ఏపీ బీజేపీ చీఫ్ సుజనా చౌదరి.. కేంద్ర పెద్ద‌ల మ‌ద్ద‌తు ఆయ‌న‌కేనా?

Publish Date:Jan 3, 2025

Advertisement

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  బీజేపీకి నూత‌న అధ్య‌క్షుడు రాబోతున్నారా?  పార్టీ అధిష్టానం ఆ మేర‌కు ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టిందా?  ప్ర‌స్తుతం అధ్య‌క్షురాలిగా ఉన్న పురందేశ్వ‌రికి కేంద్రంలో ప్రాధాన్య‌త క‌ల్పించి.. రాష్ట్రంలో కొత్త‌వారికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించేందుకు రంగం సిద్ధ‌మైందా? అంటే అవున‌నే స‌మాధానమే పార్టీ ముఖ్య‌నేత‌ల నుంచి వినిపిస్తోంది. అయితే, బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో నలుగురు ఉండగా వారిలో సుజనా చౌదరికే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా అంటున్నారు.  పార్టీ పెద్దలు కూడా బీజేపీ రాష్ట్ర పగ్గాలు సుజనా చౌదరికే అప్పగించాలన్న భావనతో ఉన్నట్లు చెబుతున్నారు.  సుజనా చౌదరికి పార్టీ రాష్ట్ర పగ్గాలు కట్టబెడితే ఏపీ సర్కార్ తో సమన్వయం చక్కగా ఉంటుందన్నది బీజేపీ అగ్రనాయత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

రాబోయే కాలంలోనూ రాష్ట్రంలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి ముందుకు సాగాల‌న్న ఆలోచ‌న‌లోనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో సుజ‌నా చౌద‌రి అయితేనే కూట‌మి ప్ర‌భుత్వంతో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తూ ఏపీలో బీజేపీ బ‌లోపేతానికి కృషి చేస్తార‌ని కేంద్ర పార్టీ పెద్ద‌లు భావిస్తున్నార‌ని చెబుతున్నారు. అయితే, సుజ‌నా చౌద‌రికి అధ్య‌క్ష బాధ్య‌త‌లుఇచ్చే విష‌యంపై రాష్ట్ర పార్టీలోని కొందరి నుంచి అభ్యంతరం వ్యక్తమౌతున్నట్లు తెలుస్తోంది.  ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన వారికే పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని బీజేపీలోని ఓ వ‌ర్గం నేత‌లు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.

ద‌క్షిణాది రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ అధిష్ఠానం అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. క‌ర్ణాట‌క‌లో బ‌ల‌మైన పార్టీగా ఉన్న బీజేపీ.. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైంది. మ‌రోవైపు తెలంగాణ రాష్ట్రంలో బ‌ల‌మైన పార్టీగా ఎదుగుతున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే ల‌క్ష్యంగా ఆ పార్టీ నేత‌లు ప‌ని చేస్తున్నారు. ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ‌ కూట‌మి ప్ర‌భుత్వంలో బీజేపీ భాగ‌స్వామిగా ఉంది. రాష్ట్ర మంత్రి వ‌ర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఒక‌రు మంత్రిగా ఉన్నారు. ఇటీవ‌ల నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ బీజేపీకి ప్రాధాన్య‌త ద‌క్కింది. ప‌లువురు బీజేపీ నేత‌లకు ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వులు ల‌భించాయి. ప్ర‌స్తుత బీజేపీ అధ్య‌క్షురాలు, ఎంపీ పురందేశ్వ‌రి ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌గా ఉంటూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే, ఆమెకు కేంద్ర ప్ర‌భుత్వంలో ప‌ద‌వి ఇచ్చేందుకు బీజేపీ కేంద్ర పెద్ద‌లు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఆమె స్థానంలో ఏపీలో బీజేపీకి నూత‌న అధ్య‌క్షుడిని నియ‌మించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఎవ‌రు చేప‌ట్టినా ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌గా ఉంటూనే పార్టీ  బ‌లోపేతంపై దృష్టిసారించాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వానికీ బీజేపీ అధ్య‌క్షుడికి మ‌ధ్య ఏమాత్రం గ్యాప్ వ‌చ్చినా ఎన్డీయే కూట‌మికే ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. గతంలో అంటే 2014 తరువాత ఏపీలో ఇదే పరిస్థితి ఏర్పడి తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయడానికి కారణమైంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ అధ్య‌క్షుడి ఎంపికకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల అభిప్రాయాలను కూడా బీజేపీ హైకమాండ్ పరిగణనలోనికి తీసుకునే అవకాశం ఉంది.  

