రవ్వంత నిప్పు రాజేశాడా? నిప్పురవ్వంతరెడ్డి

Publish Date:May 8, 2022

Advertisement

రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా హస్తినలోని హస్తం పార్టీ అధిష్ఠానం నియమించినప్పుడు.. తెలంగాణలో ఆ పార్టీలోని సీనియర్ నేతలు లేరా? అంటూ ప్రేమించుకుందా రా సినిమాలో హీరో వెంకటేష్‌ని.. అతని మేనకొడలు.. హైదరాబాద్‌లో ఆడపిల్లలు ఉండరా మామయ్య అంటూ చాలా అమాయకంగా ప్రశ్నించినట్లు సదరు పార్టీలోని సీనియర్ నేతలను కుటుంబ సభ్యులు కూడా ప్రశ్నించారట. దీంతో సదరు హస్తం పార్టీలోని నేతలకు మాత్రం కోపం కట్టలు తెంచుకొందట.   

రేవంత్ రెడ్డి.. సైకిల్ పార్టీ దిగి.. హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించడంతో కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది నేతల్లో బాగా  కాక రేగిందట. రేవంత్ చేరడం పార్టీలోని సీనియర్లకు అంతగా రుచించలేదట. ఆ తర్వాత పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. వారందరిని కాదని.. రేవంత్ రెడ్డికే టీపీసీసీ పగ్గాలు పార్టీ అధిష్టానం అప్పగించడంతో.. సదరు పార్టీలోని  సీనియర్లంతా లోలోన కుతకుతలాడిపోయారట.

అయితే రేవంత్ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పార్టీని కాంగ్రేసుగుర్రంలా దౌడు తీయిస్తున్నారు. దీంతో పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరిలో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంతేకాదు రేవంత్ రెడ్డి వాగ్డాటికి, ఆయన రాజకీయ చతురతకి, పంచ్ డైలాగ్‌లకు తెలంగాణ సమాజం ఫిదా అయిపోయింది... అయిపోతోంది కూడా. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సభ ఎక్కడ  పెట్టిన.. ఎప్పుడు పెట్టినా.. ప్రజలు తండోప తండాలుగా ఇంకా చెప్పాలంటే తిరుణాలకు తరలి వస్తున్నట్లు వస్తున్నారు.  

అందుకు తాజాగా వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభే అందుకు సాక్ష్యం. ఈ  సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం హాజరుకావడంతో.. తెలంగాణలోని హస్తం పార్టీలో లీడర్ నుంచి కేడర్ వరకు అందరిలో ఊపు ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి పోటీ చేసి.. ఉత్తర తెలంగాణలో హస్తం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చే లక్ష్యంతో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వాటిలో 8 స్థానాల్లో హస్తం పార్టీ తన సత్తా చూపుతోందని ఆ పార్టీ నేతలే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘర్షణ సభ విజయవంతం కావడమే అందుకు సాక్ష్యమని ఆ పార్టీలో ఓ చర్చ అయితే నడుస్తోంది.

రేవంత్ రెడ్డి పంచ్ డైలాగులతో పోటీ పడే మోనగాడు కారు పార్టీలో ఒక్కరు కూడా లేరని తెలంగాణ సమాజంలో ఓ చర్చ అయితే యమ జోరుగా సాగుతోంది. ఇంకో వైపు తెలంగాణలో టీఆర్ఎస్‌కు పోటీగా బీజేపీ ఎంత స్పీడ్ పెంచినా.. అదీ రేవంత్ రెడ్డి దూకుడు ముందు దిగదూడుపే అనే ఓ టాక్ అయితే టీఆర్ఎస్ భవన్‌లో అండర్ కరెంట్‌గా సాగుతోందని సమాచారం.

దుబ్బాక ఉప ఎన్నికల్లో అయితేనేమీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అయితేనేమీ.. ఆ తర్వాత జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అయితేనేమీ ఎక్కడ కమలం పార్టీ విజయం సాధించినా.. ఈ ఉద్యమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ లైట్‌గా తీసుకుంటారని... అదే తెలంగాణలో ఎక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభ పెట్టినా.. సదరు సభకి సంబంధించిన అన్ని అంశాలపై అంటే.. సదరు సభలో రేవంత్ రెడ్డి డైలాగ్స్‌.. ఆ సభ సాక్షిగా ఆయన వాడిన భాష.... సభలో కేసీఆర్ అండ్ కోపై చేసిన ఆరోపణలు.. అలాగే కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ సంధించిన విమర్శనాస్త్రాలతోపాటు.. ఆ సభకు ఎంత మంది జనం తరలివచ్చారనే అంశాలపై ఈ గులాబీ బాస్.. ఇంటిలిజెన్స్ నుంచి ఓ నివేదికను సైతం తెప్పించుకుంటారనే గుసగుసలు సైతం ప్రగతి భవన్‌ సాక్షిగా నడుస్తోంది.    

ఈ నేపధ్యంలో రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా.. ఎంతగా ఆయన్ని అణగదొక్కాలని ప్రయత్నించినా.. అంతగా రేవంత్ రెడ్డిపైకి లెస్తున్నారని.. ఒక రకంగా చెప్పాలంటే.. గోడకి కొట్టిన బంతిలాగా రేవంత్   వ్యవహరిస్తున్నాడని హస్తం పార్టీలోని ఆయన వర్గం స్పష్టం చేస్తోంది. అంతేకాదు కేసీఆర్ అండ్ కోకి రేవంత్ రెడ్డి పెద్ద తలనొప్పిగా మారారని.. సీఎం క్యాంప్ కార్యాలయంలో సైతం ఓ చర్చ అయితే చాలా హాట్ హాట్‌గా నడుస్తోందట.

అంతేకాదు.. కాంగ్రెస్, బీజేపీలకు ప్రశాంత్ కిషోర్‌లు అవసరం ఉందేమో కానీ.. తమకు, తమ పార్టీకి అలాంటి వాళ్ల అవసరం లేదని.. తమ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు.. వారి ఆశీస్సులే తమకు శ్రీరామ రక్ష అని.. అవే తమను, తమ పార్టీని ఎన్నికల్లో విజయ తీరాలకు తీసుకు వెళ్తుందని.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు గతంలో పలు సభల్లో క్లియర్ కట్‌గా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  

అయితే కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమ వీరుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు రేవంత్ రెడ్డి దూకుడే కారణమనే ఓ చర్చ అయితే తెలంగాణ సమాజంలో హాట్ హాట్‌గా నడుస్తోంది.

By
en-us Political News

  
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
ఇక 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లుర‌కాల ఉచితాల వ‌ల ప‌న్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.
ఇక టికెట్ ధరల పెంపు అనేది కేవలం పవన్ కల్యాణ్ కోసం తీసుకున్న నిర్ణయం కాదని, నిర్మాతల నుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ పిటిషన్ వెనుక కేవలం రాజకీయ దురుద్దేశాలు తప్ప, ప్రజా ప్రయోజనం లేదన్నారు.
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.