పంద్రాగస్టు వేడుకల ముంగిట ఢిల్లీలో కలకలం రేపిన బాంబు బెదరింపు.!

Publish Date:Aug 14, 2026

Advertisement

దేశ రాజధాని పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమౌతున్న వేళ.. హస్తినలో కీలక ప్రాంతాలలో ఉగ్రదాడులకు బెదరింపులు రావడం కలకలం సృష్టించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఒక రోజు ముందు అంటే శుక్రవారం (ఆగస్టు 14)  ఢిల్లీలోని   కీలక ప్రాంతాలకు బాంబు బెదిరింపు  రావడం సంచలనం సృష్టించింది. ఢిల్లీ హైకోర్టుతో పాటు,  ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికిబాంబు బెదరింపు ఈ మెయిల్స్ వచ్చాయి.   వెంటనే ఢిల్లీ పోలీసులు, సీఐఎస్ఎఫ్ బలగాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు,   డాగ్ స్క్వాడ్‌లు  రంగంలోకి దిగాయి. హైకోర్టు ప్రాంగణంతో పాటు విమానాశ్రయ టెర్మినల్స్, రన్‌వేలు, పార్కింగ్ ఏరియాలు,  చుట్టుపక్కల   ప్రాంతాల్లో   క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా   పోలీసులతో భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.   ఎర్రకోట పరిసరాల్లో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల ముంగిన  ఈ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో  భద్రత, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.  ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ  నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు, ప్రయాణీకుల తనిఖీలు చేపట్టారు.  

Delhi bomb threat, Delhi High Court bomb threat, IGIA bomb threat, Independence Day security alert, Delhi Police alert, August 15 security

By
en-us Political News

  
వయోపరిమితి మరో 2 ఏళ్లు పెంపు..!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ముందుగానే..!
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న సాయంత్రం 6 గంట లకు రాజ్‌భవన్‌ (లోక్‌భవన్‌)లో తెలంగాణ గవర్నర్‌ ‘ఎట్ హోమ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
BCI తీరుపై తీవ్ర అభ్యంతరం..!
హైదరాబాద్ పోలీస్‌లకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలు..!
స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కమ్మటి నీటి బొట్టు కోసం నల్లమల అడవుల వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం ఆ ప్రాంత ప్రజలకు కొత్తేమీ కాదు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట పరిసరాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
కేసీఆర్ ఉచితంగా ఇస్తే.. ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షలా..!
గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో  ఇండియ్  ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు   పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా  దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో  4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
గతంలో   ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ..   నాల్సార్‌ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.  
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.