సజ్జల పాపాల పుట్ట పగులుతోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన పాల్పడిన భూకబ్జాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా ఆయన అటవీ భూములను సైతం వదల లేదు. అటవీ భూములలో ఏకంగా గెస్ట్ హౌస్ లే నిర్మించుకుని జల్సాలు చేసిన వైనం విస్తుగొల్పుతోంది.
సజ్జల భూ బాగోతంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా సర్వం తానై వ్యవహరించిన సంగతి తెలిసిందే. షాడో సీఎంగా సజ్జలే ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడిపారన్న ఆరోపణలకు కూడా ఉన్నాయి.
వాస్తవానికి జగన్ ఐదేళ్ల పాలనా దోపిడీ, దౌర్జన్యాలు, అవినీతి, కబ్జాలకు హద్దన్నదే లేదన్నట్లుగా సాగింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు యధేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు. అందిన కాడికి భూముల కబ్జాయే లక్ష్యమన్నట్లుగా వారి తీరు సాగింది. ప్రభుత్వ భూములు, అటవీ భూములు, ప్రైవేట్ భూములను ఇష్టారీతిగా ఆక్రమించేసి.. కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా చెలరేగిపోయారు. జగన్ పాలన అంతా ప్రభుత్వ, ప్రైవేట్ భూములను దోచుకోవటమే అన్నట్లుగా సాగింది. జగన్ కేబినెట్ లో ఐదేళ్లు మంత్రిగా కొనసాగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడింది. అలాగే విశాఖపట్నంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భూదందా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల భూకబ్జాల పర్వం అడ్డూ అదుపూ లేకుండా సాగింది.
ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబం భూదందా వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు. ఆయన భూ కబ్జాల పర్వం ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటకు వస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సజ్జల ఏకంగా అటవీ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సజ్జల భూ కబ్జాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా సజ్జల రామకృ ష్ణా రెడ్డి భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. సజ్జల బ్రదర్స్ ఏకంగా 42 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ భూములలో పండ్లతోటలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అంతే కాక అటవీ భూముల్లో గెస్ట్ హౌస్లు, పనివారికోసం షెడ్లు కట్టించారు. అయితే, సజ్జల పేరు బయటకు రాకుండా ఆయన అండతో సోదరులు, కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించినట్లు సమాచారం. వారంతా సజ్జల బినామీలేనని ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో సజ్జల సోదరులు కడప శివారు ప్రాంతంలో చేసిన అక్రమాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/deputy-cm-pawan-kalyan-orders-inquiry-on-sajjala-land-25-190730.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.