మొన్నటి విశ్వవసు నామ సంవత్సర ఉగాది పంచాంగం చదువుతుండగా ఆ పండితుడు చెప్పిందేంటంటే జగన్ కి స్త్రీ మూలక సమస్యలు ఎక్కువగా వస్తాయని. ఆ సరికే ఆయన తన తల్లి చెల్లితో పీక లోతు పోరాటం చేస్తున్నారు. కేసులు గట్రా వ్యవహారాలు నడుస్తున్నాయ్. ఇదే అతి పెద్ద గండం అనుకుంటే ఆయన ఇంటా బయటా కూడా స్త్రీ మూలక సమస్యలను ఎదుర్కుంటున్నట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. మొన్నటికి మొన్న వల్లభనేని వంశీ కారణంగా భువనేశ్వరి మాతను అనరాని మాటలని.. ఆపై అది పార్టీకి అతి పెద్ద చేటు తెచ్చిన అంశంగా తయారైంది.
కట్ చేస్తే నేడు ప్రసన్నకుమార్ రెడ్డి అనే ఈ కోవూరు మాజీ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంతిరెడ్డిని కూడా సరిగ్గా ఇలాంటి మాటలే అని పార్టీకి మమూలు చెడ్డ పేరు తేలేదు. బేసిగ్గా జగన్ తన పథకాలన్నిటిలోనూ మహిళలే ప్రధానంగా ఉండాలని భావించే రకం. ఎందుకంటే మగాళ్ల మూడు, ఓటు ఏ క్షణం ఎలా టర్న్ అవుతుందో తెలీదు. అదే మహిళలు అలాక్కాదు. వారి ఓటు- రూటూ అంతా స్ట్రయిట్ గా ఉంటాయని ఆయన నమ్మకం. అందుకే తన ఇంటి నుంచి తల్లి, చెల్లి దూరమైనా సరే, రాష్ట్రంలో ఇంటింటా ఉన్న మహిళలనే తన తల్లి , చెల్లిగా భావించారాయన.
సరిగ్గా అదే సమయంలో కన్న తల్లి, తోడబుట్టిన చెల్లితో పాటు.. తనకు సోదరి వరస అయ్యే వైయస్ సునీత నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు జగన్. అంతే కాదు.. ఇటీవల మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడదల రజనీ సైతం జగన్ అంటే వ్యతిరేకత వ్యక్తబరుస్తున్నట్టు కనిపిస్తోంది. తనపై ఇన్ని కేసులు నమోదవుతుంటే పార్టీ నుంచి కనీస మద్ధతు లేదని రజనీ వాపోతున్నట్టు సమాచారం. దీంతో ఆమె జగనన్నను తెగ తిట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక మరో మాజీ మంత్రి రోజా లోలోన ఎన్ని రాజకీయపు ఎత్తుగడలు వేస్తున్నారో ఆ వెంకన్నకే ఎరుక అంటున్నారు. నగరి వైసీపీలోకి గాలి సోదరుడ్ని సాదరంగా ఆహ్వాస్తుండటంతో.. పైకి నవ్వుల మేకప్పు వేసుకున్నా.. లోలోన జగనన్నను తుక్కు తుక్కుగా తిట్టుకుంటున్నారట సదరు మహిళా నేత రోజా సెల్వమణి.
దీంతో జగన్ కి ఎటు చూసినా జడ గండం తప్పేలా లేదని అంటున్నారు. వైసీపీ లీడర్లలో దాదాపు సగానికి సగం మంది మహిళలంటే ఎంత మాత్రం గౌరవం లేని బాపతు. గంజాయి, మద్య సేవనంలో ఆరి తేరిన నిష్ణాతులు కావడం వల్ల.. వారికీ సెన్సిబిలిటీ తెలీక పోవడం వల్ల.. మహిళలపై అకారణంగా నోరు పారేసుకోవడంతో.. జగన్ పని ఇక్కడ తథిగిణతోం అయిపోతోందట.
మొన్న ఎన్నికల ముందు వంశీ చేసిన మహిళా వ్యతిరేక ప్రేలాపనలు ఎంత చేటు తెచ్చాయో.. తెలిసి కూడా ప్రసన్నకుమార్ రెడ్డి అనే ఈ నేత మరోమారు మహిళపై చేసిన కామెంట్లు ప్రస్తుతం జగన్ పార్టీని మరో పతనానికి కారణమయ్యేలా చేస్తున్నాయంటున్నారు. ఇప్పటికే ఒక మహిళను అన్న పాపానికి 11 కి పరిమితమైంది జగన్ పార్టీ. వచ్చే రోజుల్లో ఇదే ఫ్లో కంటిన్యూ అయితే ఆ పక్కనున్న ఒకటి కూడా మాయమవుతుందేమో అన్న టాక్ స్టేట్ వైడ్ గా స్ప్రెడ్ అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/danger-from-women-to-jagan-party-39-201613.html
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.