కత్తి మీద సాములా మారిన వ్యవసాయ రుణాలు

Publish Date:Jun 28, 2014

Advertisement

 

వ్యవసాయ రుణాల మాఫీ వ్యవహారం తెరాస, తెదేపా ప్రభుత్వాలకు పెద్ద అగ్నిపరీక్షగా మారాయి. ఈ సమస్యను తెలంగాణా ప్రభుత్వం ఏవిధంగా పరిష్కరించాలని ప్రయత్నిస్తోందో ఇంకా స్పష్టం కాలేదు. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోనే ఉంది. ఒకసారి ఏ ప్రభుత్వానికయినా ఇటువంటి సహాయం అందిస్తే, దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా సహాయం కోసం తమపై ఒత్తిడి తెస్తాయనే భయం ఉంది. అంతే కాక ఇదొక ఆనవాయితీగా మారితే దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కూడా ఉంది. అందుకే వాటి నుండి ఇంతవరకు సానుకూల స్పందన రాలేదు.

 

రుణాల మాఫీకోసం నియమించబడిన కోటయ్య కమిటీ కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ను కలిసి రైతుల పరిస్థితి, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వివరించిన తరువాత ఆయన రుణాలను రీ షెడ్యుల్ చేసేందుకు సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. కానీ బ్యాంకర్లు మాత్రం అటువంటి ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. వేల కోట్ల రుణాలను రీ షెడ్యూల్ చేసినప్పటికీ మళ్ళీ వెంటనే కొత్త రుణాలు మంజూరు చేయవలసి రావడమే అందుకు కారణం. పోనీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా బాగుంటే, బ్యాంకర్లు కూడా అందుకు వెనకాడేవారు కాదు. కానీ ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేమని చెపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భరోసాతో బ్యాంకర్లు రుణాలు రీషెడ్యూల్ మరియు కొత్త రుణాల మంజూరు చేసే సాహసం చేయలేకపోతున్నారు.

 

ఈ రుణాలలో అత్యధిక శాతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కనుక, ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాల రీషెడ్యూల్ మరియు కొత్త రుణాల మంజూరు ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. ఆ బ్యాంక్ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాలలో రుణమాఫీ వ్యవహారం పెద్ద సమస్యగా మారిందని అన్నారు. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలలోనే కాక యావత్ దేశంలో కూడా వర్షాభావ పరిస్థితి ఏర్పడినందున వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేయక తప్పకపోవచ్చునని ఆమె అన్నారు. కానీ త్వరలో వర్షాలు కురిసినట్లయితే ఈ సంకట స్థితి నుండి బయటపడవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేసారు. అంటే ఒకవేళ దేశవ్యాప్తంగా రుణాలు రీ షెడ్యూల్ చేసేందుకు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ పూనుకొన్నట్లయితేనే ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు ఈ సమస్య నుండి బయటపడగలవని లేకుంటే ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోక తప్పదని అర్ధమవుతోంది.

 

చంద్రబాబు జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ఈ సమస్యకు ఒక పరిష్కారం సూచించేందుకు 45రోజుల కాలపరిమితితో కోటయ్య కమిటీని నియమించారు. ఇప్పటికి 20రోజుల పుణ్యకాలం గడిచిపోయింది. కానీ కోటయ్య కమిటీ ఇంతవరకు ఎటువంటి పరిష్కారం సూచించలేకపోయింది. రాష్ట్రంలో ఈ సారి ఇంకా వర్షాలు మొదలవలేదు. మొదలయి ఉండి ఉంటే, కొత్త రుణాల కోసం చంద్రబాబుపై మరింత ఒత్తిడి పెరిగిపోవచ్చును. రుణాల మాఫీతో బాటు కొత్త రుణాలు కూడా వెంటనే మంజూరు చేయవలసి రావడం చంద్రబాబుకి కత్తి మీద సాములా తయారయింది. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏవిధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.


By
en-us Political News

  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.