Publish Date:Dec 20, 2023
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. మరో నెల రోజుల్లో అంగరంగ వైభవంగా ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జరుగనున్నది. వచ్చే నెల జనవరి 22న నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆలయ ట్రస్టు సభ్యులు ఇప్పటికే ప్రముఖులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు.బీజేపీ కురువృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రావద్దని కోరామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తమ వినతిని ఇద్దరూ అంగీకరించారని చెప్పిన సంగతి విదితమే. ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఏదో ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అద్వానీ, జోషీలకు విశ్వహిందూ పరిషత్ ఆహ్వానం పలికింది. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ వీరిని స్వయంగా కలిసి ఆహ్వానం పలికారు. మరోవైపు, రామాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తామని ఇద్దరు నేతలు చెప్పినట్టు సమాచారం. అయితే తొమ్మిది పదుల వయస్సున్న మాజీ ప్రధాని దేవేగౌడకు ఆహ్వానం పంపిన ఆలయ ట్రస్టు.. అయోధ్య రామ మందిర ఉద్యమానికి ఊపిరి పోసిన లాల్కృష్ణ అద్వానీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషిలను మాత్రం కార్యక్రమానికి రావద్దని చెప్పింది. సోమవారం ఆలయ ట్రస్టు చేసిన అభ్యర్థనను అద్వానీ, జోషీ కూడా అంగీకరించారు. ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ మంగళవారం అద్వానీ, జోషీలకు ఆహ్వానాలు అందడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశ్వహిందూ పరిషత్ వారికి ఆహ్వానం అందజేసింది.ఆరోగ్యం, వృద్ధాప్యం దృష్ట్యా రామాలయం ప్రారంభోత్సవానికి రావద్దని సోమవారం అద్వానీ, జోషీలకు విజ్ఞప్తి చేసిన ఆలయ ట్రస్టు.. మంగళవారం అందుకు భిన్నంగా ఆహ్వానాలు పంపడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఎల్కే అద్వానీ, మురళీ జోషీలు కార్యక్రమానికి హాజరవుతారా..? లేదా..? అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్కుమార్ మాట్లాడుతూ.. కార్యక్రమానికి వచ్చేందుకు తాము శాయశక్తులా ప్రయత్నిస్తామని నేతలిద్దరూ చెప్పారని తెలిపారు.అద్వానీ, జోషీలకు ఆహ్వానాలు అందించిన వారిలో వీహెచ్పీ అధ్యక్షుడు అలోక్ కుమార్తో పాటు ఆర్ఎస్ఎస్ నేతలు కృష్ణగోపాల్, రాంలాల్ ఉన్నారు. అద్వానీ ఆహ్వానం అందుకున్న సమయలో ఆయన కుమార్తె ప్రతిభ కూడా అక్కడే కనిపించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/day-after-advani-asked-to-skip-ram-temple-event-25-167366.html
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.