దేవినేని మరణం : బెజవాడ రక్త చరిత్రకి THE END!

Publish Date:Apr 17, 2017

Advertisement


దేవినేని రాజశేఖర్… ఉరఫ్ దేవినేని నెహ్రు…. గుండెపోటుతో మరణించారు. ఇది ఏపీ రాజకీయాలకి, మరీ ముఖ్యంగా, రాజధాని విజయవాడకి తీరని లోటే. ఆయన ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్ కి అధికారికంగా సెలవు ప్రకటించకున్నా కొడుకు అవినాష్ ను రంగంలోకి దింపి రెస్ట్ తీసుకోవాలనే అనుకున్నారు. కాని, కాలేజీ రోజుల్నుంచే అనూహ్య మలుపులు తిరుగుతూ వచ్చిన ఆయన జీవితం చివరి దశలో కూడా అనూహ్యంగానే అంతమైంది!

 

దేవినేని కేవలం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక నేత, మంత్రిగా కూడా పని చేసిన నాయకుడు మాత్రమే కాదు. అంతే అయితే, ఆయన గురించి పెద్దగా చెప్పుకోటానికి ఏం వుండేది కాదు. దేవినేని సత్తా అంతా ఆయన రాజకీయం కన్నా విజయవాడ యుద్ధ భూమిలో నెట్టుకురావటంలోనే కనిపిస్తుంది మనకు! అసలు దేవినేని కుటుంబంలో నెహ్రులా సహజ మరణం పొందనే లేదు ఆయన అన్న, తమ్ముడూ …. ఇద్దరూ కూడా! దేవినేని నెహ్రు అన్నయ్య గాంధీని, మురళిని వంగవీటి వర్గం హత్య చేసింది. అలా సోదరులిద్దరూ అర్ధాంతరంగానే అసువులు బాసినా నెహ్రు దశాబ్దాల పాటూ పోరాటం చేస్తూ ప్రాణాలు కాపాడుకుంటూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు! అదే ఆయన అసలు విజయం…

 

కంకిపాడు నియోజకవర్గం నుంచి దేవినేని పదే పదే గెలవటం నిజంగా విశేషమేం కాదు. సహజమే. టీడీపీలో వున్నా, కాంగ్రెస్ లో వున్నా, ఇప్పుడు తిరిగి టీడీపీలోకి వచ్చినా జనం ఆయన వెంట ఎప్పుడూ వున్నారు. అందుక్కారణం ఎప్పుడో కాలేజీ రోజుల్లో మొదలైన వర్గ పోరాటాన్ని ఎక్కడ ఆపకుండా చివరిదాకా నిర్భయంగా, తెలివిగా నడపటమే. వంగవీటి మోహన రంగ లాంటి విపరీతమైన ఫాలోయింగ్ వున్న ప్రమాదకర ప్రత్యర్థి వున్నా దేవినేని నెహ్రు ఒకవైపు రౌడీయిజాన్ని, మరో వైపు రాజకీయాన్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. వంగవీటి వర్గం తన అన్నని, తమ్ముడ్ని చంపేసినా ఆయన ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. వంగవీటి మోహనరంగ హత్య కేసులో ఆయనకు సీబీఐ నుంచి క్లీన్ చిట్ వచ్చినా… జనం మాత్రం దేవినేని నెహ్రునే రంగ హత్యకి కారణమని నమ్ముతుంటారు!

 

రంగ హత్యకి నెహ్రు కారణం అయినా కాకున్నా విజయవాడ రక్త చరిత్రని రంగ హత్యతో ఆగిపోయేలా నెహ్రు చూశారు. తరువాతి కాలంలో వంగవీటి కుటుంబంపై దేవినేని కుటుంబం దాడులు చేయలేదు. వంగవీటి వర్గం కూడా రంగ హత్య తరువాత నెమ్మదించింది. ఇప్పుడు దేవినేని మరణంతో 1970లలో మొదలైన విజయవాడ వర్గ పోరాటం అధికారికంగా అంతమైనట్టే! వంగవీటి కుటుంబం నుంచి రాధాకృష్ణ, దేవినేని కుటుంబం నుంచి అవినాష్ రాజకీయాల్లో వున్నా … రాజధానిగా మారిపోయిన ప్రస్తుత విజయవాడలో తిరిగి గతం తాలూకూ పరిస్థితులు రావటం అసాధ్యమే! కాబట్టి దేవినేని మరణం… ఒక రక్త చరిత్రకి సహజ సమాప్తం!

By
en-us Political News

  
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.