వైకాపాలో చేరక ముందే దాడికి సెగ

Publish Date:May 3, 2013

Advertisement

 

తెలుగుదేశం పార్టీలో కొందరు తనని పార్టీ నుండి బయటకి పంపేందుకు పొగ పెడుతున్నారని కుంటి సాకులు చెప్పి నిన్న పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరేందుకు ముందే రంగం సిద్దం చేసుకొన్నారు. ఈ రోజు కానీ, సోమవారం గానీ చంచల్ గూడా జైలుకు వెళ్లి జగన్ మోహన్ రెడ్డిని కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకోవాలనుకొంటున్నట్లు ఆయన ఈ రోజే ప్రకటించారు. అయితే, ఆయన జైల్లోకి ప్రవేశించక మునుపే లోపలి నుండి అనకాపల్లి నియోజక వర్గానికి చెందిన వైకాపా నేతలు పొగపెట్టడం మొదలుపెట్టేసారు.

 

అనకాపల్లికే చెందిన దాడి వీరభద్రరావుకి, కొణతాల రామకృష్ణ కుటుంబాలకి మద్య గత రెండు దశాబ్దాలు రాజకీయ వైరం ఉంది. తొలుత కొణతాల కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు, దాడి వీరభద్రరావు ఆయనకు రాజకీయ ప్రత్యర్ధిగా నిలిచి పెనుసవాలు విసిరేరు. కానీ, ఇప్పుడు ఆ రాజకీయ ప్రత్యర్దులిరువురూ భూమి గుండ్రంగా ఉన్నదన్నట్లు వైకాపాలో వచ్చిపడ్డారు.

 

దాడి వీరభద్రరావు రానంత వరకు అనకాపల్లికి సంబందించినంత వరకు వైకాపాలో కొణతాల రామకృష్ణదే పైచేయి. కానీ, ఇప్పుడు దాడి ప్రవేశంతో, ఆయన సీటుకే ఎసరు వచ్చేలా ఉంది. దాడితో బాటు ఆయన కుమారుడు రత్నాకర్ కూడా తరలి వస్తుండటంతో ఆ ఇబ్బంది రెట్టింపయింది. ఈసారి కొణతాల సోదరుడు పెదబాబు అనకాపల్లి శాసన సభకు, రామకృష్ణ లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడు వారిరువురికీ పోటీగా దాడి వీరభద్ర రావు మరియు ఆయన కుమారుడు పోటీకి వస్తున్నారు.

 

దాడి&సన్స్ వైకాపాలో చేరేందుకు ప్రప్రధమ షరతు అనకాపల్లి నియోజక వర్గం సీట్లు కేటాయింపే! గనుక, సహజంగానే కొణతాల సోదరులకు అది ఆందోళన కలిగించే విషయమే అవుతుంది. కొణతాల కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత, గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. అటువంటి తమని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన దాడి&సన్స్ కి టికెట్స్ ఇచ్చేందుకు జగన్ మాట ఇస్తాడేమోనని కొణతాల సోదరులిద్దరు చాలా ఆందోళన చెందుతున్నారు.

 

అయితే రామకృష్ణ ఇంకా బయటపడకపోయినా, ఆయన సోదరుడు పెదబాబు మాత్రం, “తనకు ఎంతో పలుకుబడి ఉందని భావిస్తున్న దాడి వీరభద్రరావుకి గత ఎన్నికలలో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అటువంటి వ్యక్తి మా పార్టీలోకి వచ్చినందువల్ల పార్టీకి పెద్దగా ఒరిగేదేమీ లేదు,” అంటూ బాంబు పేల్చారు. కానీ ఆయన సోదరుడు రామకృష్ణ మాత్రం దాడి వీరభద్రరావు పట్ల వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆయన విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తామంతా దానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు.

 

అయితే, ఇటువంటి పరిస్థితిలో ఏ రాజకీయ నాయకుడయినా సహజంగా అటువంటి ప్రకటనే చేస్తాడు. కానీ, పార్టీ టికెట్స్ పంపకం విషయం వచ్చేసరికి తనకు న్యాయం జరగక పోతే, ఇప్పుడు దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీ మీద అలిగి 30సం.ల అనుబంధాన్ని పుటుకున తెంపుకు వచ్సుసినట్లే, కొణతాల సోదరులు కూడా అలిగి పార్టీ వీడి కాంగ్రెస్ గూటికే చేరినా చేరవచ్చును. అదే జరిగితే, అప్పుడు కొణతాల సోదరులు, దాడి వీరభద్ర రావు & సన్స్ కాంగ్రెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలలో మళ్ళీ ప్రత్యర్దులుగా ఒకరినొకరు ఎదుర్కొంటారేమో!

By
en-us Political News

  
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.