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లకు కొద్ది నెల‌ల ముందు పురందేశ్వ‌రికి రాష్ట్ర పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన, టీడీపీ క‌లిసి పోటీచేయ‌డానికి ఆమె కీల‌క భూమిక పోషించారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిప్రాయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రంలోని పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లి జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మిలో బీజేపీ భాగ‌స్వామిగా మారడంలో పురందేశ్వ‌రి కీ రోల్ పోషించార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌రువాత ఓ సంద‌ర్భంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. పురందేశ్వ‌రి కాకుండా బీజేపీ ఏపీ అధ్య‌క్ష స్థానంలో మ‌రొక‌రు ఉంటే మూడు పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరేది కాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా ప‌వ‌న్‌, చంద్ర‌బాబుతో ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతూ నామినేటెడ్ ప‌దువుల్లో బీజేపీ నేత‌లకు ప్రాధాన్య‌త ద‌క్కేలా ఆమె కృషి చేశారు. ప్ర‌స్తుతం ఆమెను కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద‌వుల్లోకి లేదా కేంద్ర పార్టీ ప‌ద‌వుల్లోకి తీసుకోవాల‌ని పార్టీ పెద్ద‌లు భావిస్తున్నారు. దీంతో పురందేశ్వ‌రి త‌ర‌హాలో ప్ర‌భుత్వంతో మంచి సంబంధాలు కొన‌సాగిస్తూనే.. పార్టీని బ‌లోపేతం చేసే నేత‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో సుజ‌నా చౌద‌రి అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బీజేపీ ఏపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డంలో స‌మ‌ర్ధుడ‌న్న భావ‌న‌కు కేంద్ర పార్టీ పెద్ద‌లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీనికితోడు చంద్ర‌బాబు మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోనూ సుజ‌నా చౌద‌రికి మంచి సంబంధాలు ఉన్నాయి. 

విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రితోపాటు ఆధోని ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌, సీనియర్‌ నేత రఘురామ్‌ పేర్లు అధ్య‌క్షుడి రేసులో వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీలోని కొంద‌రు నేత‌లు మాత్రం.. ఆర్ఎస్ఎస్ మూలాలు క‌లిగిన‌ నేత‌కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కేంద్ర పార్టీ పెద్ద‌ల‌పై ఒత్తిడి తెస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో పార్థసారథికి ఆర్ఎస్ఎస్ తో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. మ‌రోవైపు ఆయ‌న రాయలసీమ ప్రాంతం వాసి. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని ఈసారి రాయ‌ల‌సీమ నేతకు అప్ప‌గించాల‌న్న డిమాండ్ కూడా ఉంది. మాధ‌వ్ పేరు కూడా అధ్య‌క్ష రేసులో బ‌లంగా వినిపిస్తుంది. అయితే, సుజ‌నా చౌద‌రివైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. చంద్ర‌బాబు, ప‌వ‌న్ తో ఆయ‌న‌కు మంచి సంబంధాలున్నాయి. మ‌రోవైపు సుజనా చౌద‌రికి కూట‌మి పార్టీల్లోని నేత‌ల‌తోపాటు వైసీపీ లోని నేత‌ల‌తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం వైసీపీ అధికారాన్ని కోల్పోవ‌డంతో ఆ పార్టీలోని ముఖ్య‌నేత‌లు కూట‌మి పార్టీల్లోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సుజ‌నా చౌద‌రి బీజేపీ అధ్య‌క్ష  స్థానంలో ఉంటే వైసీపీ నుంచి కూట‌మి పార్టీల్లోకి వ‌చ్చేవారిలో ఎక్కువ‌ మంది బీజేపీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశాలు ఉన్నాయి. త‌ద్వారా రాష్ట్రంలో  పార్టీ మ‌రింత బ‌లోపేతం అయ్యే అవ‌కాశం ఉంది. దీంతో కేంద్ర పార్టీ పెద్ద‌లు సుజ‌నా చౌద‌రికే ఏపీ బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు దాదాపు నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.  

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.