దేశంలో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తల చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నికలలో తమ గెలుపు వ్యూహాలను రచించి అమలు చేసే కన్సల్టెన్సీల కోసం గాలం వేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా గడువు ఉండగానే నేడో రేపో ఎన్నికల నోటిఫికేష్ వెలువడుతుందా అన్నట్లుగా పార్టీలు తమ తమ వ్యూహాలను రచించుకుంటున్నాయి. మొత్తం మీద దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ కూడా 2027లో సార్వత్రిక ఎన్నికలు తథ్యమన్న నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం అమలు దిశగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయూ ప్రభుత్వం అడుగుల వేగం పెంచిన నేపథ్యంలో 2027లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. జమిలి దిశగా కేంద్రం ఇప్పటికే కసరత్తు మొదలెట్టేసిందని రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగ నిపుణులు మాత్రం మూడేళ్లలో జమిలి వచ్చే అవకాశాలు మృగ్యమని చెబుతున్నారు. అయితే పార్టీలు మాత్రం రాజకీయ అవసరాలు, ప్రాధాన్యతల దృష్ట్యా ఇప్పటి నుంచే జమిలికి రెడీ అయిపోతున్నాయి.
జమిలి కసరత్తు నేపథ్యంలో కేంద్రం నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం చేస్తోంది. అదే జరిగితే దేశ వ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలలోనూ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం 175 స్థానాలు ఉండగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆ స్థానాల సంఖ్య 225 కు పెరుగుతుంది. వచ్చే ఎన్నికలలో కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తే దీని వల్ల ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అయినా ఏ పార్టీకి ఆ పార్టీ తన సొంత రాజకీయ వ్యూహాలను రూపొందిం చుకుంటుం దనడంలో సందేహం లేదు. ఇందులో భాగంగానే లోకేష్ ఇటీవలి హస్తిన పర్యటనలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ కావడాన్ని చూడాల్సి ఉంటుంది.
జగన్ రాజకీయంగా యాక్టివ్ కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు ఐప్యాక్ వ్యూహాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ ప్రశాంత్ కిశోర్ తో భేటీ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ వ్యూహాలను చిత్తు చేసేలా ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు కోరి ఉంటారని అంటున్నారు. ఇప్పటికే టీడీపీకి ప్రశాంత్ కిశోర్ శిష్యుడి ఆధ్వర్యంలోని షఓ టైం కన్సెల్టన్సీ సేవలందిస్తున్నది. ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా తెలంగాణ సహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఎన్నికల హడావుడి ఇప్పటి నుంచే ఆరంభమైపోయినట్లుగా ఉందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/demand-grown-for-politica-strtegists-39-192490.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జనరేటెడ్ వీడియో అన్నారు. ఇందులో తన పరువు తీసే కుట్ర దాగి ఉందన్న బీఆర్ నాయుడు.. తనతో పాటు టీటీడీ ప్రతిష్ట మంటగలిపే యత్నం ఉందని ఆరోపించారు. అందుకే తాను సైబర్ క్రైమ్ ని ఆశ్రయించానన్నారు.