టుకోవడంలో వారు ఏ మాత్రం చొరవ చూపడం లేదన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

By
en-us Political News

  
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.